హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం (OU) బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ద్వారా నాలుగు విభాగాలలో అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (ISO) ధృవీకరణ పత్రాలను పొందిన దేశంలోనే మొదటి విశ్వవిద్యాలయంగా నిలిచింది.
ఈ మేరకు BIS డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సందీప్ కుమార్ కనోజియా, నిన్న OU వైస్-ఛాన్సలర్ కుమార్ మొగులారామ్కు ఈ ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కుమార్ మొగులారామ్ మాట్లాడుతూ… విద్యా సంస్థల నిర్వహణ (ISO సర్టిఫికేషన్ 21001:2018), పర్యావరణ నిర్వహణ వ్యవస్థలు (ISO సర్టిఫికేషన్ 14001:2015), ఇంధన నిర్వహణ వ్యవస్థ (ISO సర్టిఫికేషన్ 50001:2018), ఆహార భద్రతా నిర్వహణ వ్యవస్థ (ISO సర్టిఫికేషన్ 22000:2018) విభాగాలలో విశ్వవిద్యాలయం ISO సర్టిఫికేషన్ను పొందిందని తెలిపారు.
ఈ నాలుగు సర్టిఫికేషన్లను పొందడం అనేది విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్లు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది చేసిన కృషికి నిదర్శనమని సందీప్ కుమార్ అన్నారు.


