Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ప్రధాని మోదీ ప్రచారం కోసం ఈ ఆరేళ్లలో 2,586 కోట్లు ఖర్చు…RTI ద్వారా వెల్లడి!

న్యూఢిల్లీ: మాజీ తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సాకేత్ గోఖలే దాఖలు చేసిన సమాచార హక్కు (RTI) దరఖాస్తు ద్వారా వెల్లడైన వివరాల ప్రకారం, 2020 నుండి వివిధ మాధ్యమాల ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రచారం చేసే ప్రకటనల కోసం కేంద్రం రూ. 2,586 కోట్లు ఖర్చు చేసింది. ఈమేరకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (CBC) జూన్ 16న విడుదల చేసిన ఈ గణాంకాలు, 2020-21, […]
Read more

లక్నోలో ఘోర అగ్నిప్రమాదం…15మంది మృతి, ఏడుగురికి గాయాలు!

లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో పెను విషాదం చోటుచేసుకుంది. నగరంలోని ఒక యానిమేషన్ సెంటర్ ఉన్న మూడు అంతస్తుల వాణిజ్య భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో, 15 మంది విద్యార్థులను మృతి చెందారు, మరో ఏడుగురు గాయపడ్డారని ఆసుపత్రి అధికారి ఒకరు తెలిపారు. కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (KGMU)లోని ట్రామా సెంటర్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ, ఈ ఘటన అనంతరం సుమారు 21 నుంచి 22 మంది విద్యార్థులను ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు […]
Read more

వితంతువులను ‘అపశకునం’గా చూసే ధోరణికి సమాజం ఎప్పుడు స్వస్తి పలుకుతుంది?

నేడు ‘అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం ఒక చేతిలో పసిపాప, గుండె నిండా అంతులేని దుఃఖం, శూన్యంలోకి చూసే కళ్లు… భర్త అకాల మరణం కేవలం ఒక స్త్రీ జీవితంలో మానసిక సంక్షోభాన్ని మాత్రమే మిగల్చదు; అది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మహిళల నిశ్శబ్ద, వ్యవస్థీకృత బహిష్కరణకు నాంది పలుకుతుంది. అంతరిక్ష ప్రయోగాలు, ఆర్థిక వృద్ధితో దూసుకుపోతున్న 21వ శతాబ్దపు భారతదేశంలోనూ ‘వితంతువు’ (విధవ) అనే మాట వినబడితే చాలు సమాజం చూసే చూపు […]
Read more

నేటి నుండి రైతు వేదికలలో రాష్ట్రవ్యాప్త విత్తన మేళాలు!

హైదరాబాద్: ప్రస్తుతం నెలకొన్న ‘ఎల్ నినో’ (El Niño) పరిస్థితుల్లో రైతులకు అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక కార్యక్రమాన్ని చేపడుతోందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి. గోపి తెలిపారు. ఈమేరకు నేటి నుండి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,601 రైతు వేదికలలో విత్తన మేళాలను నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నాణ్యత గల విత్తనాలు, సకాలంలో పంటల సాగుపై సూచనలు, ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనువైన సాగు సామగ్రిని రైతులకు అందుబాటులో ఉంచడమే […]
Read more

ఒప్పందానికి ఇరాన్ కట్టుబడకపోతే “నేను చేయవలసినది చేస్తానని” ట్రంప్ హెచ్చరిక!

వాషింగ్టన్: వాషింగ్టన్‌తో కుదుర్చుకున్న ఒప్పందానికి ఇరాన్ కట్టుబడి ఉండకపోతే “నేను చేయవలసినది చేస్తాను” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ తమ ఒప్పందాన్ని పాటించకపోయినా, లేదా వారు సరిగ్గా ప్రవర్తించకపోయినా, మూల్యం చెల్లించకతప్పదని ట్రంప్ విలేకరులతో అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడి చేసిన మూడు నెలలకు పైగా గడిచిన తర్వాత, దానికి ప్రతిస్పందనగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలు ఉన్న గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. ఆ తర్వాత గత వారం […]
Read more

మానవత్వపు మసీదు.. మతాలకతీతంగా మమకారాల పందిరి!

