Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ అంతటా హింసాకాండకు పాల్పడుతున్న ఇజ్రాయేలీ సెటిలర్స్‌!

జెరూసలేం: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్‌ సెటిలర్స్‌ ఆగడాలు పెరిగాయి. పాలస్తీనియన్ల ఆస్తులను విధ్వంసం చేస్తున్నారు. సైనికుల అండ చూసుకొని పేట్రేగిపోతున్నారు. వారి భూమిని స్వాధీనం చేసుకుని పాలస్తీనియన్‌లను బెదిరిస్తున్నారు. మే 25న, జెరిఖోలోని అల్-ఆజా జలపాతం ప్రాంతంలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెలీ సెటిలర్లు ఒకే రోజులో మూడు వేర్వేరు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులు దీర్ఘకాలంగా ఉన్న పాలస్తీనియన్ సమాజాలను ఖాళీ చేయించి, కొత్తగా అక్రమ నివాస స్థావరాన్ని స్థాపించడానికి జరుగుతున్న ప్రయత్నాలలో భాగం. కేవలం ఒక […]
Read more

వచ్చే ఏడాది నుంచి మద్య నిషేధంపై ఉన్న ఆంక్షల్ని ఎత్తివేయనున్న సౌదీఅరేబియా!

రియాద్: సౌదీ అరేబియాలో 2026 నాటికి మద్యం అమ్మకం, వినియోగంపై 73 ఏళ్ల నిషేధాన్ని కఠినమైన లైసెన్సింగ్ వ్యవస్థ కింద ఎత్తివేయనున్నట్లు సమాచారం. రియాద్ ఎక్స్‌పో 2030, 2034లో ఫిఫా ప్రపంచ కప్‌తో సహా ప్రధాన అంతర్జాతీయ కార్యక్రమాలను నిర్వహించడానికి సన్నాహాల్లో భాగంగా సౌదీ ఈ ముఖ్యమైన విధాన నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియా 1952 నుండి మద్య నిషేధాన్ని కొనసాగిస్తోంది. అక్కడి స్థానికులు, విదేశీయులు ఇద్దరూ ఆ దేశంలో మద్య సేవించడంపై నిషేధం ఉంది. అయితే […]
Read more

రోహింగ్యాలను సముద్రంలో వదిలివేసినట్లు వచ్చిన నివేదికలను ఖండించిన సుప్రీంకోర్టు!

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం 43 మంది రోహింగ్యా శరణార్థులను బలవంతంగా బహిష్కరించిందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. దీనిని సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది. “దేశం క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, మీరు ఊహాజనిత ఆలోచనలతో బయటకు వస్తారు” అని పేర్కొంది. పిటిషనర్ మొహమ్మద్ ఇస్మాయిల్, ఇతరులు సమర్పించిన పత్రాల ప్రామాణికతను కూడా జస్టిస్ సూర్యకాంత్, ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. రోహింగ్యాలను ఇకపై బహిష్కరించకుండా స్టే ఇవ్వడానికి నిరాకరించింది, ఇలాంటి ఉపశమనాన్ని కోర్టు గతంలో […]
Read more

ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచిక…151వ స్థానంలో భారత్!

న్యూఢిల్లీ: ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో భారతదేశం 151వ స్థానంలో నిలిచింది. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సర్వే చేసిన 180 దేశాలలో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో భారతదేశం ర్యాంకింగ్ మునుపటి సంవత్సరం 159 నుండి ఈ సంవత్సరం 151కి మెరుగుపడింది. రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌ అని పిలవబడే ప్రభుత్వేతర సంస్థ 2002 నుంచి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచికను ప్రచురిస్తోంది. రాజకీయ, ఆర్థిక, శాసన, సామాజిక, భద్రత అనే ఐదు సూచికల ఆధారంగా ఆయా దేశాలలో […]
Read more

ట్రంప్ మధ్యప్రాచ్య పర్యటన… గాజాలో రక్తపాతానికి పాల్పడ్డ ఇజ్రాయెల్!

జెరూసలేం : పాలస్తీనాలో ఇజ్రాయెల్‌ దమనకాండ కొనసాగుతోంది. ఓవైపు ట్రంప్‌ గల్ఫ్‌ దేశాల పర్యటనలో ఉండగానే ఇజ్రాయెల్‌ గాజాలో రక్తపాతానికి ఒడిగట్టింది. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కనీసం 114 మంది పాలస్తీనియన్లు మరణించారని ఆరోగ్య అధికారులు BBCకి తలిపారు. గాజాలో ఇజ్రాయెల్ భూ దాడిని విస్తరించడానికి ముందు దాడులు తీవ్రతరం అయ్యాయి. దక్షిణ గాజాలోని హమాస్, పాలస్తీనియన్ ఇస్లామిక్ యోధులను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఖాన్ యూనిస్‌లో, నిర్వాసిత కుటుంబాలకు ఆశ్రయం […]
Read more

భారత్‌లో యాపిల్‌ సంస్థను విస్తరించొద్దన్న ట్రంప్…తిరస్కరించిన టిమ్ కుక్!

