Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఉత్కంఠతకు తెర…సునీతా విలియమ్స్ సేఫ్ ల్యాండింగ్!

ఫ్లోరిడా : యావత్‌ ప్రపంచాన్ని ఉత్కంఠతకు గురిచేసిన సునీతా విలియమ్స్‌ అంతరిక్షయానం విజయవంతంగా ముగిసింది. 286రోజులు అంతర్జాతీయ అంతరిక్షంలో చిక్కుకుపోయిన బారత సంతతి వ్యోమగామి భారత కాలమానం ప్రకారం ఈరోజు తెల్లవారుఝామున సురక్షితంగా భూమికి చేరుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కేవలం 8 రోజుల పాటు ఉండేందుకు వెళ్లిన ఆమెతో పాటు బుచ్ విల్మోర్ అనే మరో అస్ట్రోనాట్ …తిరిగి తీసుకు వచ్చే వ్యోమనౌక లో సమస్యలు ఏర్పడటంతో అక్కడే ఉండి పోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు నాసా […]
Read more

ఔరంగజేబు సమాది వివాదం…నాగపూర్‌లో హింస!

ముంబయి: మహారాష్ట్ర శంభాజీ నగర్‌లోని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంస్థలు నిరసన నిర్వహించిన కొన్ని గంటల తర్వాత నాగ్‌పూర్‌లో శుక్రవారం సాయంత్రం హింసాత్మక ఘర్షణలు జరిగాయి, 30 మందికి పైగా గాయపడ్డారు. హింస ముందస్తు ప్రణాళికతో జరిగిందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆరోపించింది. నగరంలోని మహల్ ప్రాంతంలో రెండు గ్రూపుల మధ్య జరిగిన భారీ ఘర్షణ తర్వాత దాదాపు 60 నుండి 65 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. […]
Read more

వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో జంతర్‌మంతర్‌ వద్ద భారీ నిరసన!

న్యూ ఢిల్లీ: వక్ఫ్ (సవరణ) బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) భారీ నిరసనను నిర్వహించింది. బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విభిన్న నేపథ్యాల నుండి వేలాది మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ నిరసనలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, AAP, AIMIM, CPI, CPI(ML), CPM, IUML, NCP, TMC, BJD, WPI వంటి వివిధ ముస్లిం సంస్థలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు […]
Read more

రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు జూన్ 2న రుణ మంజూరు లేఖలు ఇస్తాం…డిప్యూటీ సీఎం!

హైదరాబాద్: రాజీవ్ యువ వికాసం పథకం లబ్దిదారులకు జూన్ 2న రుణ మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క వెల్లడించారు. ఈ మేరకు బ్యాంకు రుణాలు పొందేందుకు ఎంపికైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ఐదు లక్షల మంది యువతకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న రుణ మంజూరు లేఖలు అందించనున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి నిన్న అసెంబ్లీ ప్రాంగణంలో లబ్ధిదారుల […]
Read more

స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ కోటాకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం!

హైదరాబాద్: వెనుకబడిన తరగతుల (గ్రామీణ,పట్టణ స్థానిక సంస్థల్లో సీట్ల రిజర్వేషన్) బిల్లు, 2025ను తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. తొలుత.. ‘తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ (విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు) బిల్లు-2025’, ‘తెలంగాణ బీసీ (స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు) బిల్లు-2025’ను మంత్రి పొన్నం ప్రభాకర్‌ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును నిన్నటి సమావేశంలో మూజువాణి ఓటుతో ఆమోదించారు. అదే సమయంలో ఈ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం కూడా పొందాల్సి ఉన్నందున రాజ్యాంగ సవరణలు తీసుకురావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని […]
Read more

బెంగాల్‌లో కుల వివక్ష… ఆలయ ప్రవేశం కోసం పోరాటం చేస్తున్న ‘దాస్’ వర్గీయులు!

