Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

హైదరాబాద్‌లో ఇంటర్నెట్ అంతరాయంతో నిరసనలు!

హైదరాబాద్: తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGSPDCL) కేబుల్స్‌ను కత్తిరించిన తర్వాత, సెప్టెంబర్ నిన్న హైదరాబాద్‌లో ఇంటర్నెట్ అంతరాయం ఏర్పడింది. అకస్మాత్తుగా బ్లాక్‌అవుట్ చేయడం వల్ల వ్యాపారాలు, విద్యార్థులు, గృహాల్లో ఇంటర్నెట్‌ స్తంభించింది. దీనికి నిరసనగా, కేబుల్ ఆపరేటర్లు చంద్రాయణగుట్ట X రోడ్‌లో ధర్నా నిర్వహించారు, దీని వలన కొంతసేపు ట్రాఫిక్ కూడా అంతరాయం కలిగింది. అధికారుల బాధ్యతారహిత చర్యను కేబుల్ ఆపరేటర్లు తీవ్రంగా ఖండించారు, ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే ఆన్‌లైన్ విద్య, జర్నలిజం, […]
Read more

మీడియా స్వేచ్ఛను కార్పొరేట్ శక్తి హరిస్తోంది…ప్రముఖ పాత్రికేయులు పి.సాయినాథ్!

మీడియా స్వేచ్ఛను కార్పొరేట్ శక్తి హరిస్తోందని ప్రముఖ గ్రామీణ పాత్రికేయులు పి.సాయినాథ్ అభిప్రాయపడ్డారు. తన వాదనకు అనుకూలంగా ఆయన కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ…స్వాతంత్య్రం వచ్చిన వెంటనే, నెహ్రూ ప్రభుత్వం మీడియా సంస్థలకు సహాయం అందించే ప్రయత్నంలో… బాంబేలోని నారిమన్ పాయింట్, ఢిల్లీలోని బహదూర్ షా జాఫర్ మార్గ్ వంటి ప్రధాన ప్రదేశాలలో అగ్రశ్రేణి మీడియా సంస్థలకు భూమిని ఇచ్చినప్పుడు సంపద కేంద్రీకరణ ప్రారంభమైందని అన్నారు. దీంతో వారంతా రియల్ ఎస్టేట్ […]
Read more

“ఈ స్థలం మాది”, ఇకపై ‘పాలస్తీనా దేశం ఉండదు’…ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు!

టెల్‌అవీవ్‌: ఇక ముందు పాలస్తీనా దేశం ఉండదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో వేలాది కొత్త గృహాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు. జెరూసలేంకు తూర్పున ఉన్న ఈ ప్రాంతంలో వివాదాస్పద ‘E1’ సెటిల్‌మెంట్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై కూడా నెతన్యాహు సంతకం చేశారు. “పాలస్తీనా రాజ్యం ఉండదన్న మా వాగ్దానాన్ని మేము నెరవేర్చబోతున్నాము, ఈ స్థలం మాది” అని నెతన్యాహు జెరూసలేంకు తూర్పున ఉన్న ఇజ్రాయెల్ స్థావరం మాలే […]
Read more

మతం మారితే జైలే…రాజస్థాన్‌లో మతమార్పిడి నిరోధక బిల్లు ఆమోదం!

జైపూర్: రాజస్థాన్‌లో మతమార్పిడి నిరోధక బిల్లు అటు మైనారిటీలు, ఇటు మతాంతర జంటల్లో తుఫానును రేకెత్తిస్తోంది. ఈ మేరకు రాజస్థాన్‌లో బలవంతపు, మోసపూరిత మతమార్పిడులను అరికట్టేందుకు భజన్‌లాల్ శర్మ ప్రభుత్వం అత్యంత కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చింది. మంగళవారం రాజస్థాన్ అసెంబ్లీ… ‘రాజస్థాన్ చట్టవిరుద్ధ మత మార్పిడి నిరోధక బిల్లు-2025’ను మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఇది భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్ర రాజకీయ దృశ్యంలో అలజడిని సృష్టించింది. ప్రధాన రాజ్యాంగ హక్కులను ప్రభావితం చేసే ఈ బిల్లును […]
Read more

బందీలను ‘పట్టించుకోని’ ఇజ్రాయెల్…దోహా దాడుల తర్వాత ఖతార్!

ఐక్యరాజ్యసమితి: దోహాలో హమాస్ నేతలపై దాడి చేసాక గాజా బందీల గురించి ఇజ్రాయెల్ “పట్టించుకోవడం లేదని” ఖతార్ ప్రధాన మంత్రి ఐక్యరాజ్యసమితికి తెలిపారు. అయితే ఈ దాడిని ఖండించే విషయంలో ప్రపంచ శక్తులు ఐక్యంగా ఉండటంతో శాంతి కోసం ఒత్తిడి చేస్తూనే ఉంటామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. అమెరికా మిత్రదేశం ఖతార్‌పై మంగళవారం జరిగిన ఘోరమైన దాడితో, ఇజ్రాయెల్ ” అన్ని పరిమితులను దాటి వెళ్ళింది” అని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో షేక్ మొహమ్మద్ […]
Read more

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ‘ఓట్లు కొనడానికి’ బీజేపీ ఒక్కో ఎంపీకీ 15-20 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించిన అభిషేక్ బెనర్జీ!

