Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

గాజా కాల్పుల విరమణ…తదుపరి దశపై హమాస్ షరతులు!

Share It:

జెరూసలేం: ఇజ్రాయెల్‌ కీలకమైన సరిహద్దు క్రాసింగ్‌ను తెరవడానికి, ప్రాణాంతక దాడులను నిలిపివేయడానికి, పాలస్తీనా భూభాగంలోకి మరింత సహాయాన్ని అనుమతించడానికి ఆదేశంపై తీవ్ర ఒత్తిడి వచ్చే వరకు గాజా కాల్పుల విరమణ ఒప్పందం తదుపరి దశకు వెళ్లబోమని హమాస్ నాయకుడు బెదిరించాడు.

కాల్పుల విరమణ ఒప్పందం తదుపరి దశలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని, గాజాలో ఉన్న చివరి బందీ అవశేషాలను తిరిగి ఇవ్వాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం చెప్పడంతో హమాస్‌ ఈ వ్యాఖ్యలు చేసింది.

ఈమేరకు హమాస్ రాజకీయ విభాగం సభ్యుడు హుసామ్ బద్రన్ మాట్లాడుతూ… కాల్పుల విరమణ సజావుగా ముందుకు సాగడానికి ముందు “మొదటి దశ అన్ని నిబంధనలను పూర్తిగా అమలు చేయాలని” పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ నియంత్రణలో ఉన్న భూభాగంలో ఇప్పటికీ పాలస్తీనియన్ గృహాలను కూల్చివేయడం కొనసాగించడాన్ని ముగించాలని ఆయన పేర్కొన్నారు.

మరోవంక అక్టోబర్ 10న కాల్పుల విరమణ ముగిసినప్పటి నుండి గాజాలో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాల ఫలితంగా కనీసం 376 మంది పాలస్తీనియన్లు మరణించారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు.

కాగా, చర్చలలో హమాస్‌కు చాలా తక్కువ ప్రభావం ఉంది. ఖతార్, టర్కీ వంటి ఇతర ప్రాంతీయ దేశాల నుండి ఈ సున్నతమైన కాల్పుల విరమణను ఉల్లంఘించవద్దని తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవచ్చు.

హమాస్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ కూడా ఆరోపించింది. కాల్పుల విరమణ రేఖకు దగ్గరగా వచ్చే వారిపై దాడులకు ప్రతిస్పందనగా తన దాడులను ఇజ్రాయెల్‌ సమర్థించుకుంది. అయితే, పాలస్తీనా ఆరోగ్య అధికారుల ప్రకారం… చనిపోయిన వారిలో చాలామంది మహిళలు, పిల్లలు ఉన్నారు. కొన్ని దాడులు “సురక్షిత మండలం”లో జరిగాయని పాలస్తీనా అధికారులు తెలిపారు.

గాజాలో కొనసాగుతున్న మానవతా సంక్షోభం మధ్య…ఐక్యరాజ్యసమితి, ఇతర సహాయ సంస్థలు ఆ ప్రాంతానికి తగినంత సహాయం చేరుకోవడం లేదని పేర్కొన్నాయి.

వినాశనానికి గురైన భూభాగం భవిష్యత్తు కోసం… US నేతృత్వంలోని ప్రణాళిక ఇటీవలి వారాల్లో ఊపందుకుంటున్నందున హమాస్ ఈ వ్యాఖ్యలు చేసింది.

గాజాలో ఉన్న చివరి బందీ అవశేషాలను హమాస్ తిరిగి ఇచ్చిన తర్వాత…ఇజ్రాయెల్-హమాస్ “త్వరలో కాల్పుల విరమణ రెండవ దశలోకి అడుగుపెడతాయని భావిస్తున్నామని” ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తాజాగా అన్నారు. గాజాలో ఇజ్రాయెల్ దాడుల విధ్వంసం బందీల అవశేషాలను కనుగొనడంలో అడ్డంకిగా ఉందని హమాస్ తెలిపింది.

ఇదిలా ఉండగా, కాల్పుల విరమణ తదుపరి దశలో గాజా స్ట్రిప్‌ను నిర్వహించడానికి ఒక అంతర్జాతీయ సంస్థను ఈ సంవత్సరం చివరి నాటికి ప్రకటించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఖతార్ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్‌రెహ్మాన్ అల్ థాని సైతం గాజా కాల్పుల విరమణ “క్లిష్టమైన క్షణానికి” చేరుకున్నట్లు ఐటీవలే చెప్పారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.