భీవండీ ‘రీ-నీట్’ పరీక్షా కేంద్రం వెలుపల గుండెలు పిండేసే ఎండ.. కానీ, ఆ పక్కనే ఉన్న దారుల్ ఉలూమ్ దీనియాత్ మసీదు లోపల మాత్రం చల్లని తల్లి ఒడి! కులమతాల సరిహద్దులను చెరిపేస్తూ, పరీక్ష రాస్తున్న పిల్లల కోసం బయట అల్లాడిపోతున్న వందలాది మంది హిందూ, ముస్లిం తల్లిదండ్రులకు ఆ మసీదు ఆశ్రయమిచ్చింది. దాహార్తిని తీర్చి, ఆకలిని నిమిరి, ‘మేమంతా ఒక్కటే’ అంటూ సాగే ముహమ్మద్ ముజాహిద్ ప్రత్యేక కథనం..ఆందోళనతో అడుగుపెట్టి.. ఆనంద భాష్పాలతో..వైద్య విద్య కలలను […]
Read more

జంతర్ మంతర్ వద్ద వరుసగా మూడవ రోజు సీజేపీ కార్యకర్తల నిరసన!

న్యూఢిల్లీ: పరీక్షలలో అవకతవకలు జరిగాయని, మే 3న నీట్ పేపర్ లీక్ జరిగిందని ఆరోపిస్తూ, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వరుసగా మూడవ రోజు కూడా జంతర్ మంతర్ వద్ద తమ నిరసనను కొనసాగించింది. శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ ధర్నా, పోలీసుల పహారా నడుమ నిరసనకారులు అక్కడే ఉండటంతో రాత్రంతా కొనసాగింది. ఈ ఆందోళనలో పాల్గొన్న వారికి కొందరు ఆహారం, తాగునీరు పంపిణీ చేస్తూ కనిపించారు. ఈరోజు కూడా నిరసన కొనసాగుతుందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ […]
Read more

లెబనాన్ యుద్ధాన్ని ముగించే దిశగా ‘పురోగతి’ సాధించామని ప్రకటించిన ఇరాన్ ప్రతినిధి అరాఘ్చి!

టెహ్రాన్‌: లెబనాన్ యుద్ధాన్ని ముగించే దిశగా అమెరికా-ఇరాన్ చర్చలలో చెప్పుకోదగ్గ పురోగతి సాధించినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తాజాగా ప్రకటించారు. పాకిస్థాన్, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంతో స్విట్జర్లాండ్‌లో జరిగిన ఈ సమావేశాలలో, లెబనాన్‌లో సైనిక చర్యలను నిలిపివేయడానికి, శాంతిని పర్యవేక్షించడానికి ఒక ‘డీ-కాన్‌ఫ్లిక్షన్ సెల్’ను ఏర్పాటు చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధానికి శాశ్వత ముగింపు పలికేందుకు అమెరికా, ఇరాన్ ప్రతినిధులు నేడు రెండవ రోజు చర్చలకు సిద్ధమయ్యారు. […]
Read more

‘ఎస్‌ఐఆర్‌’ పేరిట బెంగాల్‌లో జరిగిన మోసం తెలంగాణలో పునరావృతం కారాదు…ఎంపీ చామల కిరణ్‌!

హైదరాబాద్: “ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR)ను తొందరపాటుతో అమలు చేయడాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. దీనివల్ల పెద్ద ఎత్తున ఓటర్ల తొలగింపులు, పొరపాట్లు, ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజల విశ్వాసం దెబ్బతినడం వంటివి జరగవచ్చని అభిప్రాయపడింది.” ఎస్‌ఐఆర్‌ పేరిట నిజమైన ఓటర్లను పెద్ద ఎత్తున తొలగించడానికి తాము ఎప్పటికీ అనుమతించబోమని…కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. విధానపరమైన లోపాలు లేదా తొందరపాటుతో చేసే ధృవీకరణ ప్రక్రియల కారణంగా ఏ ఒక్క […]
Read more

ఖతార్‌ గ్యాస్ టెర్మినల్‌లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు!

దుబాయ్: యుద్ధ సమయంలో ఇరాన్ దాడి కారణంగా నిలిచిపోయిన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు కార్మికులు ప్రయత్నిస్తుండగా, ఆదివారం రాత్రి ఖతార్‌లోని కీలకమైన సహజ వాయువు టెర్మినల్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కనీసం 54 మంది గాయపడగా, మరో 18 మంది గల్లంతయ్యారు. ప్రపంచంలోనే అగ్రశ్రేణి సహజ వాయువు ఉత్పత్తిదారులలో ఒకటైన ఖతార్‌లో జరిగిన ఈ ‘రాస్ లఫాన్’ (Ras Laffan) పారిశ్రామిక ప్రాంత పేలుడు, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో మరింత గందరగోళానికి దారితీయవచ్చు. హర్ముజ్ […]
Read more
1 2 3 194

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.