Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

మీ హృదయం ‘ఫిట్’ గా ఉందా? ఆధ్యాత్మిక ఆరోగ్యం కోసం 5 అద్భుత సూత్రాలు!

ముహమ్మద్ ముజాహిద్ నేటీ యాంత్రిక జీవనంలో మనం జిమ్‌కు వెళ్తాం, డైట్ పాటిస్తాం, గంటల తరబడి బాహ్య సౌందర్యం కోసం తపిస్తుంటాం. కానీ, ఎప్పుడైనా మన హృదయం లోపలికి మనం తొంగి చూసుకున్నామా? శరీరానికి రక్తపోటు (BP) వచ్చినట్లుగానే, మన హృదయానికి కూడా అహంకారం, అసూయ అనే వైరస్‌లు సోకుతాయని మీకు తెలుసా? అందుకే మన ప్రాచీన విజ్ఞానం ‘ఖల్బే సలీమ్’ (నిర్మలమైన హృదయం) అనే అద్భుతమైన జీవనశైలిని మన ముందుకు తెచ్చింది. ఇది కేవలం ఆధ్యాత్మిక […]
Read more

ట్రంప్ ప్రతిపాదిత గాజా విజన్‌… సమాధులపై నిర్మించే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్!

దావోస్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అతని అల్లుడు, మిడిల్ ఈస్ట్ సలహాదారు జారెడ్ కుష్నర్ దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో “ఫ్రీ మార్కెట్ గాజా” విజన్‌ను ప్రదర్శించారు. ఈ విజువల్స్ రియల్ ఎస్టేట్ బ్రోచర్‌ను పోలి ఉండడంతొ తీవ్ర విమర్శలకు గురయ్యాయి ట్రంప్ “బోర్డ్ ఆఫ్ పీస్” కోసం చార్టర్‌పై సంతకం చేసాక కుష్నర్ మాట్లాడుతూ… ఫ్రీ మార్కెట్ గాజా విజన్‌కు 25 బిలియన్ డాలర్ల పెట్టుబడి అవసమని అన్నారు. ఉద్రిక్తతలను తగ్గించే మార్గాన్ని కనుగొనడానికి […]
Read more

జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌…ఐదుగురు మహిళలు సహా 17 మంది మావోయిస్టులు మృతి!

చైబాసా, జార్ఖండ్: సీపీఐ (మావోయిస్ట్) కేంద్ర కమిటీకి చెందిన ఉన్నత స్థాయి సభ్యుడు పతిరామ్ మాఝీ అలియాస్ అనల్‌దా నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో ఎన్‌కౌంటర్‌ అయ్యాడు. కాగా, సారండ అడవిలో 209 కోబ్రా, చైబాసా జిల్లా పోలీసులు, జార్ఖండ్ జాగ్వార్ సంయుక్తంగా మేఘాబురు ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఈక్రమంలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మొత్తం 17 మంది మావోస్టులు మృతి చెందారని ఆపరేషన్‌ ఐజీ మైఖేల్ రాజ్‌ వెల్లడించారు. అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే […]
Read more

బీజేపీ ‘డబుల్ ఇంజిన్’ తమిళనాడులో నడవదు…సీఎం స్టాలిన్‌!

చెన్నై: ప్రధాని మోదీ ‘డబుల్ ఇంజిన్’ వ్యాఖ్యలపై సీఎం స్ఠాలిన్‌ విరుచుకుపడ్డారు. అది తమిళనాడులో నడవదని ఆయన అన్నారు. మధురాంతకంలోని శివారు ప్రాంతంలో జరిగిన ఎన్డీఏ రాజకీయ సభలో ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలపై సీఎం స్టాలిన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదాన్ని “డమ్మీ ఇంజిన్” అని ఎద్దేవా చేశారు. ఈ మేరకు స్టాలిన్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘డబుల్ ఇంజిన్’ ప్రవేశించని తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ […]
Read more

జనాభాలో ఒక్క శాతం ఉన్న ధనికుల దగ్గర 43 శాతం సంపద ఉంది…ఆక్స్‌ఫామ్ నివేదిక!

న్యూఢిల్లీ: నేడు బిలియనీర్ల సంపద స్థాయి గతంలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయిలో ఉంది. ప్రపంచంలో బిలియనీర్ల సంఖ్య మొదటిసారిగా 3,000 దాటింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురిలో ఒకరు ఆకలి, ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారని ఆక్స్‌ఫామ్‌ తాజా నివేదిక తెలిపింది. 2020 నుండి సంపన్నుల ఆస్తులు విపరీతంగా పెరగగా, పేదరికం నిర్మూలనకు ఇంకా 200 ఏళ్లకు పైగా పట్టే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది. ఈ తీవ్రమైన ఆర్థిక అసమానతలు ప్రపంచవ్యాప్త అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని పేర్కొంది. జనాభాలో […]
Read more

న్యూఢిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శన…సాహిత్య ఉత్సవమా లేక భావజాల ప్రదర్శనా?!

