Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

బెంగళూరులో ‘చెత్త పన్ను’ రెట్టింపు…అమల్లోకి వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ట్యాక్స్‌!

బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం.. కొత్తగా చెత్త సేకరణపైనా గార్బేజ్ సెస్‌ను విధించింది. బెంగళూరు నగరంలో వ్యర్థాల నిర్వహణ కోసం బృహత్‌ బెంగళూరు మహానగర పాలిక -బీబీఎంపీ.. ఈ చెత్త సెస్‌ను వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరం అమలులోకి వచ్చిన కొత్త ‘చెత్త పన్ను’ – BBMP ఘన వ్యర్థాల నిర్వహణ (SWM) సేవలను పొందని పెద్ద అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌ల నివాసితులకు రెట్టింపు దెబ్బగా భావిస్తున్నారు. ఎందుకంటే బల్క్ వ్యర్థాల ఉత్పత్తిదారులు ఇప్పటికే ప్రతి నెలా […]
Read more

వంట గ్యాస్ సిలిండర్‌పై 50 రూపాయలు పెంచిన కేంద్ర ప్రభుత్వం!

న్యూఢిల్లీ: వంటగ్యాస్‌ ధరను రూ.50 చొప్పున పెంచినట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. అదేసమయంలో CNG కిలోకు రూ.1 చొప్పున పెంచగా, ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకోవడానికి పెట్రోల్, డీజిల్ పై పన్నులు పెంచింది. ఉచితంగా LPG కనెక్షన్ పొందిన పేద లబ్ధిదారులైన ఉజ్వల్‌ సాధారణ వినియోగదారులకు వంట గ్యాస్ ధర పెంపు ఏప్రిల్ 8 నుండి అమలులోకి వస్తుందని, ఇన్పుట్ ఖర్చు పెరుగుదల కారణంగా ఇది అవసరమని చమురు మంత్రి […]
Read more

బీహార్‌లో టోపీలు ధరించిన 32 మంది మదర్సా పిల్లలను అదుపులోకి తీసుకున్న పోలీసులు!

పాట్నా : బీహార్ పోలీసులు నిన్న 32 మంది ముస్లిం పిల్లలను తలపై టోపీలు పెట్టుకున్నందుకు అదుపులోకి తీసుకున్నారు. ఈ పిల్లల వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయింది. వన్ ఇండియా హిందీ వార్తా సంస్థ ప్రకారం, జామియా జకారియా మదర్సాలో చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు పిల్లలను మోకామా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ పిల్లలు బీహార్‌లోని మైదాబభంగామా అనే గ్రామానికి చెందినవారు. విద్యార్థులు టోపీలు పెట్టుకున్నందుకు గానూ పోలీసులు అరెస్టు చేశారని వన్ ఇండియా హిందీ […]
Read more

సెంట్రల్‌ వర్సిటీ విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశం!

హైదరాబాద్: సెంట్రల్‌ యూనివర్సిటీ సమీపంలోని కంచ గచ్చిబౌలి వద్ద 400 ఎకరాల భూమిలో చెట్ల నరికివేతపై జరిగిన నిరసనకు సంబంధించి వర్సిటీ విద్యార్థులపై కేసులను ఉపసంహరించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పోలీసులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ఆయన, మంత్రులు శ్రీధర్ బాబు,శ్రీనివాస రెడ్డి, యుఓహెచ్ ఉపాధ్యాయ సంఘం, పౌర సమాజ సభ్యులతో జరిగిన మంత్రివర్గ కమిటీ సమావేశంలో ఈ ఆదేశాలు ఇచ్చారు. […]
Read more

హైదరాబాద్ మెట్రోపై బెట్టింగ్ ప్రకటనలు… తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు!

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు రైళ్లు, స్టేషన్లలో ప్రదర్శిస్తున్న బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించే ప్రకటనలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) దాఖలైంది. కెపిహెచ్‌బి కాలనీకి చెందిన న్యాయవాది ఎన్ నాగూర్ బాబు, అటువంటి ప్రకటనలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇలాంటి చర్యల కారణంగా చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్‌ల కార్యకలాపాలను ప్రోత్సహిస్తాయని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌లో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, పౌర అధికారులు, పోలీసు అధికారులను […]
Read more

మైనారిటీ హక్కులను కాపాడుకోవడంలో ముస్లిం ఎంపీలు ఐక్యతగా వ్యవహరించాలి: ముస్లిం మేధావులు!

