Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

గాజా శాంతి ప్రణాళికపై అమెరికా ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించిన భద్రతా మండలి!

Share It:

న్యూయార్క్‌: గాజా పాలన, పునర్నిర్మాణం, భద్రతను పర్యవేక్షించడానికి అంతర్జాతీయ స్థిరీకరణ దళమైన “బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌”ని ఏర్పాటు చేసే తీర్మానాన్ని UN భద్రతా మండలి ఆమోదించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 13 ఓట్లు వచ్చాయి, చైనా, రష్యా గైర్హాజరయ్యాయి.

ఓటింగ్‌కు ముందు ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి మైక్ వాల్ట్జ్ మాట్లాడుతూ… “నేడు, మంటలను ఆర్పి శాంతి మార్గాన్ని వెలిగించే శక్తి మనకు ఉంది” అని అన్నారు.

“ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మాన ముసాయిదా… అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా సంఘర్షణను అంతం చేయడానికి తీసుకొచ్చిన 20-పాయింట్ల సమగ్ర ప్రణాళిక నుండి పుట్టిన ఆచరణాత్మక బ్లూప్రింట్. ఇది ఖతార్, ఈజిప్ట్, సౌదీ అరేబియా, యుఎఇ, టర్కి, పాకిస్తాన్, ఇండోనేషియాల సహకారంతో రూపొందించామని” ఆయన అన్నారు.

పాలస్తీనా అథారిటీ అవసరమైన సంస్కరణలను పూర్తి చేసిన తర్వాత పాలస్తీనా స్వీయ-నిర్ణయానికి సాధ్యమయ్యే మార్గాన్ని ఈ తీర్మానం సూచిస్తుంది. అంతేకాదు 2027 వరకు అమల్లో ఉండనున్న ఈ కమిటీకి ట్రంప్‌ అధ్యక్షత వహిస్తారు. సరిహద్దు ప్రాంతాలను సురక్షితంగా ఉంచడానికి, గాజాను సైనికీకరించడంలో సహాయపడేందుకు ఇజ్రాయిల్‌, ఈజిప్ట్‌, కొత్తగా శిక్షణ పొందిన పాలస్తీనా పోలీసులతో కలిపి ‘తాత్కాలిక అంతర్జాతీయ స్థిరీకరణ దళం (ఐఎస్‌ఎఫ్‌)’ను ఏర్పాటు చేయడానికి సభ్యదేశాలకు అధికారం ఇస్తుంది.

ఈ తీర్మానాన్ని నిరాకరించడమంటే హమాస్‌ పాలన కొనసాగడానికి లేదా ఇజ్రాయిల్‌తో తిరిగి యుద్ధం కొనసాగాలని ఓటు వేయడం, ఈ ప్రాంతాన్ని, ప్రజలను శాశ్వత సంఘర్షణకు గురిచేయడమేనని అమెరికా రాయబారి మైక్‌ వాల్ట్జ్‌ వాషింగ్టన్‌ పోస్ట్‌లో స్పష్టం చేశారు.

గాజాలో శాంతిని స్థాపించే చొరవను స్వాగతిస్తున్నట్లు రష్యన్‌ యుఎన్‌ రాయబారి పేర్కొన్నారు. అయితే ఇజ్రాయిల్‌-పాలస్తీనా పరిష్కారానికి రెండు దేశాల ఏర్పాటు అనే సూత్రాన్ని గుర్తించడానికి బదులుగా ఈ ప్రతిపాదన భిన్నంగా ఉందని అంటూ విస్మయం వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు, ఈ నిబంధనలకు అమెరికా ముసాయిదా తగిన గౌరవం ఇవ్వలేదని చెప్పారు.

హమాస్ ప్రతిస్పందన
పాలస్తీనియన్ల “డిమాండ్లు మరియు హక్కులను” గౌరవించడంలో UN తీర్మానం విఫలమైందని హమాస్ పేర్కొంది.”ఈ తీర్మానం మన పాలస్తీనా ప్రజల రాజకీయ,మానవతావాద డిమాండ్లు, హక్కుల స్థాయిని తీర్చదు” అని హమాస్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.