Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

గాజాలో ఇజ్రాయెల్ ఎడతెగని బాంబు దాడులు… బందీలకు ప్రమాదకరం అన్న హమాస్!

గాజా నగరం: ఇజ్రాయెల్‌ బాంబుదాడులతో గాజా ఉక్కిరిబిక్కిరవుతోంది. దాడులు ఇలాగే కొనసాగితే అక్కడ ఉన్న బందీలకు “చాలా ప్రమాదకరమైన” పరిస్థితిని సృష్టిస్తోందని హమాస్ తెలిపింది. జీవించి ఉన్న బందీలలో సగం మంది సైన్యం ఉన్న ప్రాంతాలలో ఉన్నారని మిలిటెంట్‌ సంస్థ ప్రతినిధి హెచ్చరించారు. “జీవించి ఉన్న ఇజ్రాయెల్ (బందీలు)లో సగం మంది… ఇజ్రాయెల్ సైన్యం ఇటీవలి రోజుల్లో ఖాళీ చేయమని కోరిన ప్రాంతాలలోనే ఉన్నారు” అని హమాస్ సాయుధ విభాగం ప్రతినిధి అబు ఒబెదా ఒక ప్రకటనలో […]
Read more

హైదరాబాద్‌ నగరాన్ని సందర్శించిన ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం!

హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కమిషన్ ఇటీవల హైదరాబాద్‌ను సందర్శించింది. ఇరు దేశాల మధ్య సాంకేతికతలు అందిపుచ్చుకోవడం, గ్రీన్‌ ఎకానమీ, మౌలిక సదుపాయాలలో ఆస్ట్రేలియా నైపుణ్య సామర్థ్యాలను ప్రదర్శించడమే లక్ష్యంగా ఈ బృందం పర్యటించింది. ఈ బృందంలో 13 సంస్థల నుండి 19 మంది సభ్యులు ఉన్నారు. ఆస్ట్రేలియన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కమిషన్ (ఆస్ట్రేడ్) నిర్వహించిన ఈ పర్యటన, రెండు వైపులా మార్కెట్ అవగాహనను పెంపొందించడం,ఆస్ట్రేలియన్, భారతీయ సంస్థలు, విశ్వవిద్యాలయాలు,కార్పొరేట్ ప్రొవైడర్ల మధ్య భాగస్వామ్యాలను […]
Read more

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం-మత స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులపై ప్రత్యక్ష దాడి…సయ్యద్ సాదతుల్లా హుస్సేనీ!

న్యూఢిల్లీ : లోక్‌సభలో వక్ఫ్ సవరణ చట్టం 2025 ఆమోదం పొందడాన్ని జమాతే-ఇ-ఇస్లామి హింద్ (JIH) అధ్యక్షుడు సయ్యద్ సాదతుల్లా హుస్సేనీ తీవ్రంగా ఖండించారు, దీనిని మత స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులపై స్పష్టమైన దాడి అని అభివర్ణించారు. ఈ చట్టం ఆమోదం వివక్షతతో కూడుకున్నది, ఎందుకంటే ఇది ముస్లింలు తమ మతపరమైన ఆస్తులను నిర్వహించడంలో స్వయంప్రతిపత్తిని హరింపజేస్తుంది, అయితే ఇతర వర్గాల మతపరమైన ట్రస్టులు మాత్రం ప్రభావితం కావు. అంతేకాదు ‘వక్ఫ్ చట్టం 1995’లో భారీ మార్పులను […]
Read more

విద్యా వ్యవస్థ బలోపేతానికి కొత్త రోడ్‌మ్యాప్‌…సీఎం రేవంత్‌రెడ్డి!

హైదరాబాద్: ప్ర‌స్తుత విద్యా వ్య‌వ‌స్థ‌లో లోపాలు, తీసుకురావ‌ల్సిన సంస్క‌ర‌ణ‌ల‌పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఆచరణీయమైన పాలసీని సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి విద్యా కమిషన్‌ను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ… క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా, ఆచరణ సాధ్యంగా పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు ప్రారంభించిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వీటిలో […]
Read more

పార్లమెంట్‌లో అర్థరాత్రి దాటాక ఆమోదం పొందిన వక్ఫ్‌ బిల్లు… భూ కబ్జాకు రాజమార్గమని అభివర్ణించిన విపక్షాలు!

న్యూఢిల్లీ: వరుసగా రెండవ రోజు, పార్లమెంటు అర్ధరాత్రి దాటాక కూడా పనిచేసింది, రాజ్యసభ 2025 వక్ఫ్ సవరణ బిల్లును తెల్లవారుజామున 2.35 గంటలకు రాజ్యసభ చట్టానికి అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లతో ఆమోదం పొందింది. ఏప్రిల్ 3న తెల్లవారుజామున 2 గంటలకు బిల్లును ఆమోదించిన లోక్‌సభతో పోలిస్తే ఎగువ సభ కొద్ది ఎక్కువ సమయం తీసుకుంది. బిల్లుకు నిరసనగా అనేక మంది ప్రతిపక్ష సభ్యులు నల్ల దుస్తులు ధరించి పార్లమెంటుకు వచ్చారు. తెలుగుదేశం పార్టీ, […]
Read more

గాజా పిల్లలకు ప్రాణసంకటంగా మారిన పేలని బాంబులు!

