Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

గాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని194 సార్లు ఉల్లంఘించిన ఇజ్రాయెల్‌!

జెరూసలేం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్యవర్తిత్వంలో హమాస్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌ పదేపదే ఉల్లంఘిస్తోంది. గత నెల అక్టోబర్ 10 నుండి అమల్లోకి వచ్చిన ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికి 194 సార్లు ఉల్లంఘించిందని ప్రభుత్వ మీడియా కార్యాలయం తెలిపింది. ఈమేరకు ఆఫీస్ డైరెక్టర్ ఇస్మాయిల్ అల్-తవాబ్తే వార్తాసంస్థతో మాట్లాడుతూ… “ఎల్లోలైన్‌”ను పలుమార్లు దాటుతోంది. ఆ గీత వెలుపల ఇజ్రాయెల్ చొరబాట్లు, వైద్య సామాగ్రి, మందులు, గుడారాలు, మొబైల్ గృహాలను నిరోధించడం, […]
Read more

ఖైదీల వీడియో లీక్…ఇజ్రాయెల్ ప్రాసిక్యూటర్‌ రాజీనామా!

జెరూసలేం: గాజా యుద్ధంలో అరెస్టయిన పాలస్తీనా ఖైదీపై క్రిమినల్ విచారణ సందర్భంగా ఇజ్రాయెల్‌ సైనికులు దుర్భాషలాడిన వీడియో లీక్ కావడంపై పై ఇజ్రాయెల్ మిలిటరీ చీఫ్ లీగల్ ఆఫీసర్ రాజీనామా చేశారు. కాగా, ఆగస్టు 2024లో ఈ వీడియో లీక్‌ను ఆమోదించినందుకుగాను తాను రాజీనామా చేస్తున్నట్లు అడ్వకేట్ జనరల్ మేజర్-జనరల్ యిఫత్ టోమర్-యెరుషల్మి తెలిపారు. దుర్వినియోగంపై దర్యాప్తు తర్వాత ఐదుగురు సైనికులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇది ఒక కలకలం రేపింది. ఈ దర్యాప్తును మితవాద […]
Read more

‘ఇమ్మిగ్రెంట్స్‌’ వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ పునరుద్ధరణను రద్దు చేసిన అమెరికా!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండో సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత వలసదారులపై కఠిన చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అగ్ర రాజ్యాధిపతి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వలస కార్మికుల వర్క్‌పర్మిట్ల (EAD) ఆటోమేటిక్ పొడిగింపును నిలిపివేయాలని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం నిర్ణయం తీసుకుంది. దీంతో వేలాది మంది విదేశీ ఉద్యోగులు ప్రభావితం అయ్యేఅవకాశం ఉంది, వీరిలో ఎక్కువ మంది భారతీయులే కావడం గమనార్హం. ఈ ఏడాది అక్టోబర్ 30 (నేటినుంచి) […]
Read more

గాజాపై ఇజ్రాయెల్‌ మారణకాండ…104మంది మృతి!

పాలస్తీనా: గాజాలో ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా మిగిల్చిన చేదు జ్ఞాపకాలు మరిచిపోక ముందే…కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ ఇజ్రాయెల్‌ యుద్ధకాంక్ష తీరలేదు. రోజుకో సాకు చూపి పాలస్తీనియన్లను చంపుతూనే ఉంది. మొన్న అర్థరాత్రి చేసిన ఇజ్రాయెల్‌ మెరుపు దాడులతో గాజా మరోసారి వణికిపోయింది. డ్రోన్లు, యుద్ధ, నిఘా విమానాలతో ఐడీఎఫ్‌ సైన్యం విరుచుకుపడింది. మొన్న అర్థరాత్రి నుంచి బుధవారం రాత్రి వరకూ జరిగిన దాడుల్లో 100 మందికిపైగా మరణించారు. అనేక మంది గాయపడ్డారు. వీరిలో చిన్నారులు, […]
Read more

శాంతి ఒప్పందానికి తూట్లు…గాజాలో శక్తివంతమైన దాడులకు నెతన్యాహు ఆదేశం!

టెల్‌అవీవ్‌: హమాస్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని ఆరోపించాక ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గాజాలో దాడులు చేయాలని తమ సైన్యాన్ని ఆదేశించారు. వెంటనే రాత్రికల్లా దాడులు ప్రారంభమయ్యాయి. పలుచోట్ల బాంబుల శబ్దాలు వినిపించాయి. దక్షిణ గాజాలో తమ బలగాలపై హమాస్ కాల్పులు జరిపిందని, అందుకే ఈ ఆదేశాలిచ్చామని నెతన్యాహు వెల్లడించారు. మరోవైపు ఇజ్రాయెల్ తీరును హమాస్ నిరసించింది. మృతదేహాల అప్పగింతను ఆలస్యం చేస్తామని హెచ్చరించింది. నెతన్యాహు దాడులకు ఆదేశించిన నిమిషాల వ్యవధిలో, మంగళవారం సాయంత్రం జరగాల్సిన మరో బందీ […]
Read more

ఇజ్రాయెల్‌లో రాయబార కార్యాలయం కోసం భూమిని కొనుగోలు చేసిన యూఏఈ!

అబూదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తన మొదటి శాశ్వత రాయబార కార్యాలయాన్ని నిర్మించడానికి ఇజ్రాయెల్‌లో భూమి కొనుగోలు చేసింది. ఈ పరిణామం రెండు దేశాల మధ్య లోతైన దౌత్య సంబంధాలలో కీలకమైన ముందడుగు. అక్టోబర్ 20, 2025న ఇజ్రాయెల్ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం… ఈ కొనుగోలు, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం అభ్యర్థన మేరకు,హెర్జ్లియా మునిసిపాలిటీతో కారంతో నాలుగు సంవత్సరాల అన్వేషణ ఫలితంగా జరిగింది. అనేక విదేశీ దౌత్య కార్యకలాపాలకు ఆతిథ్యం ఇచ్చే ప్రతిష్టాత్మక […]
Read more

తాజాగా 54 మంది భారతీయులను బహిష్కరించిన అమెరికా!

న్యూఢిల్లీ: అక్రమ వలసలపై అమెరికా కొరడా ఝళిపిస్తూనే ఉంది. తాజాగా 54 మంది హర్యానా వాసులను అగ్రరాజ్యం బహిష్కరించింది. వీరంతా అమెరికా అక్రమ మార్గం అయిన డంకీ రూట్ ద్వారా ప్రవేశించారనే ఆరోపణలతో వారిని వెనక్కి పంపింది. వారు OAE-4767 విమానంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, టెర్మినల్-3కి చేరుకున్నారని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం… ఈ యువకులలో 16 మంది కర్నాల్ నుండి, 15 మంది కైతాల్ నుండి, 5 మంది […]
Read more

గాజా నుండి వైద్య తరలింపుకు అనుమతించండి…ఇజ్రాయెల్‌ను కోరిన ఐక్యరాజ్యసమితి!

జెరూసలేం: గాజా కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ, రఫా సరిహద్దు క్రాసింగ్ మూసివేసారు. దీంతో 15వేల మంది పాలస్తీనియన్లు వైద్య చికిత్స కోసం ఎదురు చూస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కాగా, హింస, ఉరిశిక్షకు గురైనట్లు తేలిన సంకేతాలతో ఇజ్రాయెల్ గాజాకు తిరిగి ఇచ్చిన 54 మంది గుర్తుతెలియని పాలస్తీనియన్ల మృతదేహాలను సెంట్రల్ డీర్ ఎల్-బాలాలోని ఒక సామూహిక సమాధి స్థలంలో ఖననం చేశారు. యుద్ధంలో దెబ్బతిన్న గాజాలోకి ప్రాథమిక అవసరాలను అనుమతించే బాధ్యత […]
Read more

రష్యాతో సైనిక బంధం…మూడు భారతీయ సంస్థలపై ఈయూ ఆంక్షలు!

న్యూఢిల్లీ: రష్యన్ సైన్యంతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ గురువారం యూరోపియన్ యూనియన్ 45 సంస్థలపై ఆంక్షలు విధించింది. వీటిలో భారతదేశానికి చెందిన మూడు కంపెనీలు ఉన్నాయి. ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు రష్యాపై ఆర్థిక ఒత్తిడిని పెంచే ప్రయత్నాలలో భాగమైన EU తన 19వ ఆంక్షల ప్యాకేజీలో భాగంగా ఈ సంస్థలపై శిక్షాత్మక చర్యలను విధించింది. కాగా, EU చర్యకు భారత అధికారుల నుండి తక్షణ ప్రతిస్పందన రాలేదు. ఈమేరకు ఆయా సంస్థల ఆస్తులను స్తంభింపజేయడం, ఆర్థిక, షిప్పింగ్ సేవలపై […]
Read more

కఫాలా వ్యవస్థను రద్దు చేసిన సౌదీ అరేబియా!

రియాద్‌: లక్షలాది వలస కార్మికుల జీవితాలను దశాబ్దాలుగా నరకప్రాయం చేసిన వివాదాస్పద కఫాలా (Kafala) వ్యవస్థను సౌదీ అరేబియా అధికారికంగా రద్దు చేసింది. ఈ ఏడాది జూన్‌లో దీనిపై ప్రకటన వెలువడినప్పటికీ, తాజాగా ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. వలసదారుల హక్కులు, సంక్షేమంలో ఇది ఒక చారిత్రక ముందడుగు అని నిపుణులు భావిస్తున్నారు. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ‘విజన్ 2030’ సంస్కరణలలో భాగంగా ఈ వ్యవస్థను రద్దు చేయాలని ప్రణాళికలు ప్రకటించింది […]
Read more
1 9 10 11 12 13 36

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.