హైదరాబాద్: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) హైదరాబాద్, మైసూర్, విశాఖపట్నం నుండి నిరుద్యోగ యువకులను మయన్మార్కు రవాణా చేసి, వ్యవస్థీకృత సైబర్ క్రైమ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న ఐదుగురిని అరెస్టు చేసింది.
నిందితుల్లో వరంగల్ స్థానికుడు కుత్బుల్లాపూర్కు చెందిన వాసం గోవర్ధన్; వరంగల్ స్థానికుడు బానోతు మదన్లాల్; మైసూర్కు చెందిన సయ్యద్ మహ్మద్ మదాని; ఆంధ్రాలోని కృష్ణ జిల్లాకు చెందిన సుగ్గన సుధీర్ కుమార్, ఉప్పల్ (తిరుపతి స్థానికుడు) నుండి గంగాల నవీన్.
బాధితుల్లో ఒకరైన చరణ్ ఫిర్యాదు ఆధారంగా అరెస్టులు జరిగాయి. లాభదాయకమైన విదేశీ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి “ఏజెంట్లు” తమను ఆకర్షించారని ఆయన పేర్కొన్నారు.
దీనికోసం “ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పడింది. దర్యాప్తులో వివిధ అక్రమ రవాణా నెట్వర్క్లలో పాల్గొన్న పలు నిందితులు బయటపడినట్లు” తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు.
ప్రధాన నిందితుడు వాసం గోవర్ధన్… విదేశీ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యుగా అనే కన్సల్టెన్సీ కంపెనీని స్థాపించాడు. అతను ఈ కంపెనీని ప్రభుత్వ చట్టం ప్రకారం నమోదు చేయలేదు. అలాగే చెల్లుబాటు అయ్యే పత్రాలు లేదా లైసెన్స్లతో నిర్వహించలేదు. సోషల్ మీడియా ద్వారా నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకున్నాడు.
అతని స్నేహితుడు, మరొక నిందితుడు బానోత్ మధన్లాల్ ఇంటర్వ్యూలు నిర్వహించే ఇన్స్టాగ్రామ్ ఐడిని అందించిన సుధీర్ కుమార్ను కలిశాడు. “మదన్లాల్ను ఒక మహిళ ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేసింది, ఆమె అతనికి మయన్మార్కు విమాన టిక్కెట్లు పంపింది, అక్కడ అతను చైనా నడిపే మోసపూరిత కేంద్రంలో చేరాడు” అని గోయల్ చెప్పారు.
అక్కడికి చేరుకున్న తర్వాత, ఈ మోసపూరిత కేంద్రాలు ప్రతి రిక్రూట్కు కమీషన్గా 3000, 5000 డాలర్ల మధ్య ఆఫర్ చేస్తున్నాయని మదన్లాల్ గ్రహించాడు. తెలిసిన తర్వాత, గోవర్ధన్ ఉపాధి అవకాశాలను ప్రకటించడం ప్రారంభించాడు. ఆన్లైన్లో అభ్యర్థులను వెతకడం ప్రారంభించాడు. నియామకాన్ని సులభతరం చేయడానికి అతను వరంగల్లో ఒక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశాడు.
ఈ ప్రకటనల ద్వారానే చరణ్ ఉద్యోగం కోసం గోవర్ధన్ను సంప్రదించాడు. అతను భారీ మొత్తంలో డబ్బు ఇచ్చి మయన్మార్లోని మైవాడికి ప్రయాణించాడు. అక్కడ, ఆ యువకుడు తనలాంటి అనేక మందితో కలిసి సైబర్ క్రైమ్ కార్యకలాపాలకు బలవంతంగా పాల్పడాల్సి వచ్చింది. పెట్టుబడి మోసాలు, డిజిటల్ అరెస్టులు, OTP హార్వెస్టింగ్, హనీ ట్రాప్లు వంటివి ఇందులో ఉన్నాయి.
వారు ప్రతిఘటించగా, వారిని బెదిరించి 5000 డాలర్లు చెల్లించమని అడిగారు. దీంతో వారికి పని చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. చరణ్, ఇతరులను నిర్బంధించారు. వారి పాస్పోర్ట్లను స్వాధీనం చేసుకున్నారు. విదేశీయులు నిర్వహించే ఆన్లైన్ స్కామ్ కార్యకలాపాలలో రోజుకు 16–18 గంటలు పని చేయించారు.
“ఈ అరెస్టులు… కొనసాగుతున్న SIT ఆపరేషన్లో భాగం. విదేశాల నుండి పనిచేస్తున్న గుర్తించి… నిందితులపై మేము లుక్ అవుట్ సర్క్యులర్లు (LOCలు) జారీ చేసాము” అని గోయెల్ చెప్పారు.


