Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

కాల్పుల విరమణ ఒప్పందం రద్దు తర్వాత గాజాలో నాలుగు లక్షల మంది నిరాశ్రయులయ్యారు… ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ!

న్యూయార్క్‌ : జనవరి కాల్పుల విరమణ ఒప్పందం రద్దయినప్పటినుంచి గాజా స్ట్రిప్‌లో దాదాపు నాలుగులక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని పాలస్తీనా శరణార్థుల కోసం పనిచేస్తున్న యూఎన్‌ ఏజెన్సీ (UNRWA) సామాజిక మాథ్యమం Xలో హెచ్చరించింది. “యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి పాలస్తీనియన్లు ఇప్పుడు సహాయ సామాగ్రిని అందుకోవడంలో అతి ఎక్కువ రోజులు అంతరాయాన్ని ఎదుర్కొంటున్నారు” అని యూఎన్‌ ఏజెన్సీ తన సోషల్‌మీడియా ఖాతోలో పేర్కొంది. ఈ దుస్థితిని నివారించడానికి హమాస్‌, ఇజ్రాయెల్‌ మధ్య సంధిని తిరిగి ప్రారంభించాలని UNRWA […]
Read more

గాజాను “భూతల నరకం”గా అభివర్ణించిన రెడ్ క్రాస్!

జెనీవా: పాలస్తీనా నిరాశ్రయుల దుస్థితిని చూసి చలించిన రెడ్ క్రాస్ అధ్యక్షుడు గాజాను “భూమిపై నరకం”గా అభివర్ణించారు. రెండు వారాల్లోగా తమ ఫీల్డ్ హాస్పిటల్‌లో సరఫరాలు అయిపోతాయని హెచ్చరించారు. గాజాను”భూతల నరకం అని వర్ణించాల్సిన పరిస్థితిలో ఇప్పుడు మనం ఉన్నాము… చాలా ప్రాంతాల్లో ప్రజలకు నీరు, విద్యుత్, ఆహారం అందుబాటులో లేవు” అని మిర్జానా స్పోల్జారిక్ జెనీవాలోని అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో రాయిటర్స్‌తో అన్నారు. మార్చి 2న ఇజ్రాయెల్ సహాయ ట్రక్కుల ప్రవేశాన్ని […]
Read more

వక్ఫ్ చట్టం రద్దు కోరుతూ మణిపూర్‌లో వేలాది మంది నిరసన!

ఇంఫాల్‌ : వక్ఫ్ (సవరణ) చట్టం, 2025ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఇంఫాల్ తూర్పు ప్రాంతంలో వేలాది మంది మెయిటీ పంగల్‌లు నిరసనలు చేపట్టారు. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, తమ డిమాండ్లను నెరవేర్చకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ప్రదర్శనకారులు నినాదాలు చేశారు. ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులలో చేర్చడానికి అనుమతించే చట్టంపై జాతీయ స్థాయిలో పెరుగుతున్న భిన్నాభిప్రాయాల మధ్య నిరసన ఉద్యమం జరిగింది. హట్టా గోలపతి ప్రాంతంలో ర్యాలీతో నిరసన ప్రారంభమైంది. తరువాత స్థానిక […]
Read more

కంచ గచ్చిబౌలి భూమిని తనఖా పెట్టారనే బీఆర్‌ఎస్‌ ఆరోపణను తోసిపుచ్చిన మంత్రి శ్రీధర్‌బాబు!

హైదరాబాద్: గచ్చిబౌలి భూముల వివాదంపై బీఆర్‌ఎస్ అబద్ధపు ప్రచారం చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ భూముల్లో ఫైనాన్షియల్‌ ఫ్రాడ్‌ జరిగిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన ఆరోపణలకు మంత్రి కౌంటర్‌ ఇచ్చారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికి చెందినదని, సుప్రీంకోర్టు ఆదేశం తర్వాత ఎటువంటి వ్యాజ్యాలు లేకుండా ఉందని ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఏదైనా ఆరోపణలు […]
Read more

ఆహార భద్రతలో సన్న బియ్యం పథకం గేమ్ ఛేంజర్‌…మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి!

హైదరాబాద్: పేదలకు సన్న బియ్యం పంపిణీ పథకం… ఆహార భద్రత- సంక్షేమంలో ‘గేమ్ ఛేంజర్’గా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అభివర్ణించారు. పేదలకు పూర్తి స్థాయిలో ఆహార భద్రత కల్పించేందుకే సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టామని మంత్రి తెలిపారు. ఇది చరిత్రాత్మక పథకమని పేర్కొన్నారు. భారతదేశ చరిత్రలో అతిపెద్ద ఆహార భద్రతా చొరవగా దీనిని అభివర్ణిస్తూ, ఈ పథకానికి ప్రజల నుండి భారీ స్పందన […]
Read more

గాజా ఇప్పుడు హిరోషిమాగా మారింది: తమ నేరాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్న ఇజ్రాయెల్ సైనికులు!

