న్యూఢిల్లీ: మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా మృతితో మావోయిస్టు ఉద్యమంపై గట్టి దెబ్బ పడింది. మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్లోని రంపచోడవరం అడవుల్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్లో హిడ్మా మృతిచెందాడు. ఆయనతో పాటు ఆమె భార్య హేమ అలియాస్ రాజే సహా మరో నలుగురు చనిపోయారు. కాగా, హిడ్మా మరణం, మావోయిస్టు పార్టీ పోరాటంపై కీలక విజయమని పోలీసులు ప్రకటించారు. అయితే పదుల సంఖ్యలో మరణాలకు కారణమైన హిడ్మా.. మావోయిస్టు పార్టీలో అత్యంత శక్తిమంతమైన నాయకుడు.
మావోయిస్టు పార్టీలో గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా హిడ్మాకు మంచి పేరు ఉంది. ఆపరేషన్ కగార్ తీవ్రతరం అవడంతో చత్తీస్గఢ్ నుంచి మారేడుమిల్లి వైపు హిడ్మా టీమ్ వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు భద్రతా దళాలు భారీ ఎత్తున కూంబింగ్ చేపట్టారు. సుక్మా జిల్లా పూవర్తికి చెందిన హిడ్మా, మావోయస్ట్ కార్యకలాపాల్లో క్రియాశీలంగా వ్యవహరించారు. దండకారణ్యంలో మావోయిస్టు కమిటీల్లో కీలకంగా మారిన హిడ్మా, 2017లో 25మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి కారణమయ్యారు. గెరిల్లా వార్ఫేర్ స్కిల్స్లో హిడ్మాకు తిరుగులేదు.
హిడ్మా మరణం కేవలం వ్యూహాత్మక విజయం మాత్రమే కాదు – ఇది ఒక పెద్ద వ్యూహాత్మక మలుపు; మావోయిస్టు పార్టీకి ఇక నూకలు చెల్లినట్టే..తిరుగుబాటు మరణంతో సమానం. కాగా, హిడ్మా మృతి యాంటీ మావోయిస్టు ఆపరేషన్లలో కీలక ముందడుగు అని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. హిడ్మా మృతితో మావోయిస్టు పార్టీ శక్తిమంతమైన మిలిటరీ వింగ్ కుప్పకూలినట్లు అయింది. ఆపరేషన్ కగార్ ఫుల్ మంచి ఊపులో ఉండటం, వరుసగా మావోయిస్టులు లొంగిపోతుండటం.. ఇప్పడు హిడ్మా హతంతో ఇక మావోయిస్టు పార్టీ ఉనికికే ప్రమాదం ముంచుకురానుంది.
మొత్తంగా మావోయిస్ట్ పార్టీ స్పష్టంగా క్షీణించింది. వారి సీనియర్ నాయకుల్ని వృద్ధాప్యం వెంటాడుతోంది. అటవీ జీవితాన్ని వారు శారీరకంగా తట్టుకోలేరు. గతంలో నగరాల నుండి విద్యావంతులైన యువతను ఆకర్షించిన మావోయిస్టులకు నేడు క్యాడర్ దొరకటంలేదు . నేటి నియామకాలు ఎక్కువగా పేద గ్రామీణ నేపథ్యాల నుండి వచ్చాయి. వారికి సైద్ధాంతిక నేపథ్యం ఉండటంలేదు.
భావజాలం కూడా బలహీనపడింది. మునుపటి నాయకులు రాజకీయ సిద్ధాంతాన్ని వ్యక్తపరచగలరు. నేటి నాయకులు ఎక్కువగా మేధో పునరుద్ధరణ లేకుండా సైనికవాదం గురించి మాట్లాడుతారు.
ముఖ్యంగా, గిరిజన ప్రాంతాలలో సామాజిక-ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. రోడ్లు, కనెక్టివిటీ, మార్కెట్లు, విద్య ఆకాంక్షలను మార్చాయి. పాఠశాలకు మోటార్బైక్లపై ప్రయాణించే యువ గిరిజన మహిళలు మావోయిస్టు ప్రచారానికి అతిపెద్ద దెబ్బ.. 1970- 1980ల నాటి భౌతిక మనోవేదనలు ఇప్పుడు లేవు.
ఇక హిడ్మా మరణంతో వారి క్యాడర్ మానసికంగా కదిలిపోయారు. వారు తమ బలమైన కమాండర్ ఎన్కౌంటర్ అవడాన్ని చూశారు. దీంతో చాలామంది లొంగిపోవడం ఖాయం. మొత్తంగా మార్చి 2026 నాటికి మావోయిస్టును నిర్మూలించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. హిడ్మా మరణంతో ఇది ఇప్పుడు వాస్తవమవుతుందేమో?


