Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

బడ్జెట్ రోజున స్టాక్‌మార్కెట్ పతనాన్ని కొట్టిపారేసిన ప్రధాని ఆర్థిక సలహాదారు!

Share It:

న్యూఢిల్లీ: లోక్‌సభ నిన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై స్టాక్‌ మార్కెట్ ప్రతికూల స్పందన, బడ్జెట్ ఫలితానికి సూచిక కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ ఎన్‌డిటివికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తన తొమ్మిదవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన వెంటనే ఆదివారం మార్కెట్లు పడిపోయాయి — ఇది నిరాశాజనకమైన బడ్జెట్ అనడానికి స్పష్టమైన ఉదాహరణగా ప్రతిపక్షాలు ఈ పరిస్థితిపై వ్యాఖ్యానించాయి.

దాదాపు రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడిదారుల సంపదను తుడిచిపెట్టిన మార్కెట్ల పతనం, స్టాక్స్‌పై లావాదేవీల పన్నును పెంచాలన్న సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదన పెట్టుబడిదారులను భయపెట్టిందనడానికి సంకేతంగా భావించారు. “అవును, మార్కెట్లు పైకి కిందకి వెళ్తుంటాయి,” అని సంజీవ్ సన్యాల్ ఎన్‌డిటివితో అన్నారు.

“గత 50 బడ్జెట్ల మార్కెట్ ప్రతిచర్యను మీరు పరిశీలిస్తే, బడ్జెట్‌ రోజున వచ్చిన స్పందన, విషయాలు ఎలా జరిగాయనే దానికి సూచిక అని అస్సలు స్పష్టంగా లేదు. కాబట్టి, ఆర్థిక మార్కెట్లలో పాతికేళ్లు గడిపిన వ్యక్తిగా…ఏ నిర్దిష్ట రోజునైనా ఆర్థిక మార్కెట్లలో జరిగే కదలికల గురించి నేను పెద్దగా ఆందోళన చెందను,” అని ఆయన అన్నారు. కాగా, ఈ బడ్జెట్‌ను ఒక “కార్యదక్షతతో కూడిన” ప్రక్రియగా ప్రధాని కార్యదర్శి అభివర్ణించారు. ఇది “అర్థశాస్త్రవేత్తలు ఉత్సాహపడే” ప్రక్రియలను జాగ్రత్తగా చూసుకుంటుంది, కానీ చాలా మంది ప్రజలు దీనిని అభినందించరు. ఈ సందర్భంగా ఆయన కోవిడ్ తర్వాత పెరిగిన ద్రవ్య లోటును తగ్గించగలిగామని ఉదహరించారు.

“ఇప్పుడు దీనిని క్రమపద్ధతిలో నియంత్రణలోకి తీసుకువచ్చారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఇది మళ్లీ సుమారు 4.3 శాతానికి చేరుకుంటుందని మీరు చూడవచ్చు. రాబోయే కొన్ని సంవత్సరాలలో దీనిని 4% కంటే తక్కువకు తీసుకువస్తామని ఆశిస్తున్నాము, ఆ దిశగా మేము ముందుకు సాగుతున్నామని” ఆయన అన్నారు.

“మరోవంక రుణ-జీడీపీ నిష్పత్తి ఇప్పుడు సుమారు 56 శాతానికి చేరుకుంటుంది, కానీ దశాబ్దం చివరి నాటికి ఇది మళ్లీ 50% కంటే తక్కువకు చేరుకుంటుందని నేను భావిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా, అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు రెండింటిలోనూ రుణ-జీడీపీ నిష్పత్తులు అదుపు తప్పిన పరిస్థితుల్లో ఇది చిన్న విజయం కాదు,” అని ఆయన అన్నారు.

చాలా మంది ప్రజలు ఇష్టపడేది పెద్ద సంస్కరణలు, అవి ప్రతి సంవత్సరం జరగవు. కాబట్టి కేవలం బడ్జెట్‌నే కాదు, ప్రసంగాన్ని కాకుండా ఆ పత్రాన్ని స్వయంగా చూస్తే, అందులో పెద్ద సంఖ్యలో చిన్న చిన్న మార్పులు ఉన్నాయని మీరు గమనిస్తారని ప్రధాని ఆర్థిక సలహాదారు సంజీవ్‌ సన్యాల్‌ అన్నారు. ఈ సందర్భంగా అనేక చిన్న సంస్కరణలు జరిగిన కస్టమ్స్ వ్యవస్థను ఆయన ఉదహరించారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.