న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను “బేషరతుగా లొంగిపోమని” హెచ్చరిక జారీ చేసిన తర్వాత, ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ X ప్లాట్ఫామ్లో పర్షియన్ భాషలో “యుద్ధం ఇప్పుడే ప్రారంభమైందనే” సందేశాన్ని పోస్ట్ చేశారు.
అధ్యక్షుడు ట్రంప్ ఉద్దేశ్యం ఏమిటంటే, ఇరాన్… యురేనియంను ఫ్యూరిఫై చేయడం వదులుకోవాలి, లేదంటే అమెరికా ఇజ్రాయెల్-ఇరాన్ వివాదంలో నేరుగా సైనికపరంగా పాల్గొనవచ్చనే సందేశాన్ని అన్యాపదేశంగా అమెరికా ఇచ్చినట్లైంది.
ఖమేనీని “చంపాలని” తన ఉద్దేశం కాదని అమెరికా అధ్యక్షుడు X సందేశంలో చెప్పినప్పటికీ, ఆ సందేశం సార్వభౌమ దేశం ఇరాన్ను చాలా రెచ్చగొట్టేదిగా ఉంది.
అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో ఇలా బెదిరించారు: ఇరాన్ “సుప్రీం లీడర్” ఎక్కడ దాక్కున్నాడో మాకు ఖచ్చితంగా తెలుసు. ఆయన సులభమైన లక్ష్యం, కానీ అక్కడ సురక్షితంగా ఉన్నాడు – మేము అతన్ని చంపడం లేదు. అయితే అమెరికన్ సైనికులపై క్షిపణులు ప్రయోగించాలని మేము కోరుకోవడం లేదు. మా ఓపిక నశించింది. ఈ విషయంలో మీరు శ్రద్ధ వహించినందుకు ధన్యవాదాలు!” అని పోస్ట్ చేశారు.
కాగా, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య వివాదం ఏడవ రోజుకు చేరుకుంది, రెండు వైపులా ఒకరిపై మరొకరు క్షిపణులు, బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఇరాన్ నాయకుడు రాజీ పడటానికి, US బెదిరింపులకు లొంగడానికి నిరాకరించాడు.
ఇరాన్ నాయకుడు ఎక్స్లో ప్రతిస్పందిస్తూ… “యుద్ధం ప్రారంభమైంది. అలీ తన జుల్ఫికర్ (కత్తి)తో ఖైబర్కు తిరిగి వచ్చాడు” అని పోస్ట్ చేశాడు. ఖమేనీ ట్వీట్ను తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ @Khamenei_fa ద్వారా పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ పర్షియన్ భాషలో ఉంది. భారతదేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయ అధికారి ఆ ట్వీట్ నిజమని ధృవీకరించారు.
ఖమేనీ యుద్ధం గురించి ప్రస్తావిస్తూ, ఇరాన్ సైన్యాన్ని, ప్రజలను ప్రోత్సహించడానికి ఖమేనీ సందేశం చాలా ముఖ్యమైనది. ఈ యుద్ధం క్రీస్తు శకం 628లో (హిజ్రీ 7వ సంవత్సరం)లో ముస్లింలు, ఖైబర్ యూదు తెగ మధ్య జరిగింది. దీనికి ప్రవక్త ముహమ్మద్ (స) స్వయంగా నాయకత్వం వహించారు. తరువాత నాల్గవ ఖలీఫా అయిన హజ్రత్ అలీ యుద్ధంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. తన ధైర్యంతో, హజ్రత్ అలీ కోట లోపల ఆశ్రయం పొందిన యూదు దళాలపై దాడి చేయడానికి ముస్లిం సైన్యానికి ప్రవేశం కల్పించే యూదు కోట గేటును తొలగించాడు. తత్ఫలితంగా, ముస్లిం సైన్యం యూదులపై విజయం సాధించింది. తరువాత యూదులను ఖైబర్ నుండి తరిమికొట్టారు. అందుకే ఇరానియన్ నాయకుడు ఖైబర్ యుద్ధం గురించి ప్రస్తావించాడు.
ఈ సందేశంలో ఇజ్రాయెల్, అమెరికాకు హెచ్చరిక కూడా ఉంది, ఖైబర్లోని యూదులు అప్పటి నూతన ముస్లిం దేశమైన మదీనాను సవాలు చేసినందుకు 14 శతాబ్దాల క్రితం ఖైబర్లో ఎదుర్కొన్న ఓటమినే యూదు రాజ్యం రుచిచూడబోతోందని చెబుతోంది. ఈ ట్వీట్ ద్వారా ఇరానియన్ ముస్లింలు టెహ్రాన్ను విడిచిపెట్టరని ఇజ్రాయెల్కు తెలియజేయాలనుకుంటున్నారు, కానీ 628 సంవత్సరంలో ఖైబర్లో వారి పూర్వీకులు చేసినట్లుగా టెల్ అవీవ్ను వదిలి వెళ్ళవలసి వస్తుంది యూదులే. టెహ్రాన్ నివాసితులకు ఇజ్రాయెల్ ఇచ్చిన పిలుపుకు ప్రతిస్పందనగా, ఇరాన్ క్షిపణులతో దాడి చేస్తామని బెదిరించినందున, ఇరాన్ టెల్ అవీవ్ నివాసితులను నగరం విడిచి వెళ్ళమని కోరింది. దీనిని బట్టి అర్థం అయ్యేదేంటంటే ఇజ్రాయెల్, ఇరాన్ నాయకులు ప్రస్తుత సంఘర్షణకు మతపరమైన కోణాన్ని ఇచ్చినట్లు కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా, అమెరికా జెరూసలేంలో తన రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసింది, దీని అర్థం యుఎస్ ఇజ్రాయెల్-ఇరాన్ వివాదంలో సైనికపరంగా పాల్గొనే అవకాశం ఉందని అర్థం.
ఈ అంశంపై ఇరాన్ వైఖరి, జెరూసలేంలో అమెరికా తన రాయబార కార్యాలయాన్ని మూసివేసినందున, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రమవుతుందని ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుస్తోంద. అమెరికా నేరుగా యుద్ధంలో పాల్గొని ఇరాన్పై దాడి చేసే అవకాశం ఉంది.