Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

మణిపూర్‌లో మళ్లీ అలజడి…మంటల్లో కాలిపోయిన కుకీ గ్రామాలు, కర్ఫ్యూ విధింపు

ఇంఫాల్‌ : బుధవారం సాయంత్రం, మణిపూర్‌లోని కామ్జోంగ్, సహంఫుంగ్‌లోని రెండు గ్రామాల్లోని కుకి ఇళ్లకు దుండగులు నిప్పంటించి, వాటిని ధ్వంసం చేశారు. 28 ఇళ్లు కాలి బూడిదయ్యాయని అంచనా. ఈ ఘటన తరువాత జిల్లా మేజిస్ట్రేట్ రెండు గ్రామాల్లో కర్ఫ్యూ విధించారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని పోలీసు అధికారులు తెలిపారు. అయితే, ఈ దాడి కారణంగా ఇళ్ళు, జీవనోపాధిని కోల్పోవడంతో అనేక కుకీల కుటుంబాలు నాశనమయ్యాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సహంఫంగ్ సబ్ డివిజన్ […]
Read more

పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారతదేశం అంతటా కాశ్మీరీ విద్యార్థులపై దాడులు, వేధింపులు!

న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన క్రూరమైన ఉగ్రవాద దాడిలో కనీసం 25 మంది పర్యాటకులు, ఒక స్థానికుడు ప్రాణాలు కోల్పోయిన తరువాత, భారతదేశం అంతటా కాశ్మీరీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వేధింపులు పెరుగుతున్నాయి. చండీగఢ్‌లోని ఒక కాశ్మీరీ ముస్లిం బాలిక ఇంటికి తిరిగి వెళ్లడానికి తక్షణ సహాయం కోరుతోంది, స్థానిక వేధింపులను ఎదుర్కొంటోంది. ఆమెను, ఇతరులను బలవంతంగా దింపేసిన క్యాబ్ డ్రైవర్ ఆమెపై దాడి చేశాడు. https://www.instagram.com/reel/DI1EVCMJpCG/?igsh=eDZobmRycms0YjMz జమ్మూ కాశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (JKSA) […]
Read more

పహల్గాం ఉగ్రదాడి భద్రతా వైఫల్యమే…అఖిలపక్ష సమావేశానికి ప్రధాని గైర్హాజరు!

న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్ర దాడిలో భద్రతా లోపాలు ఉన్న మాట నిజమేనని అఖిల పక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సమావేశంలో, ఉగ్రవాదంపై చర్య తీసుకోవడంలో ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రతిపక్ష సభ్యులు హామీ ఇస్తూనే, సమావేశంలో ప్రధాని మోదీ లేకపోవడం, దాడికి దారితీసిన లోపాలు, దాడి తర్వాత మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ద్వేషపూరిత ప్రచారం గురించి కూడా ప్రశ్నలు లేవనెత్తారని ది వైర్ వార్తాసంస్థ తెలిపింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ […]
Read more

హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో 78 శాతానికిపైగా ఓట్లు పోలయ్యాయి!

హైదరాబాద్ : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 78.57 శాతం ఓట్లు పోలయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెండు పోలింగ్ కేంద్రాల్లో 112 మంది ఓటర్లలో 88 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 112 మంది ఓటర్లలో 31 మంది ఎక్స్-అఫిషియో సభ్యులు, వారిలో 22 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 81 మంది జీహెచ్ఎంసీ కార్పొరేటర్లలో 66 మంది ఓటు […]
Read more

పహల్గామ్ దాడి తర్వాత ముస్లిం వ్యతిరేక కథనాలను ప్రచారం చేసిన గోడీ మీడియా!

న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఘోరమైన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డ వ. ఈ దాడి తరువాత, మితవాద మీడియాగ్రూపులు, ప్రధాన స్రవంతి మీడియా టీవీ, సోషల్ మీడియాలో ముస్లిం వ్యతిరేక కథనాలను వ్యాప్తి చేశాయి, ముస్లింలపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చాయి. ద్వేషం, తప్పుడు సమాచారం, ఉదాసీనతయావద్దేశం ఉగ్రదాడిపై సంతాపం వ్యక్తం చేస్తుండగా, హిందూత్వ గ్రూపులు సోషల్ మీడియాలో ముస్లింలపై హింసకు బహిరంగంగా పిలుపునిచ్చాయి. అనేకమంది […]
Read more

మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రజ్ఞా ఠాకూర్‌కు మరణశిక్ష విధించాలని కోరిన ఎన్‌ఐఏ!

