Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూత!

న్యూఢిల్లీ: జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు శిబు సోరెన్ మరణించారని ఆయన కుమారుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తెలిపారు.   ఈ మేరకు Xలో పోస్ట్ చేసారు. “గౌరవనీయులైన గురూజీ మనందరినీ విడిచిపెట్టి వెళ్లిపోయారు… నేను ఈరోజు జీరోగా మిగిలాను అంటూ హేమంత్ సోరెన్ Xలో పోస్ట్ చేశారు. కాగా, శిబు సోరెన్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. గత నెల 24న గంగారం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. చికిత్స పొందుతూ […]
Read more

‘బెంగాలీలను బయటి వ్యక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం’…ఢిల్లీ పోలీసులపై టీఎంసీ విమర్శలు!

న్యూఢిల్లీ: ఇటీవల ఢిల్లీ పోలీసులు… బెంగాలీని “బంగ్లాదేశ్ భాష”గా పేర్కొనడాన్ని తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. రాజ్యాంగబద్ధంగా గుర్తింపు పొందిన భారతీయ భాషను చట్టవిరుద్ధమని, లక్షలాది మంది బెంగాలీ మాట్లాడే పౌరులను బయటి వ్యక్తులుగా చిత్రీకరించడానికి పోలీసులు ఉద్దేశపూర్వక ప్రయత్నం చేస్తున్నారని టీఎంసీపార్టీ ఆరోపించింది. ఈమేరకు Xలో… న్యూఢిల్లీలోని లోధి కాలనీ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక ఇన్‌స్పెక్టర్ రాసిన లేఖ కాపీని షేర్‌ చేసింది. చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న ఎనిమిది […]
Read more

ముస్లిం హెచ్‌ఎం బదిలీ కోసం స్కూల్‌ వాటర్‌ ట్యాంకులో విషం కలిపిన శ్రీ రామ సేన నాయకుడి అరెస్టు!

బెంగళూరు: బెళగావి జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ముస్లిం అయిన ప్రిన్సిపాల్‌ను బదిలీ చేయడానికి శ్రీ రామ సేన సభ్యుడు అక్కడి వాటర్‌ ట్యాంకులోని నీటిని విషపూరితం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వివరాల్లోకి వెళితే…జూలై 14న హూలికట్టే గ్రామం, జనతా కాలనీలోని ప్రభుత్వ లోయర్ ప్రైమరీ స్కూల్‌లో ఏడు నుండి 10 సంవత్సరాల మధ్య వయస్సు గల అనేక మంది పిల్లలు నీరు తాగి అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సులేమాన్ గోరినాయక్ సౌందట్టి […]
Read more

‘సేవ్ గాజా’ పేరిట సిడ్నీ హార్బర్ వంతెనపై వేలాదిమంది నిరసన!

సిడ్నీ: గాజా ప్రజలకు సంఘీభావ ప్రదర్శనగా, ఆదివారం ఉదయం సిడ్నీలోని ఐకానిక్ హార్బర్ వంతెనపై లక్ష మంది మార్చ్ ఫర్ హ్యుమానిటీలో పాల్గొన్నారు. సేవ్ గాజా’ అనే నినాదంతో వేలాది మంది ప్రజలు ‘సిడ్నీ హార్బర్ వంతెన’పై నిరసన తెలిపారు, గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ, మానవతా సహాయాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ వారు కవాతు నిర్వహించారు. ఈ నిరసనతో వంతెన దాదాపు ఐదు గంటల పాటు మూసివేసారు. పాలస్తీనా యాక్షన్ గ్రూప్ నిర్వహించిన ఈ నిరసన, […]
Read more

విదేశాల్లో రాజ్య హోదాకు మద్దతు లభిస్తోంది, కానీ పాలస్తీనియన్లకు ఇది సుదూర కలగానే మిగిలిపోయింది!

జెరూసలేం: ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించాలని ప్రకటించిన ప్రణాళికలు ఇప్పట్లో నెరవేరవు, అయినప్పటికీ అవి ఇజ్రాయెల్‌ను మరింతగా ఒంటరిని చేసి, పాలస్తీనియన్ల చర్చల స్థానాన్ని దీర్ఘకాలికంగా బలోపేతం చేస్తాయి. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు పాలస్తీనా రాజ్య హోదాను తిరస్కరించారు. 1967 యుద్ధంలో పాలస్తీనియన్లు తమ దేశం కోసం కోరుకుంటున్న భూభాగాలను ఆక్రమించిన తూర్పు జెరూసలేం, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్, యుద్ధంలో దెబ్బతిన్న గాజా స్ట్రిప్‌పై బహిరంగ నియంత్రణను కొనసాగించాలని ప్రతిజ్ఞ […]
Read more

గాజా దిగ్బంధనాన్ని కొద్దిగా సడలించిన ఇజ్రాయెల్…అయినా అన్నార్తులకు అందని సాయం!

