Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

‘తక్షణం ఉద్రిక్తతలను తగ్గించండి’…భారత్‌, పాక్‌లకు అమెరికా పిలుపు!

న్యూఢిల్లీ : భారతదేశం-పాకిస్తాన్ వరుసగా రెండవ రోజు డ్రోన్, క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. దీంతో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈమరకు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌, పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి మహమ్మద్‌ షెహబాజ్‌ షరీఫ్‌తో విడివిడిగా ఫోన్‌లో మాట్లాడారు. “తక్షణ ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని” ఇరువర్గాలను కోరారు. అంతేకాదు రెండు […]
Read more

మేము చాలా మంది పిల్లలను చంపాము-దీనిపై చర్చించలేం…టెల్ అవీవ్‌లో నిరసనకారుల మౌన ప్రదర్శన!

టెల్ అవీవ్ : డౌన్‌టౌన్‌లో గత వారం ఏప్రిల్ 26న, వందలాది మంది ప్రదర్శనకారులు మార్చి 18న ఇజ్రాయెల్ కాల్పుల విరమణను ఉల్లంఘించినప్పటి నుండి చంపేసిన గాజా పిల్లల చిత్రాలను పట్టుకుని మౌనంగా నిరసన తెలిపారు. ఈ నిరసన ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలతో సమానంగా జరిగింది. వేలాది మంది హోస్టేజెస్ స్క్వేర్, బిగిన్ బ్రిడ్జి వద్ద ఇజ్రాయెల్‌ ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలకు వెళుతుండగా, వారందికి మౌన ప్రదర్శన కనిపించింది. కొంతమంది ఆగి దగ్గరగా వచ్చారు – అప్పుడే […]
Read more

‘భారత్-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తత త్వరగా ముగుస్తుందని ఆశిస్తున్నా’…అగ్రరాజ్యాధినేత ట్రంప్!

వాషింగ్టన్ : పాకిస్తాన్‌పై భారత దాడులు ఊహించినవేనని, అది చాలా త్వరగా ముగుస్తుందని తాను ఆశిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ మేరకు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జాతీయ భద్రతా సలహాదారుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోకు ఈ దాడుల గురించి వివరించారని వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం కూడా ఒక ప్రకటనలో తెలిపింది. “ఇది సిగ్గుచేటు” అని అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్‌లో […]
Read more

ఆపరేషన్‌ సింధూర్‌…పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా పాక్‌పై భారత్‌ మెరుపుదాడి!

న్యూఢిల్లీ : పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్‌ మెరుపుదాడులు చేసింది. భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం చారిత్రాత్మక త్రివిధ దళాలు ఆపరేషన్‌ చేపట్టాయి. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై నిన్న రాత్రి 1:44 గంటలకు ఖచ్చితమైన దాడులు నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిరంతరం పర్యవేక్షిస్తున్నారని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. పహల్గామ్ దాడిలో భర్తలను కోల్పోయిన మహిళలకు గుర్తుగా ‘ఆపరేషన్ సిందూర్’ అనే కోడ్‌నేమ్‌తో […]
Read more

పహల్గామ్ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు…యుద్ధ సన్నద్ధతకు బదులు దౌత్యం నేటి అవసరం!

న్యూఢిల్లీ : పహల్గామ్‌లో జరిగిన విషాదకరమైన ఉగ్ర దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు, ఇది భారతదేశాన్ని, ప్రజలను కలిచివేసింది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను మళ్ళీ రాజేసింది. పాకిస్తాన్‌లోని శక్తుల మద్దతుతో సరిహద్దు ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉందని ప్రాథమిక దర్యాప్తులు సూచించాయి. ఊహించినట్లుగానే, రెండు వైపులా రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగాయి. భారత రాజకీయ రంగం, మీడియా… పాకిస్తాన్‌పై బలమైన ప్రతీకార చర్యను, సైనిక దాడులను కూడా డిమాండ్ చేస్తున్నాయి. అయితే, మాటల తీవ్రత […]
Read more

ఇజ్రాయెల్‌పై హౌతీల క్షిపణి దాడి… విమానాశ్రయంలో 25 మీటర్ల లోతైన గుంత!

