బీరూట్: లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున నుండి ఇజ్రాయెల్ కనీసం 31 మందిని చంపిందని, అనేక మందిని గాయపరిచిందని లెబనాన్ జాతీయ వార్తా సంస్థ (NNA), సాక్షులు తెలిపారు.
దక్షిణ లెబనాన్లోని సిడాన్ తూర్పు శివార్లలోని ఒక నివాస భవనాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి చేయడంతో కనీసం ఎనిమిది మంది మరణించారు, తొమ్మిది మంది గాయపడ్డారు. ఈమేరకు సమీపంలోని ఇర్కీ గ్రామంలో, మొహమ్మద్ టాకీ గురువారం ఇజ్రాయెల్ దాడిలో మరణించిన ఆరు నుండి 13 సంవత్సరాల వయస్సు గల తన నలుగురు కుమార్తెలను ఐదుగురు బంధువులతో పాటు ఖననం చేశాడు.
“ఇజ్రాయెల్ శత్రువు ప్రతిరోజూ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు చెబుతుంది” అని అతను అంత్యక్రియల సందర్భంగా AFP వార్తా సంస్థతో చెప్పాడు, అతని తలకు తెల్లటి కట్టు కట్టి ఉన్నారు. ఇక అతని ముఖం గాయాలతో నిండివుంది.
“ఇదేనా మౌలిక సదుపాయాలు? మీరు దీన్ని చూశారా?” అతను తన కుమార్తెల మృతదేహాలను చూపిస్తూ అతను ప్రశ్నించాడు. “నేను నలుగురు కూతుళ్లను కోల్పోయాను. నాకు ఇంకెవరూ లేరని అతను చెప్పాడు, అదే ఇజ్రాయెల్ దాడిలో తన తల్లిదండ్రులు, సోదరుడు, మేనల్లుడు, బావమరిదిని కూడా కోల్పోయానని చెప్పాడు.
టైర్ జిల్లాలోని క్లీలే పట్టణంలో, తెల్లవారుజామున కూలిపోయిన భవనం శిథిలాల నుండి రెస్క్యూ బృందాలు రెండు మృతదేహాలను వెలికితీశాయి, తప్పిపోయిన మరింతమంది వ్యక్తుల కోసం రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
