కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఓటు హక్కు లేకుండా పోయే అవకాశం ఉందని బాధపడుతూ మరొక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అధికార తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్రంలో SIRకు వ్యతిరేకంగా తన వాదనను వినిపించింది. భారతీయ జనతా పార్టీ ఆదేశం మేరకు ఎన్నికల కమిషన్ ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తోందని ఆరోపించింది.
“మా చివరి రక్తపు బొట్టు వరకు, ప్రజల హక్కులను కాపాడటానికి,మన దేశ సామాజిక నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ, దాని మిత్రపక్షాల దుర్మార్గపు ఎజెండాను ఓడించడానికి మేము పోరాడుతాము” అని రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ గురువారం X లో పోస్ట్ చేశారు, దేశంలోని చట్టబద్ధమైన పౌరుడిని “బయటి వ్యక్తి”గా ముద్ర వేసే ఏ ప్రయత్నాన్ని అయినా ప్రతిఘటిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
బిర్భూమ్లోని ఇలాంబజార్లోని తన కుమార్తె నివాసంలో క్షితీష్ మజుందార్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత…బెంగాల్ సీఎం X లో పోస్ట్ చేశారు. SIR తర్వాత తన ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని 95 ఏళ్ల మృతుడు వాపోయినట్టు అతని కుటుంబం పోలీసులకు తెలిపింది.
సోమవారం 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో SIR ను ప్రారంభించినట్లు EC ప్రకటించిన తర్వాత, ఓటు హక్కు లేదా పౌరసత్వం కోల్పోతారనే భయంతో పశ్చిమ బెంగాల్లో ఆత్మహత్య చేసుకున్న రెండవ వ్యక్తి మజుందార్.
అంతకుముందు, 57 ఏళ్ల ప్రదీప్ కర్ ఉత్తర 24 పరగణాలోని పానిహతిలో ఆత్మహత్య చేసుకుని మరణించారు. తన మరణానికి జాతీయ పౌర రిజిస్టర్ కారణమని ఆరోపిస్తూ ఒక సూసైడ్ నోట్ రాశారు. పొరుగున ఉన్న అస్సాంలో జరిగినట్లే పశ్చిమ బెంగాల్లో కూడా NRC తయారు చేసే ప్రక్రియ అవకాశాల గురించి ఆయన ఆందోళన చెందారు. పశ్చిమ బెంగాల్లో NRC తయారీ ప్రక్రియను ప్రారంభించడానికి ఒక రహస్య ప్రయత్నమే SIR అని TMC అభివర్ణిస్తోంది.
అంతేకాదు కూచ్ బెహార్లోని దిన్హాటాలోని జిత్పూర్ నివాసి ఖైరుల్ షేక్ విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. SIR ద్వారా తన పేరు ఓటర్ల జాబితా నుండి తొలగించే అవకాశం ఉందని కూడా అతను ఆందోళన చెందాడు. పశ్చిమ బెంగాల్లో EC చివరిసారిగా ఓటర్ల జాబితాల ఇంటెన్సివ్ సమీక్ష నిర్వహించినప్పుడు, 2002లో తన పేరు ఓటరు జాబితాలో తప్పుగా నమోదు చేసారనిఆయన ఆందోళన చెందారు.
పశ్చిమ బెంగాల్లో TMCకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న BJP… SIRపై తన ఆశను పెట్టుకుంది. 2026 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీని ఎదుర్కోవడానికి, మమతా బెనర్జీ పార్టీ…ప్రదీప్ కర్, మజుందార్ మరణాలను, ఖైరుల్ ఆత్మహత్యాయత్నాన్ని ఆయుధంగా చేసుకుని ఈ ప్రక్రియకు నిరసన వ్యక్తం చేసింది.
“ఈ రాజకీయ విషాదాలకు ఎవరు సమాధానం చెబుతారు? హోంమంత్రి బాధ్యతను స్వీకరిస్తారా? ఈ భయానక మానసిక స్థితికి కారణమైన బిజెపి, దాని మిత్రపక్షాలు మాట్లాడే ధైర్యం ఉందా?” అని టిఎంసి అధినేత్రి ఎక్స్లో రాశారు.
మమత వారసుడు, టిఎంసి ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ బుధవారం ప్రదీప్ కర్ నివాసాన్ని సందర్శించారు. ఆయన మరణానికి బిజెపి , ఈసీయే కారణమని విమర్శించారు. టిఎంసి “జస్టిస్ ఫర్… ప్రదీప్ కర్” ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. బుధ, గురువారాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించింది.
“తరతరాలుగా, బెంగాల్ ప్రజలు గౌరవంగా జీవించారు. అయినా వారిని విదేశీయులుగా ముద్ర వేస్తున్నారు. “ఈ క్రూరత్వం మనస్సాక్షికి విరుద్ధమైనది అని మమత X లో రాశారు. “ప్రతి పౌరుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను:, విశ్వాసం కోల్పోవద్దు, ఎటువంటి తీవ్రమైన అడుగు వేయవద్దు. మా మా-మతి-మనుష్ సర్కార్ మీతో ఉంది. బెంగాల్లో NRCని అమలు చేయడానికి మేము అనుమతించము.” “ఒక్క చట్టబద్ధమైన పౌరుడిని కూడా ‘బయటి వ్యక్తి’గా ముద్ర వేయడానికి మేము అనుమతించము” అని మమత పేర్కొన్నారు.
అయితే, ప్రదీప్ కర్ బంధువులలో ఒకరు తన కుడి చేతి నాలుగు వేళ్లను కోల్పోయారని , అతను సూసైడ్ నోట్ రాసి ఉండకపోవచ్చని బిజెపి పేర్కొంది. అతని మరణంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేయాలని పార్టీ డిమాండ్ చేసింది.


