హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి గత 18 నెలల్లో రుణమాఫీ, ధాన్యం సేకరణతో సహా రైతుల కోసం రూ. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
ఈమేరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పిజెటిఎస్ఎయు)లో జరిగిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ… రైతులకు ‘రైతు భరోసా’ పెట్టుబడి మద్దతు పథకం కింద నిధుల పంపిణీని ప్రారంభించారు.
“అసెంబ్లీలో ప్రతి పైసాకు నేను లెక్క చెబుతాను. ప్రజల ప్రభుత్వం 18 నెలల్లో రైతుల ఉత్పత్తులపై ఎంఎస్పి, ఎంఎస్పిపై బోనస్, రుణ మాఫీ, రైతులకు బీమా, రైతు భరోసా (పెట్టుబడి మద్దతు) వంటి రైతు సంక్షేమ కార్యక్రమాలకు రూ. లక్ష కోట్లు ఖర్చు చేసిందని” సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
గత BRS ప్రభుత్వం రుణ భారాన్ని మోపడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసిందని ఆరోపించారు. ప్రభుత్వం సవాళ్లను ఎదుర్కొంటూ ‘రైతు భరోసా’ పథకం కింద తొమ్మిది రోజుల్లో దాదాపు రూ. 9,000 కోట్లను బదిలీ చేస్తుందని ఆయన అన్నారు.
‘రైతు భరోసా’ ద్వారా 1.49 లక్షల ఎకరాలకు పైగా ఉన్న 70,11,984 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని సీఎం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సరంలో చేపట్టిన పంట రుణ మాఫీ, ఈ 10 సంవత్సరాలలో BRS ప్రభుత్వం చేసిన ఖర్చుపై ప్రతి గ్రామంలో సవాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం అన్నారు.
ప్రతిపక్ష BRS మొదటి రోజు నుండే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించిందని సీఎం ఆరోపించారు. కేసీఆర్ నేతృత్వంలోని పార్టీ ఎవరైనా రైతు ఆత్మహత్య ద్వారా మరణించినా లేదా ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యాసంస్థల్లో రోడ్డు ప్రమాదాల్లో మరణాలు నమోదైతే విపక్షం”సంతోష” పడుతుందని ఆరోపించారు. అలాంటి మరణాల ఆధారంగా అధికారం పొందడమే ప్రతిపక్ష పార్టీ దుష్ట ఉద్దేశం అని సీఎం ఆరోపించారు.
తెలంగాణను రాబోయే 10 సంవత్సరాలలో ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే రాష్ట్ర ప్రభుత్వ దార్శనికతను సాధించాలంటే వ్యవసాయం లాభదాయకంగా మారాలని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. ఈ మేరకు రైతులకు వ్యవసాయ పనిముట్లను సరఫరా చేయాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సీఎం ఆదేశించారు. రైతులకు ప్రోత్సాహకాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడానికి తమ ప్రభుత్వం సానుకూలం ఉందని సీఎం అన్నారు.
రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 17,000 కోట్లు ఖర్చు చేస్తోందని , రైతులు సోలార్ పంపుసెట్లను ఏర్పాటు చేసుకుంటే ప్రయోజనం పొందుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వారు ఉచిత విద్యుత్ పొందడమే కాకుండా ప్రభుత్వానికి సౌర విద్యుత్తును అమ్మడం ద్వారా అదనపు ఆదాయాన్ని కూడా పొందుతారని అన్నారు.
సోలార్ పంపుసెట్లపై రైతులకు అవగాహన పెంచడానికి, నేల స్వభావం, ఆరోగ్యానికి అనుగుణంగా లాభదాయకమైన పంటలకు మారడానికి చర్యలు తీసుకోవడానికి జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించాలని ఆయన ప్రధాన కార్యదర్శిని కోరారు.