Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ ఏర్పాట్లను సమీక్షించిన సీఎం రేవంత్!

Share It:

హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ భూముల్లో డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ కోసం పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో క్రియాశీల పాత్ర పోషించాల్సిన అన్ని విభాగాలు ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌’లో పాలుపంచుకోవాలని కోరారు.

వేదిక వద్ద ఏర్పాట్లను సమీక్షించిన ముఖ్యమంత్రి, అనేక మంది విఐపిలు, ప్రముఖుల సందర్శన దృష్ట్యా, అంతర్జాతీయ కార్యక్రమానికి గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్‌లో ఒక్క ప్రతినిధి కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారని అధికారిక ప్రకటన తెలిపింది.

pic.twitter.com/n0L34P36eu

“ప్రపంచం నలుమూలల నుండి ప్రతినిధులు, రాయబారులు వివిధ దేశాలకు చెందిన వారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని” సీఎం అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలను దిశానిర్దేశం చేసే తెలంగాణ రైజింగ్‌ డాక్యుమెంట్‌లో పొందుపరిచిన అంశాలపై సంబంధిత విభాగాలతో ఈనెల 25 నుంచి వరుసగా సమీక్షలు చేయనున్నట్లు సీఎం తెలిపారు. భద్రతా ఏర్పాట్లను జాగ్రత్తగా చేయాలని సీఎం పోలీసులను ఆదేశించారు. పాస్ లేకుండా ఎవరినీ వేదికలోకి అనుమతించరాదని ఆయన అన్నారు.

వేదిక వద్ద విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ విధులను నిర్వర్తించడానికి తగిన సౌకర్యాలు కల్పించాలని ఆయన అన్నారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, సీఎంవో ముఖ్యకార్యదర్శి శేషాద్రితో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.