Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

జూలైలో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం!

హైదరాబాద్: సమీప భవిష్యత్తులో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసే సూచనలు లేనందున, జూలైలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల నాగర్ కర్నూల్ పర్యటన తర్వాత, అధికార కాంగ్రెస్ ఈ ప్రతిపాదనను పరిశీలిస్తోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీ వర్గాల ప్రకారం, ముఖ్యమంత్రి ఈ అవకాశం గురించి సూచించడంతో, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి అధికార పార్టీ […]
Read more

కేరళ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త హత్య కేసులో పాపులర్ ఫ్రంట్ నాయకుడికి సుప్రీంకోర్టు బెయిల్!

న్యూఢిల్లీ : నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మాజీ సెక్రటరీ జనరల్ అబ్దుల్ సత్తార్‌కు సుప్రీంకోర్టు నుండి బెయిల్ లభించింది. పాలక్కాడ్‌లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త శ్రీనివాసన్‌ను హత్య చేయడానికి 2022 కుట్రకు సంబంధించిన కేసులో ఆయనకు బెయిల్‌ దక్కింది. ఒక నిర్దిష్ట భావజాలాన్ని కలిగి ఉన్నందుకు మాత్రమే వ్యక్తులను జైలులో పెట్టలేమని కోర్టు వ్యాఖ్యానించింది. కేరళ హైకోర్టు బెయిల్ నిరాకరణను సవాలు చేస్తూ సత్తార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను విచారిస్తూ జస్టిస్ అభయ్ […]
Read more

కేశవరావు హత్య తర్వాత కొత్త నాయకత్వం కోసం వెతుకుతున్న మావోయిస్ట్‌లు… అప్రమత్తంగా ఉన్న భద్రతా దళాలు!

హైదరాబాద్: మావోయిస్ట్‌ల దళపతి కేశవరావు మరణం తర్వాత, సీపీఐ (మావోయిస్ట్) పార్టీకి నాయకత్వం వహించే అవకాశం ఉన్నవారిని భద్రతా దళాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఆపరేషన్ కాగర్ సమయంలో కేశవరావు అలియాస్ బసవ రాజ్ హత్య నక్సల్ ఉద్యమానికి ఒక కీలక ఘట్టంగా నిలిచింది – దశాబ్దాల సాయుధ పోరాటంలో మావోయిస్టులక లీడర్‌ లేకపోవడం ఇదే తొలిసారి. భద్రతా దళాలు ఉన్నత స్థాయి నక్సలైట్‌ను ఎన్‌కౌంటర్‌ చేయడం కూడా ఇదే మొదటిసారి. దేశం నుండి వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించే […]
Read more

‘కిరు హైడల్’ కేసులో జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ సహా ఆరుగురిపై అభియోగాలు మోపిన సీబీఐ!

న్యూఢిల్లీ: కిరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కేసుకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ సహా మరో ఐదుగురిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) చార్జిషీట్ దాఖలు చేసింది. మూడేళ్ల దర్యాప్తు తర్వాత సీబీఐ తన విచారణాంశాలను ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 22న మాలిక్ ఇల్లు, ఇతర ఆస్తులపై సిబిఐ దాడులు చేసిన తర్వాత ఈ చార్జిషీట్ దాఖలైంది. మాలిక్‌తో పాటు, అప్పటి చెనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్స్ […]
Read more

‘మీ ప్రసంగంలో బీజేపీని లక్ష్యంగా చేసుకుని ఉండాల్సింది’…కేసీఆర్‌కు లేఖ రాసిన కవిత!

హైదరాబాద్: ఏప్రిల్ 27న హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో జరిగిన BRS సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ తర్వాత తన తండ్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు రాసినట్లు చెబుతున్న లేఖ సంచలనం సృష్టిస్తోంది. పార్టీ రజతోత్సవ సభలో బీజేపీని లక్ష్యంగా చేసుకుని ఇంకా గట్టిగా మాట్లాడాల్సి ఉందంటూ.. , ఎమ్మెల్సీ కవిత స్వదస్తూరీతో లేఖ రాసింది. ఆమె అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు నిన్న మీడియాకు లీక్ అయిన 6 పేజీల లేఖలో, కేసీఆర్ బహిరంగ సభలో తన ప్రసంగంలో […]
Read more

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత… భారత్‌లో ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడంపై ఆందోళన!