న్యూఢిల్లీ: భారత్‌లో యాపిల్‌ సంస్థను విస్తరించొద్దని ఆ సంస్థ సీఈవో టిమ్‌ కుక్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించిన విషయం తెలిసిందే. అయితే ఆపిల్ బాస్ టిమ్ కుక్ ట్రంప్‌ ఉద్బోధను తిరస్కరించారు. భారత్‌లో ఉత్పత్తిని విస్తరించడం ద్వారా యాపిల్‌కు గణనీయమైన ప్రయోజనాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. భారత్‌లో తయారీ రంగం అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు అనుకూలంగా ఉందని, ఇక్కడ ఉత్పత్తి చేయడం ద్వారా యాపిల్ వంటి సంస్థలు పోటీతత్వాన్ని అందిపుచ్చుకోవచ్చని సంబంధిత […]
Read more

అమెరికా, ఖతర్ దేశాల మద్య 1.2 ట్రిలియన్ డాలర్ల ఒప్పందాలు!

దోహా : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మధ్య ప్రాచ్య పర్యటనలో భాగంగా సౌదీ పర్యటనను ముగించుకొని నిన్న ఖతర్‌ చేరుకున్నారు. ఖతర్‌లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అమెరికాలోని బోయింగ్‌ సంస్థ నుంచి విమానాలు కొనుగోలు చేసేందుకు 200 బిలియన్‌ డాలర్ల ఒప్పందం కుదిరింది. ఈమేరకు అమెరికా, ఖతార్‌ అమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ మధ్య $1.2 ట్రిలియన్ల విలువైన ఒప్పందాలు కుదిరాయని వైట్ హౌస్ ఒప్పందాల పేర్కొంది. ఈ ఒప్పందాలలో […]
Read more

భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఉందనే ట్రంప్ వాదనలను తిరస్కరించిన మోడీ ప్రభుత్వం!

న్యూఢిల్లీ : ‘భారత్‌ – పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు అమెరికా మధ్యవర్తిత్వం, అణు సంఘర్షణను ముందస్తుగా నివారించడం గురించి ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను మోడీ ప్రభుత్వం తోసిపుచ్చింది. కాశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహించాలనే ట్రంప్‌ ప్రతిపాదనను కూడా నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. దక్షిణాసియాలో అణు యుద్ధాన్ని నివారించాలన్న ట్రంప్ పదే పదే చేసిన వాదనలను తోసిపుచ్చిన భారతదేశం, పాకిస్తాన్ దూకుడు దాడులకు ప్రతిస్పందనగా తన సాయుధ దళాలు తీసుకునే అన్ని సైనిక చర్యలు “సంప్రదాయ యుద్ధం” పరిధిలోకి […]
Read more

గల్ఫ్ పర్యటనలో డొనాల్డ్ ట్రంప్…$600 బిలియన్‌ల పెట్టుబడికి హామీ ఇచ్చిన సౌదీ!

రియాద్‌ : అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ గల్ఫ్‌ పర్యటనకు విచ్చేశారు. ట్రంప్‌ రెండోసారి అధికారం చేపట్టాక చేసిన తొలి పర్యటన ఇదే కావడం గమనార్హం. ఎయిర్ ఫోర్స్ వన్ నుండి బయటకు వచ్చిన ట్రంప్‌కు, ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ స్వాగతం పలికారు, సౌదీ అరేబియాలో రెడ్ కార్పెట్ స్వాగతం అందుకున్నారు. ట్రంప్ గల్ఫ్ పర్యటనలో ప్రధానంగా వ్యాపార ఒప్పందాలపై దృష్టి పెట్టారు. తరువాత ఆయన రియాద్‌లో అధ్యక్షుడితో ఇంధనం, రక్షణ, మైనింగ్, ఇతర రంగాలపై ఒక […]
Read more

జాతి విధ్వంస యుద్ధం కొనసాగిస్తున్న ఇజ్రాయెల్…గాజాలో 52,800 దాటిన మరణాల సంఖ్య!

టెల్‌ అవీవ్‌ : ఏడాదిన్నరగా కొనసాగుతున్న యుద్ధం వల్ల గాజాలో మరణాల సంఖ్య 53 వేలకు చేరువైంది. 2023 అక్టోబర్ నుండి గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న జాతి విధ్వంస యుద్ధంలో కనీసం 52,810 మంది పాలస్తీనియన్లు మరణించారని స్ట్రిప్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో ఎన్‌క్లేవ్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో 23 మంది మరణించగా, మరో 124 మంది గాయపడ్డారని, ఇజ్రాయెల్ దాడిలో గాయపడిన వారి సంఖ్య 119,473 కు చేరుకుందని మంత్రిత్వ శాఖ […]
Read more
1 33 34 35 36 37 42

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.