Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

షిరిబిబాస్‌కు సంతాపం తెలుపుతున్న ప్రపంచం…అదే సమయంలో ఇజ్రాయెల్ చంపిన 17,880 పిల్లలను మరిచింది!

గాజా: ఇజ్రాయెల్‌ బాంబుల ధాటికి మరణించిన బందీలు షిరి బిబాస్, ఆమె పిల్లల అవశేషాలను హమాస్ తిరిగి ఆ దేశానికి అప్పగించింది. కానీ ఇజ్రాయెల్ చంపేసిన పాలస్తీనా పిల్లల ఆక్రందనలు, దుఃఖిస్తున్న తల్లుల రోదనలు ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి, అయినా ఇజ్రాయెల్ మిత్రదేశాలు, వారిని సమర్థించే మీడియాకు మాత్రం ఇవి వినబడటం లేదు. గాజాలో బందీగా ఉన్న ఒక మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు సహా నలుగురు ఇజ్రాయెలీయుల మృతదేహాలను తిరిగి ఇచ్చే వేడుకలకు ప్రపంచం స్పందించినప్పటికీ, […]
Read more

జీఓ 99 కు వ్యతిరేకంగా వ్యవహరిస్తే హైడ్రాను మూసివేస్తాం…తెలంగాణ హైకోర్టు వార్నింగ్!

హైదరాబాద్: హైదరాబాద్‌లో చెరువులు, కుంటలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రా  కూల్చివేత చర్యలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉత్తర్వు 99 కు వ్యతిరేకంగా HYDRAA చర్యలు కొనసాగిస్తే, , HYDRAAను పూర్తిగా మూసివేయాల్సి రావచ్చని కోర్టు హెచ్చరించింది. హైడ్రా ఏర్పాటు జీవో 99ను చదివారా? ఆ జీవోలోని నిబంధనల ప్రకారమే విధులు నిర్వహించాలని తెలియదా అని వ్యాఖ్యానించింది. నిబంధనల పరిధి దాటి వ్యవహరిస్తే హైడ్రాను మూసివేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. […]
Read more

భారత్‌లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు అమెరికా సాయం…కాంగ్రెస్, బీజేపీ ప్రత్యాపరోణలు!

న్యూఢిల్లీ: భారత్‌లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు గత బైడెన్‌ ప్రభుత్వం రూ.181 కోట్ల నిధులు కేటాయించిందని ఇటీవల ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియెన్సీ(డోజ్‌) వెల్లడించింది. దీనిపై మియామిలో జరిగిన ఎఫ్‌ఐఐ సదస్సులో ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం పెంచేందుకు అమెరికా ఎందుకు 21 మిలియన్‌ డాలర్ల సాయం చేయాలంటూ అగ్రరాజ్యాధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శలు చేశారు. ఈ మేరకు భారత్‌లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను […]
Read more

నేపాల్ విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పిన కిట్ వ్యవస్థాపకుడు అచ్యుత సామంత!

భువనేశ్వర్: నగరంలోని కిట్ డీమ్డ్ యూనివర్సిటీలో నేపాల్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి, ఆత్మహత్య, తదనంతరం పొరుగు దేశ విద్యార్థులపై దాడులు జరిగిన కొన్ని రోజుల తర్వాత, కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (KIIT) వ్యవస్థాపకుడు అచ్యుత సామంత గ నేపాల్ విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాడు. క్యాంపస్‌ను ఖాళీ చేసిన వారందరూ తిరిగి రావాలని కోరాడు. ఈ సంఘటనపై సామంత చేసిన మొదటి బహిరంగ ప్రకటన వీడియోను KIIT X ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు, ఈ […]
Read more

మోడీ ప్రభుత్వం జాతీయ భద్రతను ప్రమాదంలో పడేస్తోంది…ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే!

న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో చైనా 90 కొత్త గ్రామాలను నిర్మిస్తోందని వచ్చిన నివేదికలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ పరిణామం భారతదేశ జాతీయ భద్రత, ప్రాదేశిక సమగ్రతను… సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘ఎన్డీఏ ప్రభుత్వం పీఆర్ స్టంట్స్, తప్పడు ప్రకటనలకే ప్రాధాన్యతనిస్తోంది. నేషనల్ సెక్యురిటీని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు అని తెలిపారు. చైనాకు రెడ్ […]
Read more

సైబర్ బాధితులకు ఊరట…!

