Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

“నిన్ను ఇక్కడే పాతిపెడతానంటూ” యూపీ పోలీసు బెదిరింపు…నిలిచిన ఈద్ నమాజ్!

Share It:

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లా, కురవలి గ్రామంలో దశాబ్దాల నాటి ఈద్గా వద్ద స్థానిక ముస్లింలను ఈద్ నమాజ్ చేయకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

మైనన్‌పురిలోని కురవలి స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) లలిత్ భాటికీ, నమాజు చేస్తున్న వారికి మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదాన్ని ఒక వీడియో చిత్రీకరించింది. స్థానికుల నుండి అవాంతరాలపై ఫిర్యాదులు రావడంతో, అక్కడ గుమిగూడిన ముస్లింలను ఆ ప్రాంగణాన్ని ఖాళీ చేయమని, కేటాయించిన ప్రదేశంలోనే ప్రార్థనలు చేసుకోవాలని SHO ఆదేశించారు.

ఎటువంటి సమస్య లేకుండా ఏళ్లుగా అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయని ఈద్గా సంరక్షకుడు షకీర్ హుస్సేన్ పేర్కొన్నారు. SHO లలిత్‌ భాటి సహనం కోల్పోయి, “నేను నిన్ను ఇక్కడే పాతిపెడతాను” అని బెదిరించడంతో చర్చ తీవ్రరూపం దాల్చి, పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

అనంతరం ఈద్గా సంరక్షకుడు షకీర్ హుస్సేన్‌ను శాంతింపజేసి, పరిస్థితిని చక్కదిద్దడానికి స్థానికులు జోక్యం చేసుకున్నారు. ఆ ప్రాంతంలోని హిందువులు ముందుకు వచ్చి, సాంప్రదాయంగా ప్రార్థనలు కొనసాగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని అధికారికి హామీ ఇచ్చారు.

అయినప్పటికీ, SHO లలిత్‌ భాటి తన పట్టు వదలకపోవడంతో, సుమారు 20 నిమిషాల పాటు వాగ్వాదాలు జరిగాయి. చివరికి, ముస్లింలను వారి ఈద్ నమాజ్ కొనసాగించడానికి అనుమతించారు.

సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్‌ అయిన ఈ సంఘటన, ఆ ప్రాంతంలో మత స్వేచ్ఛ, సామూహిక కార్యక్రమాల సమయంలో పోలీసుల ప్రవర్తనపై చర్చలకు దారితీసింది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.