Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

మాకు గౌరవం కావాలి’అంటూ హైదరాబాద్‌లో నిరసన తెలిపిన పనిమనుషులు!

Share It:

హైదరాబాద్: అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇందిరా పార్క్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద వందలాది మంది పనిమనుషులు నిన్న సమావేశమయ్యారు.

గృహ కార్మికుల సంక్షేమం కోసం సమగ్ర చట్టం తీసుకురావాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. తమన కార్మిక వర్గంగా గుర్తింపు, నెలవారీ సంక్షేమ పెన్షన్లు, సామాజిక భద్రతా ప్రయోజనాలు,ESI ఆసుపత్రులలో చికిత్స అందించాలని వారంతా డిమాండ్‌ చేశారు.

“గ్రామీణ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో పేదలు మెరుగైన జీవనం కోసం హైదరాబాద్‌కు వలస వెళతారు. అయితే, విద్య, అర్హతలు లేదా నైపుణ్యాలు లేకపోవడం వల్ల వారు ఇళ్లలో పనిచేయాల్సి వస్తోంది. రాష్ట్రంలో మొత్తం 11 లక్షల మంది గృహ కార్మికులు ఉన్నారు. ఇందులో 6 లక్షల మంది హైదరాబాద్‌లోనే పనిచేస్తున్నారని ” 2011 నుండి తెలంగాణలో గృహ కార్మికుల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న మోంట్‌ఫోర్ట్ సోషల్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ వర్గీస్ థెకనాథ్ అన్నారు.

తెలంగాణలో గృహ కార్మికులు… నిర్మాణ కార్మికుల తర్వాత రెండవ అతిపెద్ద అసంఘటిత రంగంగా ఉన్నారు. వారికి తరచుగా తక్కువ జీతం, లైంగిక వేధింపులు, అధిక పని ఉంటుంది. ఈ సందర్భంగా కొందరి గృహకార్మికులు కథలు వింటే మన కళ్లు చెమర్చక మానవు.

అరవై ఐదు ఏళ్ల మాధవి దాదాపు రెండు దశాబ్దాలుగా గృహ కార్మికురాలిగా పనిచేస్తోంది. ఆమె నెలవారీ సంపాదన దాదాపు రూ. 5,000. “నేను నా వితంతు కుమార్తె, ముగ్గురు మనవరాళ్లతో నివసిస్తున్నాను. మేము నెలకు రూ. 10,000 అద్దె చెల్లిస్తాము. నా జీతం మంచి జీవనం సాగించడానికి సరిపోదు. కానీ నేను పని చేస్తూనే ఉంటాను” అని ఆమె చెప్పింది.

కాగా, మాధవి 2 BHK గృహనిర్మాణ పథకానికి దరఖాస్తు చేసుకుంది, కానీ ఆమె దరఖాస్తు తిరస్కరించారని, ఈ పథకానికి. “ఇళ్ళు ఉన్నవారు అర్హులు” అని ఆమె ఆరోపించింది.

అద్దంకి బహమణిది మరో గాథ. తన తండ్రి మరణం తర్వాత ఆమె వైపు కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంతో హైదరాబాద్‌లోని ఒక అనాథాశ్రమంలో పెరిగింది. మాధవి కుమార్తెలాగే, బహమణి చిన్న వయసులోనే వితంతువు అయ్యింది.

తన దివంగత భర్త కుటుంబం నుండి ఎటువంటి మద్దతు లేకుండా, బహమణి ఒంటరిగా తన పిల్లలు లిస్సీ, లిల్లీని గృహ కార్మికురాలిగా పని చేస్తూ పెంచింది.

అద్దంకి లిస్సీ రత్నం
ఆమె పెద్ద కుమార్తె లిస్సీ తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TMREIS) నుండి ఇంటర్మీడియట్ పరీక్షలలో రాష్ట్ర ఆరో ర్యాంక్ సాధించడంతో ఆమె కృషి ఫలించింది. “లిస్సీ NEET 2025లో అర్హత సాధించింది కానీ ఉచిత MBBS సీటు పొందలేకపోయింది. కానీ అది ఆమెను నిరుత్సాహపరచలేదు. మళ్ళీ ప్రయత్నించడానికి ఆమె దీర్ఘకాలిక NEET కోచింగ్ తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె నిరుత్సాహంగా ఉంది, ” కానీ ఇది తల్లిగా నాకు గర్వంగా ఉందని ఆమె అన్నారు.

డాక్టర్ కావాలనే లిస్సీ కలను నెరవేర్చడానికి, నిరసనలో పాల్గొన్న గృహ కార్మికుల జాతీయ వేదిక (NPDW), తెలంగాణ గృహ కార్మికుల సంఘం (TDWU), గృహకార్మికుల యూనియన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రం (GUTS) ఆమెకు ల్యాప్‌టాప్‌ను బహుమతిగా ఇచ్చాయి.

Tags :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.