హైదరాబాద్: సైబర్ నేరాల్లో డబ్బు పోగొట్టుకున్న పలువురు బాధితులకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఊరట కల్పించారు. సైబర్ మోసాల కారణంగా కోల్పోయిన రూ.62,46,900 లక్షల విలువైన డబ్బును తిరిగి చెల్లించే వీలు కల్పించారు. మొత్తం 16 కేసులకు గాను ఎనిమిది స్టాక్ ట్రేడింగ్, పెట్టుబడి మోసాలు, ఆరు ఫెడెక్స్, మనీలాండరింగ్ కేసులు ఉన్నాయి. అలాగే ఒక రుణ మోసం కేసు, మరొకటి ఇంప్రెశన్ ప్రాడ్ కేసు ఉన్నాయి. ఈ మేరకు బాధితులుందరికీ మోసపోయిన మొత్తాన్ని తిరిగి […]
Read more

స్థానిక ఎన్నికల దృష్ట్యా మహారాష్ట్రలో లవ్‌ జిహాద్‌ నియంత్రణకు చట్టం!

ముంబయి: హిందుత్వ భావజాలానికి అనుగుణంగా, మహారాష్ట్రలోని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి-ఎన్డిఎ ప్రభుత్వం లవ్ జిహాద్‌పై చట్టాన్ని అమలు చేయడానికి కసరత్తును ప్రారంభించింది. బిజెపి-శివసేన-ఎన్‌సిపి కూటమికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు, 288 మంది సభ్యుల మహారాష్ట్ర శాసనసభలో తన ప్రభుత్వానికి ఉన్న సంపూర్ణ మెజారిటీ కారణంగా, అటువంటి చట్టాన్ని ఆమోదించడం ఒక సవాలుగా ఉండకపోవచ్చు. గత వారం, రాష్ట్ర ప్రభుత్వం లవ్ జిహాద్ పై చట్టాన్ని రూపొందించడంలో చట్టపరమైన, సాంకేతిక అంశాలను పరిశీలించడానికి […]
Read more

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీ నియంత…డోనాల్డ్ ట్రంప్!

వాషింగ్టన్/కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ నియంత అని, అందుకే ఆ దేశంలో ఎన్నికలు జరపకుండా అధ్యక్ష పదవిలో ‌కొనసాగుతున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే ఉక్రెయిన్ వాదనను ట్రంప్ తప్పు బట్టారు. కాస్త భూమితో పోయేదానిని యుద్ధం వరకు తెచ్చారని ఉక్రెయిన్‌పై మండిపడ్డారు. ఇప్పుడు ఉక్రెయిన్ ఎక్కువ భూమి సహా పెద్దసంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చిందని మంగళవారం ఫ్లోరిడాలో విలేకరుల సమావేశంలో ట్రంప్ విమర్శించారు. యుద్ధానికి ఉక్రెయినే […]
Read more

షామీర్‌పేటలో దళితుల కాలనీలో ప్రవేశానికి అడ్డుగా ఉన్న గోడను కూల్చేసిన హైడ్రా!

హైదరాబాద్: దేవరాయంజల్‌లోని దళితులు తమ ఇళ్లకు చేరుకోవడానికి వీలుగా రోడ్డు కోసం నాలుగు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటానికి హైడ్రా ముగింపు పలికింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ బృందం 1985లో ఒక రియల్టర్ నిర్మించిన సరిహద్దును కూల్చివేసింది, ఆ సరిహద్దు వారి కాలనీకి చేరుకోవడానికి ఉన్న అన్ని ఎగ్జిట్ పాయింట్లను మూసివేసింది. ఫిబ్రవరి 19 బుధవారం మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా షామీర్‌పేట మండలంలోని తుంకుంట మునిసిపాలిటీలోని దేవరాయంజల్ గ్రామంలో ఈ ఆపరేషన్ జరిగింది, […]
Read more

ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా… సీఎం పదవిని చేపట్టిన 4వ మహిళ!

న్యూఢిల్లీ: ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తా ఎన్నికయ్యారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత ఈ ప్రకటన వెలువడింది, ఎంపిక ప్రక్రియకు రవిశంకర్ ప్రసాద్, ఓం ప్రకాష్ ధంకర్‌లను పరిశీలకులుగా నియమించారు. కొత్తగా ఎన్నికైన 48 మంది బీజేపీ శాసనసభ్యులు తమ నాయకుడిని ఎన్నుకోవడానికి సమావేశమయ్యారు, ఆమె ఢిల్లీ సీఎంగా ఈ రోజు బాధ్యతలు స్వీకరిస్తారు. కొత్త బీజేపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవం నేడు రాంలీలా మైదానంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి […]
Read more
1 91 92 93 94 95

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.