Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఇండోర్ నీటి కాలుష్యం…‘ఘంటా’ పదాన్ని ప్రస్తావించినందుకు అధికారి సస్పెండ్!

Share It:

ఇండోర్/దేవాస్: ఇండోర్ నీటి కాలుష్య సంక్షోభం మధ్య, మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాకు చెందిన ఒక సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్‌ను సస్పెండ్ చేశారు. మంత్రి కైలాష్ విజయవర్గీయ చేసిన వివాదాస్పద వ్యాఖ్యను, కాంగ్రెస్ ఆరోపణలను తన అధికారిక ఉత్తర్వులో ఉటంకించినందుకు ఆయనపై ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

అధికారిక విధులను నిర్వర్తించడంలో తీవ్ర నిర్లక్ష్యం, ఉదాసీనత, అవకతవకలకు పాల్పడిన ఆరోపణలపై ఉజ్జయిని డివిజన్ రెవెన్యూ కమిషనర్ ఆశిష్ సింగ్‌ను సస్పెండ్ చేసినట్లు వారు చెప్పారు.

ఆదివారం దేవాస్‌లో కాంగ్రెస్ నిరసన దృష్ట్యా శాంతిభద్రతలను కాపాడటానికి కింది స్థాయి రెవెన్యూ సిబ్బందిని మోహరించాలని ఎస్‌డిఎం శనివారం ఒక ఉత్తర్వు జారీ చేశారని అధికారులు తెలిపారు. “అయితే, అధికారిక ప్రయోజనాల కోసం జారీ చేసిన ఆ ఉత్తర్వులో కాంగ్రెస్ మెమోరాండంలోని ఒక భాగాన్ని ఆ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్‌ యథాతథంగా కాపీ చేశారు. ఇది తీవ్రమైన నిర్లక్ష్యానికి సమానం” అని ఒక సీనియర్ అధికారి పీటీఐకి తెలిపారు.

ఇండోర్ తాగునీటి సంక్షోభంపై కాంగ్రెస్ మెమోరాండం… రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఒక జర్నలిస్ట్ ప్రశ్నకు సమాధానంగా మంత్రి కైలాష్ విజయవర్గీయ ‘ఘంటా’ అనే అభ్యంతరకరమైన పదాన్ని ఉపయోగించడం “అమానవత్వం, నిరంకుశత్వాన్ని” ప్రతిబింబిస్తుందని పేర్కొంది.

రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జీతూ పట్వారీ ఆదేశాలను ఉటంకిస్తూ… ఈ “అమానవీయ ప్రవర్తనకు” వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల నివాసాల వెలుపల గంటలు మోగిస్తూ పార్టీ కార్యకర్తలు ‘ఘంటా’ నిరసనలు చేపడతారని ఆ మెమోరాండంలో పేర్కొన్నారు.

ఇండోర్‌లోని భాగీరత్‌పురా ప్రాంతంలో కలుషితమైన తాగునీటి కారణంగా సంభవించిన మరణాలు, ఈ విషాదం గురించి ప్రశ్నించిన ఒక టీవీ జర్నలిస్ట్‌తో విజయవర్గీయ చేసిన వివాదాస్పద వ్యాఖ్యకు వ్యతిరేకంగా ఈ నిరసనను నిర్వహించారు.

రాష్ట్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి అయిన విజయవర్గీయ, నీటి కాలుష్య సంక్షోభం గురించి అడిగినప్పుడు డిసెంబర్ 31 రాత్రి కెమెరా ముందు ‘ఘంటా’ అనే పదాన్ని ఉపయోగించి వివాదాన్ని రేకెత్తించారు. సాధారణ వాడుకలో, ఈ పదానికి స్థూలంగా “అర్థం లేనిది” అని అర్థం.

నగరంలో కలుషిత నీటి వల్ల కలిగిన అతిసార వ్యాప్తి కారణంగా ఇప్పటివరకు ఆరుగురు మరణించినట్లు ప్రభుత్వ యంత్రాంగం ధృవీకరించింది. దీనికి సంబంధించి 10 మరణాల గురించి తనకు సమాచారం ఉందని మేయర్ పుష్పమిత్ర భార్గవ్ జనవరి 2న చెప్పారు. అయితే, ఈ వ్యాప్తి కారణంగా ఆరు నెలల పసికందుతో సహా 16 మంది మరణించారని స్థానికులు పేర్కొన్నారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.