హైదరాబాద్: తెలంగాణలో అక్రమ ఆన్లైన్ గేమింగ్పై జీఎస్టీ అధికారులు భారీ స్థాయిలో దాడులు చేపట్టారు. ఈ ఆపరేషన్ సందర్భంగా పెద్దమొత్తంలో జీఎస్టీ ఎగవేతకు పాల్పడిన సిండికేట్ను అధికారులు ఛేదించారు. ఈ అక్రమ జీఎస్టీ అక్రమ ఎగవేతల విలువ రూ.13,000 కోట్లు అని అధికారులు లెక్క తేల్చారు. ఈమేరకు మోసంలో కీలక పాత్ర పోషించిన యాడ్సన్ అడ్వైజరీ సర్వీస్ డైరెక్టర్ పంకజ్ కుమార్ను డీజీజీఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ అరెస్టు చేసింది.
దర్యాప్తు వివరాల ప్రకారం… అక్రమ ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్ల నిర్వహణకు అనుబంధ ఫిన్టెక్ సంస్థలు, చెల్లింపు అగ్రిగేటర్లు, థర్డ్ పార్టీ టెక్నాలజీ ప్రొవైడర్లు సహకరించినట్లు తెలిసింది. షెల్ కంపెనీల పేరుతో నకిలీ కేవైసీ పత్రాలు సృష్టించి, వాటిని గేమింగ్ వెబ్సైట్లకు అనుసంధానం చేశారు. ఆన్లైన్ గేమింగ్ యాప్స్ ద్వారా ప్రజలను మోసం చేయడమే కాకుండా, అక్కడి నుంచి వచ్చే భారీ నగదు ప్రవాహాన్ని వందలాది షెల్ కంపెనీల యూపీఐ ఐడీల ద్వారా మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. పేమెంట్ గేట్వేలు, యూపీఐ ఇంటిగ్రేషన్లను అక్రమంగా వినియోగించి ఈ లావాదేవీలు నిర్వహించారని తేల్చారు.
చెల్లింపు అగ్రిగేటర్లుగా బ్యాంకింగ్ వంటి RBI నియంత్రిత సంస్థల తరపున వ్యాపారులు మరియు షెల్ ఎంటిటీల మోసపూరిత KYC ధృవీకరణకు బాధ్యత వహించే మాస్టర్మైండ్లలో పంకజ్ కుమార్ ఒకరిగా గుర్తించారు. ధృవీకరణ ప్రక్రియకు బాధ్యత వహించే కంపెనీ డైరెక్టర్గా, యాజమాన్యం, నియంత్రణ నిర్మాణాల ఆధారంగా కస్టమర్ల రిస్క్ ప్రొఫైలింగ్ను అభివృద్ధి చేయడంలో అతను విఫలమయ్యాడు. బదులుగా, ఆన్లైన్ గేమింగ్ కార్యకలాపాల నుండి డబ్బు ప్రవాహానికి అవసరమైన UPI ఇంటిగ్రేషన్ కోసం షెల్ ఎంటిటీల ఆన్బోర్డింగ్ను అతను సులభతరం చేశాడు.
ఈ సిండికేట్లపై DGGI హైదరాబాద్ జోనల్ యూనిట్ విస్తృత దాడిని ప్రారంభించింది, ఇందులో రూ. 100 కోట్ల వరకు బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం, కీలక వ్యక్తులను అరెస్టు చేయడం వంటివి ఉన్నాయి. ఆన్లైన్ గేమింగ్ నుంచి వచ్చే నగదు ప్రవాహానికి అవసరమైన యూపిఐ ఇంటిగ్రేషన్ కోసం షెల్ కంపెనీలను చేర్చుకోవడంలో అతడు సహాయపడినట్లు జిఎస్టి నిఘా విభాగం గుర్తించింది. ఆన్లైన్ గేమింగ్ సిండికేట్ ద్వారా లభించిన అక్రమ ఆదాయాన్ని పొందిన లబ్దిదారుల్లో ఈయన కూడా ఒక రు. ఈ క్రమంలోనే హైద రాబాద్ ఆన్లైన్ గేమింగ్ సిండికేట్లపై డిజిజిఐ అణిచివేత చర్యలను మొదలు పెట్టింది.
కొనసాగుతున్న కార్యకలాపాలలో భాగంగా…అధికారులు ఇప్పటికే వివిధ బ్యాంకు ఖాతాలలో నిధులను సేకరించారు. ఈ భారీ రాకెట్తో సంబంధం ఉన్న ఇతర అనుబంధ ఫిన్టెక్ కంపెనీలు, సూత్రధారుల కోసం గాలిస్తున్నారు. ఈ సంక్లిష్ట ఆర్థిక మోసంలో మరింతమంది కేటుగాళ్లను వెలికితీసేందుకు డిజిటల్ మనీ ట్రయల్పై మరింత దర్యాప్తు ప్రస్తుతం పురోగతిలో ఉంది.


