మస్కట్: ఒమన్లో ఇరాన్, అమెరికా పరోక్ష చర్చలు ఉభయదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా నిరోధించగలవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. “ఇరాన్తో మేము చాలా మంచి చర్చలు జరిపాము. “వచ్చే వారం ప్రారంభంలో మేము మళ్ళీ కలుస్తాము” అని ఆయన అన్నారు, అణు ఒప్పందం విఫలమైతే “పరిణామాలు” తీవ్రంగా ఉంటాయని గత వారాంతంలో ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే
అంతకుముందు, మస్కట్లో అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన పరోక్ష చర్చలు రెండు వైపులా మళ్ళీ కలవడానికి అంగీకరించడంతో ముగిశాయి. ఇరు పక్షాలు ముఖాముఖి కలవలేదు, బదులుగా ఒమానీ దౌత్యవేత్తల ద్వారా ప్రత్యామ్నాయ చర్చలు జరిపారు.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి చర్చలను “మంచి ప్రారంభం”గా అభివర్ణించారు, అపనమ్మక వాతావరణాన్ని అధిగమిస్తే అవి కొనసాగవచ్చని అన్నారు. ఈ ప్రక్రియ కొనసాగుతుందని, తరువాత తేదీలో మస్కట్లో తిరిగి సమావేశమవవచ్చని అంగీకరించినట్లు ఆయన చెప్పారు.
ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్బుసైది మాట్లాడుతూ… చర్చలు “చాలా గంభీరమైన వాతావరణంలో జరిగాయని”, ఇరుపక్షాలు తమ వైఖరిని స్పష్టం చేయడానికి సహాయపడిందని అన్నార
ఇరాన్పై సైనిక దాడులు చేస్తామన్న ట్రంప్ బెదిరింపుతో… వారాల తరబడి ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత ఇరాన్, అమెరికా పరోక్ష అణు దౌత్యాన్ని తిరిగి ప్రారంభించాయి.