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని భారత్ మండపంలో జరిగిన న్యూఢిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శన (NDWBF 2026) ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. నేషనల్ బుక్ ట్రస్ట్ నిర్వహించిన ఈ తొమ్మిది రోజుల ఉత్సవం, గతేడాదితో పోలిస్తే సందర్శకుల సంఖ్యలో 20% పెరుగుదలను, పుస్తకాల అమ్మకాల్లో 30% వృద్ధిని సాధించిందని ప్రకటించింది. అయితే వైవిధ్యం, స్వేచ్ఛా ఆలోచనలనే లక్ష్యంగా యునైటెడ్ స్టేట్స్‌ సహా విదేశాల్లో జరిగే అనేక అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలకు భిన్నంగా… న్యూఢిల్లీ పుస్తకాల పండుగ జరగడం […]
Read more

జనాభా లెక్కల కోసం 33 ప్రశ్నలను సిద్ధం చేసిన ప్రభుత్వం!

న్యూఢిల్లీ: జనాభా లెక్కల మొదటి దశలో భాగంగా, ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యే ఇంటి వివరాల సేకరణ, గృహ గణన సమయంలో పౌరులను అడగబోయే 33 ప్రశ్నలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈమేరకు నిన్న ప్రచురించిన గెజిట్ నోటిఫికేషన్‌లో… ఇంటి నేల, పైకప్పుకు ఉపయోగించిన పదార్థం, అక్కడ నివసిస్తున్న వివాహిత జంటల సంఖ్య, ఇంటి యజమాని లింగం, వినియోగించే ధాన్యం రకం, ప్రాథమిక, ఆధునిక అవసరాలకు ప్రాప్యత, యాజమాన్యంలోని వాహనాల రకాలు వంటి ప్రశ్నలను జాబితా […]
Read more

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేసేందుకు రాజ్యాంగ సవరణను కోరుతున్న ఎంకే స్టాలిన్!

చెన్నై: రాష్ట్ర శాసనసభ మొదటి సమావేశాల ప్రారంభంలో గవర్నర్ ప్రసంగం చేసే పద్ధతిని రద్దు చేస్తూ… రాజ్యాంగ సవరణను ప్రతిపాదించడానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలతో డిఎంకె సంప్రదింపులు జరుపుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ అన్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటకలలో గవర్నర్లు, ఎన్నికైన ప్రభుత్వాల మధ్య ఇటీవల జరిగిన వరుస ఘర్షణలపై స్పందిస్తూ… గవర్నర్లు “పార్టీ ఏజెంట్లు”గా వ్యవహరిస్తున్నారని, ఉద్దేశపూర్వకంగా సమాఖ్య సూత్రాలను దెబ్బతీస్తున్నారని సిఎం స్టాలిన్ ఆరోపించారు. “ముందు తమిళనాడు, తర్వాత కేరళ, ఇప్పుడు […]
Read more

ఐదేళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్న అమెరికా ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు!

వాషింగ్టన్‌: అమెరికాలో ఐదేళ్ల బాలుడిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకోవడంపై దుమారం చెలరేగింది. మిన్నెసోటాలోని ప్రీస్కూల్ నుండి ఇంటికి వస్తున్న 5 ఏళ్ల బాలుడిని ఫెడరల్ ఏజెంట్లు అతని తండ్రితో పాటు టెక్సాస్‌లోని నిర్బంధ కేంద్రానికి తీసుకెళ్లారని పాఠశాల అధికారులు, కుటుంబ న్యాయవాది తెలిపారు. కాగా, ఈ ఘటన రాజకీయంగా పెద్ద దుమారం రేగింది. బాలుడిని ‘ఎర’గా వాడుకున్నారని పాఠశాల అధికారులు ఆరోపిస్తుండగా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) ఈ ఆరోపణలను ఖండించింది. ఫెడరల్ ఏజెంట్లు […]
Read more

అదానీకి ఈమెయిల్ ద్వారా సమన్లు పంపాలని ఫెడరల్ కోర్టును ఆశ్రయించిన యూఎస్‌ సెక్యూరిటీస్‌ కమిషన్‌!

న్యూఢిల్లీ: విదేశీ పౌరులకు సమన్లు జారీ చేసే అధికారాన్ని భారతదేశం సవాలు చేసిన తర్వాత… దౌత్య మార్గాలను దాటవేసి… గౌతమ్ అదానీ, సాగర్ అదానీలకు US న్యాయవాది… ఇమెయిల్ ద్వారా సమన్లను అనుమతించాలని US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించింది. ఈ సమన్లను భారతదేశం ద్వారా పంపడానికి SEC ప్రయత్నించింది, కానీ భారత ప్రభుత్వం 14 నెలలుగా సహకరించకపోవడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. హాగ్ కన్వెన్షన్ ద్వారా సమన్లు పంపేందుకు భారత్ సహకరించడం […]
Read more
1 5 6 7 8 9 142

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.