హైదరాబాద్: మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన ఒక రోగి బతికుండగానే మార్చురీలోకి తరలించడం కలకలం రేపింది. ఆధార్ కార్డు లేని కారణంగా ఆసుపత్రిలో చేర్చుకోని, ఆ తర్వాత పొరపాటున మార్చురీకి పంపినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆసుపత్రి సిబ్బందిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోగ్య అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కాగా, ఆ వ్యక్తి తాను కిడ్నీ సమస్య చికిత్స కోసం వచ్చానని చెప్పాడు, కానీ అడ్మిషన్ నిరాకరించారని చెప్పాడు. “నేను ఐదు రోజుల క్రితం మహబూబాబాద్కు వచ్చాను. నాకు కిడ్నీ సమస్యలు ఉన్నాయి. ఆసుపత్రిలో అడ్మిట్ కోసం వచ్చాను. ఆధార్ కార్డు లేకపోవడం. ఒంటరిగా ఉండటం (నాతో పాటు అటెండర్ లేడు) కారణంగా వైద్యుడు నాకు చికిత్స నిరాకరించాడు. నా గ్రామానికి తిరిగి వెళ్లడానికి నా దగ్గర డబ్బు లేదు. నేను రెండు రోజులు ఆసుపత్రి ఆవరణలో పడుకున్నాను” అని ట్రక్ డ్రైవర్గా పనిచేస్తున్న ఆ వ్యక్తి పేర్కొన్నాడు.
ఆసుపత్రి సిబ్బందిలో ఒకరు అతన్ని చూసి మార్చురీ ముందు ఉన్న బెంచ్కు తరలించారు. తరువాత, బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని చనిపోయినట్లు భావించి మార్చురీ లోపలికి తీసుకెళ్లారని ఆయన పేర్కొన్నారు. మార్చురీ లోపల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని మార్చురీ సిబ్బంది నుండి సమాచారం అందుకున్న పోలీసులు, వారు వచ్చి ధృవీకరించి ఆ వ్యక్తి ఇంకా బతికే ఉన్నాడని గ్రహించి, రోగిని ఆసుపత్రికి తరలించారని తెలిపారు. అయితే దీనిపై ఎటువంటి కేసు నమోదు కాలేదని వారు తెలిపారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆ వ్యక్తి ఆసుపత్రిలో ఇన్-పేషెంట్ లేదా అవుట్ పేషెంట్ కాదని ఆరోగ్య అధికారులు తెలిపారు. వైద్యులు అతన్ని చనిపోయినట్లు ప్రకటించలేదు. మార్చురీ గదికి తరలించలేదు. బుధవారం సాయంత్రం వర్షం పడుతున్నప్పుడు ఆ వ్యక్తి మార్చురీ పక్కన ఉన్న రోడ్డుపై అపస్మారక స్థితిలో కనిపించాడని, ఆసుపత్రి భద్రతా సిబ్బంది మరియు అతనిని మార్చురీ ముందు ఉన్న బెంచ్ మీద ఉంచారని ఆరోగ్య అధికారి ఒకరు తెలిపారు.
కాగా, అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి అక్యూట్ మెడికల్ కేర్లో చేర్చారు. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నారని అధికారి తెలిపారు. ఆ వ్యక్తి చనిపోయాడని భావించి మార్చురీ గది లోపలికి తరలించాడనే వాదనపై, వైద్యులు అతన్ని పరీక్షించలేదని అధికారి తెలిపారు.
“ఆ వ్యక్తిని మార్చురీ గది లోపలికి తరలించలేదు. అతన్ని మార్చురీ ఆవరణలోని ఒక బెంచ్ మీద ఉంచి, చికిత్స కోసం ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లారు” అని అధికారి తెలిపారు, ఈ సంఘటనపై వారు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.