న్యూఢిల్లీ : మహారాష్ట్రలోని మాలేగావ్‌లో 2008లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో బిజెపి మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ సహా ఏడుగురు నిందితులకు మరణశిక్ష విధించాలని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రత్యేక కోర్టును కోరింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA)లోని సెక్షన్ 16ను ఉపయోగించి శనివారం 1,500 పేజీలకు పైగా తుది లిఖిత వాదనలను ఏజెన్సీ సమర్పించింది. సెప్టెంబర్ 29, 2008న మహారాష్ట్రలోని మాలేగావ్‌లో జరిగిన ఈ పేలుడులో ఆరుగురు ముస్లింలు […]
Read more

పహల్గామ్ దాడి…భారతీయ టీవీ ఛానెల్‌లు మనకు చూపించని నిజం!

న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన విధ్వంసకర ఉగ్రవాద దాడిలో 27 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఇటీవలి సంవత్సరాలలో ఈ ప్రాంతంలో జరిగిన అత్యంత హేయమైన సంఘటనలలో ఒకటి. 2019లో పుల్వామా దాడి తర్వాత కశ్మీర్‌ లోయలో జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇది. భారతీయ టెలివిజన్ ఛానెల్‌లు ఈ విషాదాన్ని విస్తృతంగా కవర్ చేసినప్పటికీ, వారి నివేదికలు ఎక్కువగా విభజన కథనాలపై దృష్టి సారించాయి, దాడిని హిందూ-ముస్లిం […]
Read more

ఇంటర్మీడియట్ పరీక్షల్లో 26 రాష్ట్ర ర్యాంకులు సాధించిన సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు!

హైదరాబాద్ : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TGSWREIS) నుండి 13 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో 2 నుండి 7 వరకు రాష్ట్ర ర్యాంకులు సాధించారు, మార్చి 2025లో జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 13 మంది విద్యార్థులు 2 నుండి 16 వరకు రాష్ట్ర ర్యాంకులు సాధించారు. TGSWREIS తన 35 జూనియర్ కళాశాలల్లో 100% ఉత్తీర్ణత శాతాన్ని సాధించింది. ఇంటర్మీడియట్ విద్యా బోర్డు పరీక్షల్లో 26 […]
Read more

అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట హైడ్రాదే…న్యాయ పోరాటంలో గెలుపు!

హైదరాబాద్ : హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన ఆస్తుల పర్యవేక్షణ, రక్షణ సంస్థ (HYDRAA) కు అతిపెద్ద విజయం దక్కింది. అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటపై భారత రాష్ట్ర సమితి (BRS) నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి వాదనను సిటీ సివిల్ కోర్టు తోసిపుచ్చింది. బతుకమ్మ కుంట స్థలం తనదనే ఎడ్ల సుధాకర్‌రెడ్డి వాదనలో నిజం లేదని కోర్టు తేల్చింది. హైడ్రా ఈ కుంటను పునరుద్ధరణ చేస్తోంది, అయితే సుధాకర్‌రెడ్డి కోర్టును ఆశ్రయించడంతో పనులు ఆగిపోయాయి, ఇప్పుడు హైడ్రాకు అనుకూలంగా […]
Read more

దేశ రాజధానిలో జరిగిన “సేవ్ వక్ఫ్” సదస్సుకు వేలాది మంది హాజరు!

న్యూఢిల్లీ : వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రాజధానిలోని తల్కటోరా స్టేడియంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) “వక్ఫ్ బచావో సమ్మేళన్” (సేవ్ వక్ఫ్ కాన్ఫరెన్స్) పేరుతో నిన్న పెద్ద ఎత్తున నిరసనను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఢిల్లీ, పరిసర ప్రాంతాల నుండి వేలాది మంది పాల్గొన్నారు. ఈ సమావేశంలో AIMPLB మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహ్మానీ, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ముస్లిం సంస్థల ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. సిక్కు, దళిత,ఇతర మైనారిటీ […]
Read more
1 131 132 133 134 135 158

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.