జెరూసలేం: గాజాలో అన్నార్తుల ఆకలికేకలపై అంతర్జాతీయ నిరసనలు మిన్నంటడంతో… ఇజ్రాయెల్ గాజాలోని కొన్ని ప్రాంతాలలో పోరాటాన్ని నిలిపివేసి, ఆకాశమార్గం ద్వారా ఆహారాన్ని జారవిడిచింది. అయితే కరవుతో అల్లాడుతున్న పాలస్తీనియన్లకు ఈ సాయం సరిపోదని అంటున్నారు. ఇజ్రాయెల్‌ తీసుకున్న ఈ చర్యలు గాజాలోకి ప్రవేశించే సహాయ ట్రక్కుల సంఖ్యలో పెరుగుదలకు దారితీశాయి. కానీ వాటిలో ఏవీ పంపిణీ కోసం ఉద్దేశించిన UN గిడ్డంగులకు చేరుకోలేదు. బదులుగా, కొన్ని ముఠాలు వాటిని దోచుకుంటున్నాయి. సహాయాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తూ చాలా మంది […]
Read more

రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్‌ నిలిపివేసిందంటూ వార్తలు… మంచి పరిణామమన్న ట్రంప్‌!

వాషింగ్టన్‌: రష్యా నుంచి భారత్‌ ఇంధనాన్ని కొనుగోలు చేయ‌డం లేద‌ంటూ వస్తున్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేయ‌డం లేద‌ని తెలిసింద‌ని, ఇది మంచి ముందడుగని అన్నారు. అయితే విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) వర్గాలు దిగుమతులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పడం గమనార్హం. వాషింగ్టన్ DCలో ట్రంప్‌ విలేకరులతో మాట్లాడుతూ…”భారతదేశం ఇకపై రష్యా నుండి చమురు కొనుగోలు చేయబోదని నేను అర్థం చేసుకున్నాను. అదే నేను […]
Read more

మాలేగావ్ తీర్పు…ముంబై పేలుళ్ల కేసులాగా మహారాష్ట్ర సుప్రీంకోర్టుకు వెళుతుందా!

ముంబయి: ముంబై పేలుళ్ల కేసులో నిందితులందరినీ కోర్టు నిర్దోషులుగా విడుదల చేసిందని, బాంబు పేలుడు ఎవరు చేశారనే ప్రశ్నకు సమాధానం లేదని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కల్ అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వ వైఖరి ఉండాలి, 2006 ముంబై రైలు పేలుళ్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి సిద్ధంగా ఉంటే, మాలేగావ్ పేలుడు కేసు విషయంలో కూడా అదే చేయాలని సప్కల్ అన్నారు. “కాంగ్రెస్ ఎల్లప్పుడూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢంగా నిలబడింది. మహాత్మా గాంధీ, […]
Read more

రెండో రోజు ఆటలో భారత జట్టును ఆధిక్యంలో నిలిపిన సిరాజ్, జైస్వాల్!

లండన్‌: ఓవల్‌లో జరుగుతున్న ఐదవది… చివరి టెస్ట్‌లో రెండవ రోజు భారత్ తిరిగి పోటీలోకి వచ్చింది, సిరీస్‌ను సమం చేయడానికి గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో మన జట్టు గొప్పగా పోరాడింది. మన సీమర్లు ఇంగ్లాండ్‌ను 23 పరుగుల ఆధిక్యానికి పరిమితం చేశారు. నిన్న ఉదయం ఆట ప్రారంభమైన 30 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే భారత జట్టు టెయిలెండర్ల తోకను కట్‌ చేసిన ఇంగ్లండ్‌ ఆ తర్వాత, బాజ్‌బాల్ ఆటతో మన బౌలర్‌లపై మెరుపుదాడికి దిగారు. ఓపెనర్లు […]
Read more

మెహదీపట్నంలో పాలస్తీనా అనుకూల నిరసన చేపట్టిన విద్యార్థులు!

హైదరాబాద్: హైదరాబాద్ మెహదీపట్నం ప్రాంతంలోని మజీద్‌-ఎ-అజీజియాలో నిన్న స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (SIO) పాలస్తీనా అనుకూల నిరసనను నిర్వహించింది. పాలస్తీనా పౌరులను, ప్రధానంగా పిల్లలు, శిశువులను ఉద్దేశపూర్వకంగా ఆకలితో అలమటించేలా చేస్తున్న ఇజ్రాయెల్‌ వైఖరిని ఖండిస్తూ విద్యార్థలు నినాదాలు చేశారు. దీనిని తీవ్రమైన మానవతా అన్యాయంగా అభివర్ణించారు. తక్షణ అంతర్జాతీయ జోక్యాన్ని కోరారు. హైదరాబాద్ అంతటా నిరసనలుఇజ్రాయెల్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై వివిధ వాణిజ్య దుకాణాలలో జరిగిన అనేక పాలస్తీనా అనుకూల నిరసనలకు హైదరాబాద్ ఇటీవల […]
Read more
1 91 92 93 94 95 159

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.