Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

జాబ్‌ క్యాలెండర్‌ విడుల చేయాలంటూ హైదరాబాద్‌లో నిరసన చేపట్టిన యువత!

Share It:

హైదరాబాద్: తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జాబ్‌ క్యాలెండర్‌ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సిటీలోని అశోక్ నగర్ లో మరోసారి భారీగా నిరుద్యోగ యువత రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగింది. దీంతో నిరసనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఆ తర్వాత వారిలో చాలా మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందుజాగ్రత్త చర్యగా సుమారు 10 మందిని అరెస్టు చేసి ప్రస్తుతం కస్టడీలో ఉంచినట్లు చిక్కడపల్లి పోలీసులు తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం 2024 ఆగస్టులో ఎన్నికల హామీలో భాగంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేస్తూ ఉద్యోగ క్యాలెండర్‌ను విడుదల చేసింది. అయితే, అప్పటి నుండి ఎలాంటి నియామక నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడంతో యువత అయోమయంలో పడిపోయారు.

కాగా, నిరసన తెలుపుతున్న యువతపై పోలీసుల బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు చర్యను ఖండించారు. వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 60,000 ఉద్యోగాలు యువతకు ఇచ్చామని కాంగ్రెస్ “తప్పుడు ప్రచారం చేస్తోందని” ఆయన ఆరోపించారు.

“గ్రంథాలయాల్లో కూడా పోలీసు లాఠీచార్జీలు జరిపిన అరాచక చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. విద్యార్థులు, నిరుద్యోగుల నడ్డి విరిచిన అమానవీయ పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిది. నిరుద్యోగుల గుండెల్లో రగులుతున్న నిరసన జ్వాలలను ఆంక్షలు, నిషేధాలతో ఆర్పలేరు. ఈరోజు గాయపడిన ప్రతి నిరుద్యోగికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని” అని హరీష్‌రావు ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. నిరుద్యోగులపై లాకప్ హింస, బెదిరింపులకు పాల్పడితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు.

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె కవిత కూడా నిరసనకారులకు సంఘీభావం తెలిపారు, వారి అరెస్టులను విమర్శిస్తూ ఈ చర్యను “హేయమైనది” అని అభివర్ణించారు. “కాంగ్రెస్ గెలిస్తే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగులను నమ్మించి, వారిని మోసం చేసి, ద్రోహం చేసింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా, 20 వేల కంటే ఎక్కువ కొత్త ఉద్యోగాలు కల్పించలేదు. ఉద్యోగ క్యాలెండర్‌ను వెంటనే ప్రకటించాలి. దానికి అనుగుణంగా నోటిఫికేషన్లు జారీ చేయాలి. అరెస్టు చేసిన నిరుద్యోగులను వెంటనే విడుదల చేయాలి,” అని ఆమె ఎక్స్‌లో పేర్కొన్నారు.

కాగా, నిరుద్యోగ యువత దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్ వద్ద బ్యానర్లు పట్టుకుని, “మాకు కాంగ్రెస్ పాలన వద్దు,” “మాకు న్యాయం కావాలి,” “అసెంబ్లీలో ప్రకటించిన ఉద్యోగ క్యాలెండర్‌ను వెంటనే విడుదల చేయాలి” వంటి నినాదాలు చేస్తూ ట్రాఫిక్‌ను దిగ్బంధించారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.