జెరూసలేం : ఇజ్రాయెల్ సైనికులు సరిహద్దు వెంబడి బఫర్ జోన్ ప్రాంతాన్ని స్థాపించడానికి గాజాలో విస్తృతమైన విధ్వంసం, హత్యలను వివరిస్తూ వివరణాత్మక సాక్ష్యాలను అందించారని ఇజ్రాయెల్ గ్రూప్ బ్రేకింగ్ ది సైలెన్స్ కొత్త నివేదిక తెలిపింది. బఫర్ జోన్ ప్రణాళికను అమలు చేయడంలో పాల్గొన్న దళాల వివరాలను నివేదిక సంకలనం చేసింది. “ఈ మిషన్లలో ఒకటి గాజా లోపల ‘బఫర్ జోన్’ని సృష్టించడం, అంటే ఆచరణలో ఆ ప్రాంతాన్ని నేలమట్టం చేయడం. ఉద్దేశపూర్వక విధ్వంసం ద్వారా, సైన్యం […]
Read more

ప్రసిద్ధ షర్బత్‌ బ్రాండ్‌ రూహ్ అఫ్జా లక్ష్యంగా… ‘షర్బత్ జిహాద్’ను రెచ్చగొట్టిన బాబా రాందేవ్!

న్యూఢిల్లీ : యోగా గురువు, పతంజలి ఆయుర్వేద సహ వ్యవస్థాపకుడు రాందేవ్ ఇటీవల తన వ్యాఖ్యలతో కొత్త వివాదాన్ని రేకెత్తించారు. ప్రసిద్ధ షర్బత్‌ బ్రాండ్‌ రూహ్ అఫ్జా లక్ష్యంగా… ‘షర్బత్ జిహాద్’ అంటూ ప్రజలను హెచ్చరించారు. గతంలో “లవ్ జిహాద్”, “ఓట్ జిహాద్” వంటి పదాలతో పోల్చి… రాందేవ్ చేసిన ప్రకటన ఆన్‌లైన్‌లో తీవ్ర చర్చను రేకెత్తించింది. అతను వినియోగదారుల ఎంపికను మతతత్వంగా చూపిస్తున్నారని చాలామంది నెటిజన్లు ఆరోపించారు. పతంజలి ప్రొడక్ట్స్ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ […]
Read more

లక్నోలో మత సామరస్యం కోసం ‘హోలీ-ఈద్ మిలన్’ కార్యక్రమాన్ని నిర్వహించిన సమాజ్‌వాదీ పార్టీ!

లక్నో : మత సామరస్యం, ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో సమాజ్‌వాదీ పార్టీ.. రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ‘హోలీ-ఈద్ మిలన్’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం హిందూ మతం, ఇస్లాం, సిక్కు, క్రైస్తవ మతం వంటి వివిధ మతాల నాయకులు, అనుచరులను మత సంఘీభావాన్ని ప్రదర్శించే ఒక ఉత్సాహభరితమైన వేడుక అని ఆ పార్టీ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ… సాంస్కృతిక మత ఐక్యత ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. […]
Read more

రియల్ ఎస్టేట్ రంగంలో సందేహాలు తీర్చేందుకు వెబ్‌సైట్‌ను ప్రారంభించిన హైడ్రా!

హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రంగంలో చట్టపరమైన స్పష్టత, పారదర్శకతను తీసుకురావడం లక్ష్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గురువారం హౌసింగ్ రిక్వైర్‌మెంట్స్ కస్టమైజ్డ్ సొల్యూషన్స్– HRCS ఇండియా వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఆస్తి కొనుగోలుదారులు, విక్రేతలు, వాటాదారులకు చట్టపరమైన, రుణ సంబంధిత సమాచారాన్ని ఉచితంగా అందిస్తుంది. RERA-సర్టిఫైడ్ సంస్థ HRCS ఇండియా ద్వారా ఏర్పాటైన ఈ వెబ్‌సైట్… మనం కొనుగోలు చేసిన ఆస్తులు.. FTL పరిథిలో ఉన్నాయా లేదా బఫర్ జోన్‌లలోకి వస్తాయో లేదో నిర్ణయించడంలో వినియోగదారులకు సహాయపడుతుంది. […]
Read more

హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ మసీదులో లౌడ్ స్పీకర్ల నిషేధంపై వివాదం!

హైదరాబాద్: హనుమాన్ జయంతి యాత్ర రోజున నమాజ్ సమయంలో సౌండ్ సిస్టమ్‌ను ఉపయోగించవద్దని మసీదు యాజమాన్యానికి నోటీసు జారీ చేయడంతో వివాదం రేగింది. అయితే నోటీసులోని కంటెంట్ “తప్పుగా ప్రచురితమైందని” పోలీసులు చెబుతున్నారు. సికింద్రాబాద్‌లోని మారియట్ హోటల్ లేన్‌లోని మసీదు యాజమాన్యానికి గాంధీనగర్ పోలీసులు నోటీసు జారీ చేశారు. శనివారం, ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి ర్యాలీ మసీదు ముందు నుండి వెళ్ళే సమయంలో సౌండ్ సిస్టమ్‌ను ఉపయోగించవద్దని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ SHO సంతకం చేసిన […]
Read more
1 120 121 122 123 124 143

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.