కోల్‌కత పశ్చిమ బెంగాల్‌లో ఓ భూస్వామి నిర్మించిన గిదేశ్వర్ శివాలయం, గ్రామ కుల సోపానక్రమానికి ప్రతిరూపం. శతాబ్దాల క్రితం ఆ జమీందార్‌ 60 బిఘాల భూమిని ఈ ఆలయం కోసం దానం చేసాడు. వివిధ వర్గాలకు భూమితో పాటు విధులను కేటాయించారు. జమీందారు స్థాపించిన గిదేశ్వర్ శివాలయంలో బ్రాహ్మణులు ఆచారాలను చూసుకుంటారు, ఘోష్ సమాజం పాలను, మలకర్ సమాజం పువ్వులు సరఫరా చేస్తుంది, బయాన్లు సంగీతానికి బాధ్యత వహిస్తారు. మరోవంక తరతరాలుగా ఆలయ భూమిలో నివసించే దాస్ […]
Read more

హౌతీలు ఎవరు? వారిపై అమెరికా ఎందుకు దాడి చేస్తోంది?

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యెమెన్ లోని హౌతీ మిలిటెంట్లపై సైనిక చర్యను ప్రారంభించారు. ఈ దాడిలో పదుల సంఖ్యలో హౌతీలు చనిపోయారు. ఎర్ర సముద్రంలో షిప్పింగ్ పై దాడులు చేస్తున్న హౌతీలను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఈ దాడి జరిగింది. ఇరాన్ సహాయంతో హౌతీలు రెచ్చిపోతున్నారని, ఈ చర్యతో టెహ్రాన్ పై ఒత్తిడిని పెంచాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ దాడులు మరికొన్ని వారాల పాటు కొనసాగవచ్చని ఒక అమెరికా అధికారి తెలిపారు హౌతీల చరిత్ర […]
Read more

హోలీ రంగులను నిరాకరించిన ముస్లిం వ్యక్తిపై దాడి…హత్య!

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో హోలీ పండుగ సందర్భంగా తనపై రంగుజల్లడాన్ని నిరాకరించిన ముస్లిం వ్యక్తిపై అక్కడి గుంపు దారుణంగా దాడి చేశారు. కొత్వాలి సదర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో 55 ఏళ్ల మహ్మద్ షరీఫ్ అనే వ్యక్తిని హోలీ వేడుకలు జరుపుతున్న వ్యక్తులు అడ్డగించారు. అతనిపై బలవంతంగా రంగులు వేయడానికి ప్రయత్నించారు. అతను ప్రతిఘటించగా ఆ బృందం అతనిపై దాడులకు పాల్పడింది. చేసింది. షరీఫ్ అక్కడి నుండి తప్పించుకోగలిగినప్పటికీ, అతనికి […]
Read more

వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నేడు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ముస్లి పర్సనల్ లా ఆధ్వర్యంలో ధర్నా!

హైదరాబాద్‌: కొంతకాలంగా వక్స్ ఆస్తులకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ముస్లిం సంస్థలు, పౌర సంఘాలు, విపక్ష సభ్యులు వక్స్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ తమ అభ్యంతరాలను వ్యక్తం చేసినప్పటికీ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇదేమీ పట్టకుండా ప్రస్తుత లోకసభ సమావేశాలలోనే బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నేడు దేశరాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘ ముస్లిం పర్సనల్ లా బోర్డు’ ధర్నాకు పిలుపునిచ్చింది. ప్రతిపాదిత చట్టం వక్ఫ్ ఆస్తులను “ఆక్రమణ” చేయడానికి […]
Read more

హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తాం…సీఎం రేవంత్ రెడ్డి!

వరంగల్: కాంగ్రెస్‌ నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్ అభివృద్ధికి ప్రాముఖ్యత ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. “ప్రజాపాలన – ప్రగతి బాట” సమావేశంలో మాట్లాడుతూ, వరంగల్ చారిత్రక ప్రాముఖ్యతను, తెలంగాణ ఉద్యమంలో పూర్వ జిల్లా ప్రజలు, కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు పోషించిన కీలక పాత్రను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా, ఔటర్ రింగ్ రోడ్, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థతో సహా కీలకమైన మౌలిక సదుపాయ ప్రాజెక్టుల కోసం […]
Read more
1 129 130 131 132 133 143

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.