గాజా: చదువులు, ఆటపాటలతో సరదాగా సాగిపోవాల్సిన బాల్యం గాజాలో ఛిద్రమెంది. ఇజ్రాయిల్ బాంబు దాడులు గాజాలో చిన్నారుల భవిష్యత్తును చిదిమేస్తున్నాయి. కాల్పుల విరమణ అమల్లో ఉన్నా…ఇజ్రాయెల్ మాత్రం దాడులు చేస్తూనే ఉంది. ఈ దాడుల్లో ప్రతిరోజు ఇద్దరు పిల్లలు చనిపోతున్నారు. ఈ పరిణామాన్ని పిల్లలను చంపడం ప్రపంచానికి అవమానంగా అభివర్ణించారు ఐక్యరాజ్యసమితి అధికారులు.
ఇక ఈ దారుణాలను ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా… చిన్నారులు తమ డ్రాయింగ్ల ద్వారా, పిల్లలు తాము కోల్పోయిన హక్కులు, తమకు ఇళ్ళులేని వైనం… ఇజ్రాయెల్ మారణహోమం జరిగిన నెలల్లో వారి దైనందిన జీవితాలకు జరిగిన అంతరాయం గురించి చిత్రీకరించారు.
ఈ ప్రదర్శన సందర్భంగా, సాంప్రదాయ పాలస్తీనా దుస్తులు ధరించిన బాలికల బృందం… “ఓ ప్రపంచమా, నా భూమి కాలిపోయింది; స్వేచ్ఛా భూమి దొంగిలించారు” అని రాసిన పాటను ప్రదర్శించారు. తద్వారా కొనసాగుతున్న బాధలను ప్రతిరోజూ ఇద్దరు గాజాన్ పిల్లలను వ్యక్తపరిచారు.
“క్రమబద్ధమైన విధ్వంసం గాజాలో జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేసిన తర్వాత… రాయి, చెట్టు, మానవులను ప్రభావితం చేసిన ఇజ్రాయెల్ మారణహోమం తర్వాత వారు జీవించిన వాస్తవికతను ప్రతిబింబించడానికి” పిల్లలు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించారని, పాలస్తీనియన్ మానవ హక్కుల కేంద్రం శిక్షణ డైరెక్టర్ అబ్దేల్ హలీమ్ అబు సమ్రా అనడోలు వార్తాసంస్థతో అన్నారు.
పాల్గొన్న వారిలో ఒకరి తల్లి యారీన్ అబు అల్-నజా అనడోలుతో మాట్లాడుతూ… గాజా పిల్లలు “గత రెండు సంవత్సరాలుగా వారి ప్రదర్శనలు,సినిమాలు చూడటానికి బదులుగా ప్రతిరోజూ శరీర భాగాలను చూస్తూ, పూలకు బదులుగా రక్తాన్ని వాసన చూస్తూ గడిపారు” అని అన్నారు. “గాజాలో అన్ని రకాల సాధారణ జీవితం అదృశ్యమైంది” అని ఆమె చెప్పారు.
మరోవంక కాల్పుల విరమణ ప్రారంభమైనప్పటి నుండి గాజాలో ప్రతిరోజూ సగటున ఇద్దరు పిల్లలు చంపుతున్నారని యునిసెఫ్ హెచ్చరించింది.
ఈమేరకు జెనీవాలో యూనిసెఫ్ ప్రతినిధి రికార్డో పైర్స్ మాట్లాడుతూ, “అక్టోబర్ 11వ తేదీ నుండి, కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ, గాజాలో సంఘర్షణ సంబంధిత సంఘటనలలో కనీసం 67 మంది పిల్లలు మరణించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు” అని అన్నారు.
“యుద్ధ విరమణ అమలులోకి వచ్చినప్పటి నుండి ప్రతిరోజూ సగటున దాదాపు ఇద్దరు పిల్లలను చంపుతున్నారని” ఆయన అన్నారు.
ప్రతి సంఖ్య వెనుక హింసాత్మకంగా ప్రాణాలు కోల్పోయిన ఒక పిల్లవాడు ఉన్నాడని పైర్స్ నొక్కిచెప్పారు, ఇవి కేవలం గణాంకాలు మాత్రమే…వాస్తవం ఇంకా భయంకరంగా ఉంటుంది.
శిబిరాల్లో ఉంటున్న పిల్లల కష్టాలు వర్ణనాతీతం. ఆ ప్రాంతంలో వరదలు రావడంతో భయంతో కప్పుకోవడానికి సరైన దుప్పట్లు లేక పిల్లలు చలికి వణుకుతున్నారని యునిసెఫ్ బృందాలు తెలిపాయి. ఆ పిల్లలకు సురక్షితమైన స్థలం లేదు. ప్రపంచం వారి బాధలను పట్టించుకోవడం లేదని యూనిసెఫ్ ప్రతినిధి రికార్డో పైర్స్ చెప్పారు.