న్యూఢిల్లీ: పహల్గామ్‌లో 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న తరువాత బిజెపి పాలిత రాష్ట్రాల్లోని ముస్లిం సమాజాన్ని, వారి సంస్థలను లక్ష్యంగా చేసుకున్న వైనం ఆందోళన రేకెత్తిస్తోంది. భారత సాయుధ దళాలు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద లక్ష్యాలను ఢీకొట్టగా, అదే సమయంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు ముస్లిం సమాజాలలో తీవ్రమైన మానవ హక్కుల ఆందోళనలను రేకెత్తించాయి. విషాదం తర్వాత, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లోని అధికారులు మదర్సాలు, మసీదులు, ఇతర ముస్లిం మత సంస్థలను అధికారిక అనుమతి […]
Read more

పాక్‌పై భారత్‌ దౌత్య యుద్ధం…భారత ఎంపీలు విదేశాల్లో ఎదుర్కోవాల్సిన ప్రశ్నలు!

న్యూఢిల్లీ : పహల్గామ్‌ ఉగ్రదాడికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌పై భారత్‌ దౌత్య యుద్ధానికి దిగింది. ఉగ్ర సంస్థలకు ఆశ్రయమిస్తున్న పాక్ తీరును అంతర్జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకు ఏడు బృందాలతో కూడిన 59 ఎంపీలు 33 దేశాల్లో పర్యటింకానున్నారు. 7 అఖిలపక్ష ఎంపీల బృందాలు మే 22న విదేశాలకు బయలుదేరి జూన్ మొదటివారంలో తిరిగి భారత్ వచ్చే అవకాశం ఉంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్ ఏవిధంగా మద్దతు పలుకుతోందనే విషయాన్ని.. ఆపరేషన్ సిందూర్ తో ఉగ్రవాదంపై భారత్ జరిపిన పోరాటాన్ని […]
Read more

ఢిల్లీ అసెంబ్లీలో సావర్కర్, దయానంద సరస్వతి, మాలవీయా చిత్రపటాలు!

న్యూఢిల్లీ: జనరల్ పర్పసెస్ కమిటీ ఆమోదించిన ఏకగ్రీవ తీర్మానం తర్వాత ఢిల్లీ శాసనసభలో వీర్ సావర్కర్, మహర్షి దయానంద సరస్వతి, పండిట్ మదన్ మోహన్ మాలవీయల చిత్రపటాలు ఏర్పాటు చేయనున్నట్లు స్పీకర్ విజేందర్ గుప్తా ప్రకటించారు. గుప్తా అధ్యక్షత వహించిన జనరల్ పర్పసెస్ కమిటీ సమావేశం, ఇది “జాతీయ చిహ్నాలను” గౌరవించే తీర్మానాన్ని ఆమోదించింది. స్పీకర్‌ కార్యాలయం నుండి వచ్చిన ఒక ప్రకటన ప్రకారం… భారతదేశ స్వాతంత్ర్య పోరాటం, సామాజిక సంస్కరణ, విద్యా పునరుజ్జీవనానికి వారు చేసిన […]
Read more

తెలంగాణలో భారీ వర్షాలు… కొనుగోలు కేంద్రాల్లో దెబ్బతిన్న వరి!

హైదరాబాద్: ఉత్తర తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వడగళ్లు, బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. అకాల వర్షం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొనుగోలు కేంద్రాల్లో వరి, మొక్కజొన్న దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ఈ నష్టం ఎక్కువగా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈదురు గాలులు, వడగళ్ల వానతో పలు పంటలు నేలపాలు అయ్యాయి. ములుగు జిల్లాలో శివపురం, ఏటూరునాగారం మండలాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. జగిత్యాల జిల్లాలోని […]
Read more

త్రిభాష ఫార్ములా అమలు చేయనందుకు ఆగిపోయిన నిధులు…సుప్రీంకోర్టు మెట్లెక్కిన తమిళనాడు!

న్యూఢిల్లీ: కేంద్రం, తమిళనాడు మధ్య భాషా వివాదంలో మరో సంచలనాత్మక మలుపు తిరిగింది. జాతీయ విద్యా విధానం అమలు చేయడం లేదన్న కారణంతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తమ రాష్ట్రానికి రావాల్సిన రూ.2,151 కోట్ల నిధులను నిలిపివేసిందని కోర్టుకు తెలిపింది. ఈ మేరకు ఎంకే స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. విద్యార్థులు ఇంగ్లీష్, ప్రాంతీయ భాషతో పాటు మూడవ భాషను నేర్చుకునే త్రిభాషా సూత్రాన్ని సిఫార్సు చేసే జాతీయ విద్యా విధానాన్ని డిఎంకె […]
Read more
1 120 121 122 123 124 158

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.