హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తోంది. జనాభా పెరుగుదలతో పాటు.. నగరంలో చెత్త సమస్య కూడా పెరుగుతోంది. ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోవడం, చెత్తకుప్పలు నిండిపోవడం వంటివి మామూలయ్యాయి. ఈ పరిస్థితుల్లో నగరం అంతటా చెత్త డంప్లను (GVPs) అందంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ వినూత్న చర్యలు చేపట్టింది.
ఈమేరకు నగరవ్యాప్తంగా 2,500 కంటే ఎక్కువ చెత్త డంప్లను గుర్తించారు. ఈ ప్రదేశాలలో పరిశుభ్రతను కాపాడుకునే బాధ్యతను పారిశుధ్య సిబ్బందికి అప్పగించారు. ఇందులో భాగంగా… ఎంపిక చేసిన వాణిజ్య సంస్థలలో చెత్త డబ్బాలను ఏర్పాటు చేయడం, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తున్న వ్యాపారాలపై జరిమానాలు విధించడం వంటి అనేక చర్యలు చేపట్టారు.
చెత్త వేసే ప్రదేశాల్లో “సాంప్రదాయ కళ రంగోలిని ఉపయోగించి, రంగురంగుల ముగ్గులు వేస్తున్నారు. ఈ ప్రదేశాలను రక్షించడానికి మరియు స్వచ్ఛ హైదరాబాద్ స్ఫూర్తిని నిలబెట్టడానికి పౌరులను ప్రోత్సహించడానికి అన్ని GHMC సర్కిల్లలో ఈ కార్యాచరణ చేపట్టారని GHMC సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. చెత్త వేసే ప్రదేశాలను అందంగా ఉంచేందుకు వీలుగా సమీపంలోని చెత్త బుట్టలను ఉపయోగించుకోవాలని, వ్యర్థాలను GHMC స్వచ్ఛ ఆటోలకు అప్పగించాలని పౌరులను కోరారు.
జవాబుదారీతనాన్ని బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా తమకు కేటాయించిన చెత్త డంప్లను (GVPs) చెత్త రహితంగా ఉంచడంలో విఫలమైన పారిశుధ్య సిబ్బందిపై జరిమానాలు విధించాలని పౌర సంస్థ నిర్ణయించింది. తొలగింపు ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ ప్రదేశాలలో చెత్త ఎత్తివేతకు సమయాలను కూడా నిర్ణయించారు.
ఈమేరకు పాఠశాలలు, వీధులలో స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రతిజ్ఞను నిర్వహించడం ద్వారా GHMC స్వచ్ఛ సర్వేక్షణ్ 2025 స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లింది. పరిశుభ్రత అనేది ఒకేసారి జరిగేది కాదు. అవగాహన, బహిరంగ స్థలాల పట్ల గౌరవం ఇవ్వాలనే సందేశాన్ని బలోపేతం చేసింది. ఈ కార్యక్రమంలో పారిశుధ్య అధికారులు… పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే పద్ధతులపై అవగాహన కల్పించారు.
ఇందులో భాగంగా వీటిలో డస్ట్బిన్లను ఉపయోగించడం, ప్రతిరోజూ స్వచ్ఛ ఆటోలకు వ్యర్థాలను అప్పగించడం, GVPల వద్ద డంపింగ్ చేయకుండా ఉండటం, వీధులు, ఫుట్పాత్లు, బహిరంగ ప్రదేశాలను శుభ్రంగా ఉంచడం, తడి,పొడి వ్యర్థాలను మూల వద్ద వేరు చేయడం, వ్యర్థాలను తగ్గించడం, సాధ్యమైన చోట తిరిగి ఉపయోగించడం, సమాజంలో పరిశుభ్రమైన అలవాట్లను ప్రోత్సహించడం వంటివి ఉన్నాయి.