జెరూసలేం: యుద్ధం కారణంగా శిధిల నగరం గాజా పేలని బాంబులతో నిండిపోయింది. వాటిని తొలగించడానికి సంవత్సరాలు పడుతుంది, లోహపు కేసింగ్‌లతో ఈ బాంబులు పిల్లలన అమితంగా ఆకర్షిస్తున్నాయి. వాటిని తీయడానికి ప్రయత్నించినప్పుడు అవి పేలి చిన్నారులు వికలాంగులుగా మారుతున్నారు. లేదంటే మరణించడం సంభవిస్తుందని ఒక మందుపాతర నిర్మూలన నిపుణుడు వార్తా సంస్థతో చెప్పారు. ఈ సందర్భంగా యుకె మాజీ సైనిక మందుపాతర నిర్మూలన నిపుణుడు మాట్లాడుతూ… యుద్ధంలో దెబ్బతిన్న పాలస్తీనా భూభాగానికి ఒక మిషన్ తర్వాత “ప్రస్తుతం […]
Read more

వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇచ్చిన జేడీయూ… పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత మహమ్మద్ ఖాసిం!

న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని పార్టీ సీనియర్ నాయకుడు మహమ్మద్ ఖాసిం అన్సారీ రాజీనామా చేశారు, వక్ఫ్ సవరణ బిల్లుకు పార్టీ మద్దతు ఇవ్వడంతొ తాను వైదొలగానని ఆయన స్పష్టం చేశారు. నితీష్ కుమార్‌కు రాసిన రాజీనామా లేఖలో, వక్ఫ్ అంశంపై జెడి(యు) వైఖరిపై అన్సారీ తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు, ఈ బిల్లు పార్టీ సూత్రాలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా తన యావత్‌ జీవితాన్ని పార్టీకి అంకితం చేసానని, అయితే ఈ […]
Read more

వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న డీఎంకే!

చెన్నై: కేంద్రం ప్రతిపాదించిన వక్ఫ్ (సవరణ) బిల్లు 2025కి వ్యతిరేకంగా ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకమని…. బిల్లు ఆమోదం పొందడాన్ని నిరసిస్తూ నల్ల రిబ్బన్ ధరించిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, వక్ఫ్ ఆస్తుల విషయంలో బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమిళనాడు పోరాడుతుందని, అందులో విజయం సాధిస్తుందని అసెంబ్లీలో అన్నారు. “భారతదేశంలోని మెజారిటీ రాజకీయ పార్టీలు వక్ఫ్ (సవరణ) బిల్లును వ్యతిరేకించాయి. దాని […]
Read more

హైదరాబాద్‌లో భారీ వర్షాలు…కూలిన చెట్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం, అప్రమత్తమైన ప్రభుత్వం!

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నిన్న మధ్యాహ్నం కురిసిన భారీ, అకాల వర్షాల నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. నగరంలో భారీ వర్షం కారణంగా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూసుకోవాలని, అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు. గంగా నగర్, మౌలా కా చిల్లాతో సహా ఆకస్మిక వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలలోని ఇళ్ళు మునిగిపోయాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి, లోతట్టు ప్రాంతాలలో నివసించేవారికి […]
Read more

మణిపూర్ సంక్షోభం నుండి బయటపడటానికి మార్గం ఉందా?

హైదరాబాద్: మణిపూర్‌లో పాలనా సంక్షోభం జాతీయ-రాజ్య ఏర్పాటు పర్యవసానమే. అయితే అభివృద్ధి విధానాల ప్రక్రియల పరంగా ఈశాన్య ప్రాంతంలో రాజకీయ సార్వభౌమ అధికారంగా ఆధునిక రాష్ట్రం పరిణామం వివాదాస్పదంగా ఉంది. అందువల్ల, ఈ ప్రాంతం వేర్పాటువాదం నుండి తిరుగుబాటు వరకు వివిధ రకాల సామాజిక-రాజకీయ సంఘర్షణలకు గురవుతోంది. “దక్షిణాసియాలోని చాలా దేశాలు ఎప్పుడూ సార్వభౌమ రాజ్యాలుగా ఉండటానికి ప్రయత్నించలేదు అని ఊమెన్ (2001) వాదించాడు. ఈ ప్రాంతాలలో అలాంటి రాష్ట్రాలు లేవని దీని అర్థం కాదు; వారికి […]
Read more
1 123 124 125 126 127 143

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.