Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

చేవెళ్ల బస్సు దుర్ఘటన…బీజాపూర్ హైవే విస్తరించాలని స్థానికుల డిమాండ్!

Share It:

హైదరాబాద్: చేవెళ్ల బస్సు ప్రమాదం .. చాలా కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం… రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ గ్రామస్తులు బీజాపూర్ హైవే వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. రహదారి విస్తరించకపోవడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని వారు వాపోయారు.

వికారాబాద్-బీజాపూర్ హైవేలోని గ్రామాల్లో నివసిస్తున్న అనేక మంది విద్యార్థులు, స్థానికులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. హైవేపై అధిక సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నందున, రోడ్డు విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ వారు రోడ్డును దిగ్బంధించారు. ఈ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

గత సోమవారం చేవెళ్ల రోడ్డులోని మీర్జాపూర్ వద్ద ఒక TGSRTC బస్సు కంకరతో నిండిన టిప్పర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాధితులు ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. దాదాపు 22 మంది గాయపడ్డారు.

ఇరుకైన రోడ్డు ప్రమాదానికి స్థానికులు కారణమని చెబుతున్నారు. డిసెంబర్ 2024లో, చేవెళ్ల రోడ్డులోని ఆలూర్ వద్ద రోడ్డు పక్కన ఉన్న మార్కెట్‌లోకి లారీ ఢీకొట్టడంతో నలుగురు కూరగాయల వ్యాపారులు మరణించగా, 10 మంది గాయపడ్డారు. హైవేపై ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ హైవేను విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రయాణీకులు చెబుతున్నారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.