కోల్‌కతా: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించాక…తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ బిజెపిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ… కాషాయ శిబిరం “ఓట్లు కొనడానికి” ప్రతి ఎంపీకి రూ.15-20 కోట్లు ఖర్చు చేసిందని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు డబ్బు శక్తిని ఉపయోగించిందని ఆరోపించారు. లోక్‌సభలో టిఎంసి పార్లమెంటరీ పార్టీకి నాయకత్వం వహిస్తున్న బెనర్జీ, మంగళవారం జరిగిన ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేయడానికి బిజెపి నాయకులు “డబ్బు బస్తాలతో వచ్చారని” అన్నారు. మహారాష్ట్ర […]
Read more

ఉమర్ ఖలీద్ కేసులో బెయిల్‌ నిరాకరించడం న్యాయాన్ని అపహాస్యం చేయడమే!

న్యూఢిల్లీ: సెప్టెంబర్ 2020 ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన ” కుట్ర” కేసులో ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ సహా మరో ఏడుగురు నిందితుల బెయిల్ పిటిషన్లను ఇటీవల ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. జస్టిస్ నవీన్ చావ్లా, శైలీందర్ కౌర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ తన తీర్పులో… శాంతియుత నిరసన హక్కును కాపాడుతుందని, కానీ నిరసన ముసుగులో కుట్రపూరిత హింసను… అనుమతించలేమని పేర్కొంది. ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ పాత్రను “ప్రాథమికంగా తీవ్రమైనది” అని కోర్టు గుర్తించింది. ఈ […]
Read more

నేపాల్‌ మాజీ చీఫ్ జస్టిస్‌ను తాత్కాలిక ప్రధానిగా ప్రతిపాదించిన జన్‌జడ్‌ నేతలు!

న్యూఢిల్లీ: రాజకీయ తిరుగుబాటుగా మారిన నేపాల్ ‘జన్‌ జెడ్’నేతృత్వంలోని ప్రతినిధులు ఆ దేశ ఆర్మీ చీఫ్‌ను కలిసి, మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి పేరును తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రతిపాదించారని మీడియా నివేదికలు తెలిపాయి. నేపాల్‌లో సోమవారం ప్రారంభమై మంగళవారం తీవ్రరూపం దాల్చిన విద్యార్థుల నిరసనకు దెబ్బకు ప్రధానమంత్రి కె.పి. శర్మ ఓలి రాజీనామాకు దారితీసింది. శాంతిభద్రతలను కాపాడటానికి సైన్యం వీధుల్లో కవాతు నిర్వహించాల్సి వచ్చింది. అల్లర్ల కారణంగా 30 మంది మరణించారు. మొత్తం 1,033 మంది […]
Read more

హైదరాబాద్‌లో క్యాంటీన్లు…డ్వాక్రా గ్రూపులకు సాయం చేయనున్న జీహెచ్‌ఎంసీ!

హైదరాబాద్: నగరంలో మహిళల ఆర్థిక సాధికారతను ప్రోత్సహించడానికి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) స్వయం సహాయక బృందాలకు (SHGS) సహాయం చేస్తోంది. ఈ గ్రూపులు 33 ‘ఇందిరా మహిళా శక్తి’ క్యాంటీన్లను నిర్వహిస్తాయి. మహిళలకు ఆర్థిక భద్రతను పెంపొందించడానికి ఈ పథకాన్ని గత సంవత్సరం ప్రారంభించారు. ఈ క్యాంటీన్లు మహిళలకు ఉపాధిని కల్పించడమే కాకుండా, వారు ఆత్మవిశ్వాసం, స్వావలంబన పొందడంలో సహాయపడటంతో పాటు నామమాత్రపు ధరకు ప్రజలకు పోషకమైన భోజనాన్ని కూడా అందిస్తున్నాయి. ఈమేరకు NBT […]
Read more

హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్లపై ఆహార భద్రతా బృందం దాడులు!

హైదరాబాద్: రాష్ట్ర ఆహార భద్రతా విభాగానికి చెందిన టాస్క్‌ఫోర్స్ హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్లపై నిన్న దాడులు నిర్వహించింది. ఆహార భద్రత కమిషనర్‌కు అందిన ఫిర్యాదుల ఆధారంగా 10 అబ్సొల్యూట్ బార్బెక్యూ అవుట్‌లెట్‌లపై దాడులు జరిగాయి. బంజారా హిల్స్, ఇతర ప్రదేశాలలో తనిఖీలుఆహార భద్రత కమిషనర్ తన X హ్యాండిల్‌లో పంచుకున్న వివరాల ప్రకారం… హైదరాబాద్‌లోని AS రావు నగర్, కొంపల్లి, మేడిపల్లి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, ఇనార్బిట్, మియాపూర్, వనస్థలిపురం, సికింద్రాబాద్‌లలో ఉన్న ప్రముఖ […]
Read more
1 59 60 61 62 63 143

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.