న్యూఢిల్లీ: భారతదేశంలో ముస్లిం సమాజానికి సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో…మైనారిటీ హక్కులను కాపాడుకోవడంలో ముస్లిం ఎంపీలు ఐక్యతగా వ్యవహరించాలని ప్రముఖ ముస్లిం నాయకులు, మేధావులు, మాజీ అధికారులు, పౌర సమాజ సభ్యుల బృందం విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం వంటి ఇటీవలి పరిణామాల నేపథ్యంలో, మైనారిటీ హక్కులను కాపాడటానికి పార్టీలకు అతీతంగా కలిసి నిలబడాలని వారు ఎంపీలను కోరారు. రాజ్యాంగ విలువలను నిలబెట్టడానికి, సమాజ గౌరవాన్ని కాపాడటానికి సమిష్టి వ్యూహం అవసరాన్ని ఈ విజ్ఞప్తి […]
Read more

బీహార్‌లో ‘వైట్ టీ-షర్ట్ ఉద్యమాన్ని’ ప్రారంభించనున్న రాహుల్ గాంధీ!

న్యూఢిల్లీ: న్యాయం, సమానత్వమే లక్ష్యంగా బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో వైట్ టీ-షర్ట్ ఉద్యమాన్ని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రారంభించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ…యువత ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొనాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బీహార్ యువతకు విజ్ఞప్తి చేశారు, రాష్ట్ర ప్రజలు ఇకపై మోసపోరని, వారు తమ విధిని తామే రాసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని బలమైన సందేశాన్ని ప్రజల్లోకి పంపారు. ఈ పర్యటనకు ముందు, బీహార్‌లో వైట్ టీ-షర్ట్ ఉద్యమం విజయవంతం కావాలని […]
Read more

మణిపూర్‌లో భారీగా ప్రబలిన రేబిస్…ముగ్గురు మృతి, వందలాది మంది బాధితులు!

గౌహతి: మణిపూర్‌లోని చురచంద్‌పూర్ జిల్లా న్యూ జోవెంగ్ గ్రామంలో రేబిస్ వ్యాధి భారీగా ప్రబలింది. దీంతో అధికారులు ఆంక్షలు విధించి, కంటైన్‌మెంట్ జోన్‌లను ప్రకటించారు. ఈ గ్రామంలో గత వారం నుండి రేబిస్ కేసులు వెలుగులోకి రావడం ప్రారంభించాయి. ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటిదాకా 749 మందిని కుక్కలు కరిచాయి. ఈ కారణంగా ముగ్గురు చనిపోయినట్టు అధికారిక వర్గాల ప్రకటించాయి. న్యూ జౌవెంగ్ గ్రామంలో ఇప్పుడు పెద్దసంఖ్యలో అనుమానిత రేబిస్ కేసులు నమోదయ్యాయి, ఇది ప్రజలు, […]
Read more

వక్ఫ్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన ఎస్‌జీపీసీ, అకల్ తఖ్త్, సిరోమణి అకాలీదళ్ సంస్థలు!

న్యూఢిల్లీ: వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లును పంజాబ్‌కు చెందిన అనేక ప్రముఖ సిక్కు సంస్థలు, పాంథిక్ పార్టీలు వ్యతిరేకించాయి. దేశవ్యాప్తంగా గురుద్వారాలను నిర్వహించే సిక్కుల అత్యున్నత సంస్థలుగా పేరుగాంచిన శిరోమణి అకాలీదళ్‌తో సహా మిగతా సంస్థలు బిల్లును ఖండించాయి. ఇది “ముస్లిం వ్యతిరేకమని” ప్రకటించాయి. వక్ఫ్‌ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లోక్‌సభలో జరిగిన చర్చలో శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, బిజెపి పార్టీ “మతం,కులం ఆధారంగా ప్రజలను విభజిస్తోంది” అని ఆరోపించారు. “వక్ఫ్ […]
Read more

మార్కెట్ల పతనంపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు…వాణిజ్య లోటు పరిష్కారమయ్యేవరకు సుంకాలు తగ్గించే ప్రసక్తే లేదన్న అమెరికా అధ్యక్షుడు!

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల కారణంగా వాల్ స్ట్రీట్‌లో గణనీయమైన నష్టాలను అమెరికా ఫ్యూచర్స్ సూచించాయి. ట్రంప్‌ టారిఫ్‌ల భయంతో నేడు ఆసియా స్టాక్ మార్కెట్లు బ్లడ్‌బాత్‌తో ప్రారంభమయ్యాయి, బొంబాయి స్టాక్‌ ఎక్స్చేంజీ భారీగా నష్టపోయి బ్లాక్‌మండేను తలపించింది. కాగా, పడిపోతున్న మార్కెట్ల గురించి ట్రంప్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు అనారోగ్యాన్ని బాగు చేసుకోవాలంటే చేదుగా ఉన్నా సరే మెడిసిన్ తీసుకోవాల్చి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇక, వాణిజ్య లోటు […]
Read more
1 122 123 124 125 126 143

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.