టెల్ అవీవ్ : యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఆదివారం ఇజ్రాయెల్ వైపు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి దేశంలోని అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం అయిన టెల్ అవీవ్ వెలుపల ఉన్న బెన్ గురియన్ విమానాశ్రయం టెర్మినల్-3కి కేవలం 75 మీటర్ల దూరంలో పడింది. ఈ క్షిపణి నాలుగు అంచెల ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ దాటవేసి, దేశంలోని అత్యంత సున్నితమైన జోన్‌లలో ఒకటైన విమానాశ్రయం యాక్సెస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న తోటను ఢీకొట్టాక 25 మీటర్ల లోతైన భారీ […]
Read more

జెరూసలేం సమీపంలో భారీ కార్చిచ్చు… ఇజ్రాయెల్‌లో జాతీయ అత్యవసర పరిస్థితి!

జెరూసలేం: ఇజ్రాయెల్‌లో కార్చిచ్చు చెలరేగింది. బుధవారం జెరూసలేం పశ్చిమ కొండలలో వేగంగా వ్యాపించే కార్చిచ్చులు సంభవించడంతో ఇజ్రాయెల్ అత్యవసర హెచ్చరికను జారీ చేసింది. అంతర్జాతీయ సహాయం కోసం విజ్ఞప్తి చేసింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫుటేజ్‌లో దూరంగా మంటలు, దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంటుండటంతో డ్రైవర్లు కాలినడకన పారిపోతున్నట్లు చూపించింది. దీంతో అగ్నిమాపక విమానాలు, హెలికాప్టర్ల మద్దతుతో దేశవ్యాప్తంగా సుమారు 120 బృందాలు మంటలను అదుపు చేయడానికి మోహరించాయని, మరో 22 బృందాలు తమ మార్గంలో […]
Read more

అమెరికా ఇమిగ్రేషన్‌ పాలసీతో ప్రభావితమైన వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థులు!

వాషింగ్టన్ : అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. వారి చట్టపరమైన హోదాను రద్దు చేయడానికి గల కారణాలను వివరిస్తోంది. ఇటీవలి వారాల్లో వివరణ లేకుండా అకస్మాత్తుగా తమ హోదాలను రద్దు చేసుకున్న కొంతమంది విద్యార్థులు దాఖలు చేసిన వ్యాజ్యాలలో కొత్త వివరాలు వెలువడ్డాయి. అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో ఆందోళనగత నెలలో, అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థులు తమ రికార్డులను ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నిర్వహించే విద్యార్థి డేటాబేస్ నుండి తొలగించారని తెలుసుకుని […]
Read more

గాజాపై ఇజ్రాయెల్‌ దాడి, యెమెన్ నిర్బంధ కేంద్రంపై బాంబులు వేసిన అమెరికా!

గాజా, సనా : పశ్చిమాసియా వైమానిక దాడులతో తల్లడిల్లుతోంది. ఉత్తర సాదాలో ఆఫ్రికన్ వలసదారులను ఉంచిన జైలుపై అమెరికా దళాలు బాంబులతో దాడి చేశాయని, కనీసం 68 మంది మరణించారని, 47 మంది గాయపడ్డారని హౌతీ అనుబంధ మీడియా తెలిపింది. ఈ జైలులో 115 మంది ఖైదీలు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. యెమెన్‌ రాజధాని సనాలో కూడా అమెరికా… వైమానిక దాడులు జరిపిందని, ఈ దాడుల్లో ఎనిమిది మంది మరణించారని హౌతీలు తెలిపారు. ఈ కారాగారంలో బందీలంతా ఇథియోపియా […]
Read more

స్పెయిన్‌, పోర్చుగల్‌లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం…స్తంభించిన రైళ్లు, ఫోన్‌లు!

బార్సిలోనా : యురోపియన్‌ దేశాలైన స్పెయిన్‌, పోర్చుగల్‌, ప్రాన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యురోపియన్‌ విద్యుత్‌ గ్రిడ్‌లో సమస్య ఉత్పన్నం కావడమే దీనికి కారణమని ప్రాథమి సమాచారం. విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఎయిర్‌పోర్టులు, టెలీ కమ్యూనికేషన్లపై కూడా ఈ ప్రభావం పడింది. ఏటీఎం సర్వీసులు నిలిచిపోయాయి. రోడ్లపై ట్రాఫిక్ లైట్లు పనిచేయకపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ […]
Read more
1 28 29 30 31 32 36

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.