చైబాసా, జార్ఖండ్: సీపీఐ (మావోయిస్ట్) కేంద్ర కమిటీకి చెందిన ఉన్నత స్థాయి సభ్యుడు పతిరామ్ మాఝీ అలియాస్ అనల్దా నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లో ఎన్కౌంటర్ అయ్యాడు. కాగా, సారండ అడవిలో 209 కోబ్రా, చైబాసా జిల్లా పోలీసులు, జార్ఖండ్ జాగ్వార్ సంయుక్తంగా మేఘాబురు ఆపరేషన్ను ప్రారంభించాయి. ఈక్రమంలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మొత్తం 17 మంది మావోస్టులు మృతి చెందారని ఆపరేషన్ ఐజీ మైఖేల్ రాజ్ వెల్లడించారు.
అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వారికి మావోయిస్టులు తారసపడి జవాన్లపైకి కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులకు దిగడంతో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు.
అనల్, సీపీఐ (మావోయిస్ట్) అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన కేంద్ర కమిటీ సభ్యుడు (సీసీఎం), అతనిపై జార్ఖండ్లో ఏకంగా 149 కేసులు ఉన్నాయి. శుక్రవారం గాలింపు చర్యల సమయంలో, మధ్యమధ్యలో కాల్పులు కొనసాగాయి. భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ను ఒక పెద్ద విజయంగా పరిగణిస్తున్నాయి.
ఈమేరకు ఎస్డిపిఓ (కిరిబురు) అజయ్ కెర్కెట్టా మాట్లాడుతూ… “దాదాపు రెండు రోజుల పాటు కొనసాగిన ఎన్కౌంటర్ ఇప్పుడు ఆగిపోయింది, కానీ పగటి వెలుగులో గాలింపు చర్యలు తిరిగి ప్రారంభమవుతాయి” అని అన్నారు. ఇదిలా ఉండగా, చైబాసాలోని సారండ అడవుల ప్రాంతంలో గురువారం ప్రారంభమైన ఎన్కౌంటర్ రెండో రోజు కూడా పోలీసులు తెలిపారు.
జనవరి ప్రారంభంలో, బస్తర్ పరిధిలోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు నక్సల్స్ హతమయ్యారని అధికారులు తెలిపారు. జనవరి 20న, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ… పట్టణ నక్సలిజం పెరుగుతున్న ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశారు.
దాని తరువాత, మొత్తం రూ. 47 లక్షల రివార్డు ఉన్న తొమ్మిది మంది మావోయిస్టులు ఆయుధాలు, పరికరాల నిల్వతో సహా ఛత్తీస్గఢ్లో లొంగిపోయారని ఒడిశా పోలీసులు శుక్రవారం తెలిపారు. ఈ లొంగుబాటు తరువాత, ఒడిశాలోని నవరంగ్పూర్ జిల్లాను నక్సల్ కార్యకలాపాలు లేని జిల్లాగా ప్రకటించారు.
పోలీసుల ప్రకారం… లొంగిపోయిన మావోయిస్టులలో ధమతరి-గరియాబంద్-నువాపడ డివిజన్ పరిధిలోని ఒడిశా రాష్ట్ర కమిటీకి చెందిన నాగిరి ఏరియా కమిటీ, సీతానది ఏరియా కమిటీ, మెయిన్పూర్ ఎల్జిఎస్కు చెందిన కీలక నాయకులు ఉన్నారు. వారు సీపీఐ (మావోయిస్ట్) ఒడిశా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఒడిశాలోని నవరంగ్పూర్ జిల్లాలో, ఛత్తీస్గఢ్లోని ధమ్తరి జిల్లాలో చురుకుగా కార్యకలాపాలు సాగించారు.
లొంగిపోయిన క్యాడర్లు రెండు ఇన్సాస్ రైఫిళ్లు, రెండు ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు, ఒక కార్బైన్, ఒక భర్మర్ గన్, మ్యాగజైన్లు, మందుగుండు సామగ్రి మరియు ఒక రేడియో సెట్ను అప్పగించారని పోలీసులు తెలిపారు.


