Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

భారత్‌కు మరిన్ని ఇబ్బందులు?…రష్యా చమురు కొనే దేశాలపై 500% సుంకాల బిల్లుకు ట్రంప్‌ ఓకే!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా నుండి “తెలిసి” చమురు కొనుగోలు చేసే దేశాలను “శిక్షించడానికి” ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు పచ్చజెండా చూపారు. దీంతో భారతదేశం, చైనాపై వచ్చే వారం ప్రారంభంలోనే 500 శాతం వరకు సుంకాలు పెరగవచ్చు. ఈమేరకు రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం మాట్లాడుతూ… రష్యన్ యురేనియం కొనుగోలు చేసే దేశాలను కూడా ఈ చట్టంలో చేర్చడాన్ని అధ్యక్షుడు ఆమోదించారని, వచ్చే వారం ప్రారంభంలోనే దీనిని ఓటింగ్‌కు పెట్టవచ్చని అన్నారు. లిండ్సే గ్రాహం, […]
Read more

వెస్ట్ బ్యాంక్‌లోని పాలస్తీనా విశ్వవిద్యాలయంపై ఇజ్రాయెల్ దాడి, 11 మంది విద్యార్థులకు గాయాలు!

రమల్లా: ఇజ్రాయెల్ సైన్యం ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని బిర్జీట్ విశ్వవిద్యాలయంపై దాడికి పాల్పడింది. ఫలితంగా 11 మంది పాలస్తీనా విద్యార్థులు గాయపడ్డారు, వీరిలో ఐదుగురు తుపాకీ గాయాలయ్యాయి. అంతేకాదు సైనికులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగిస్తూ విశ్వవిద్యాలయంలోకి చొరబడ్డారు, దీని ఫలితంగా గ్యాస్ పీల్చడం వల్ల అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వార్తా సంస్థ WAFA ప్రకారం… పాలస్తీనా రెడ్ క్రెసెంట్ సొసైటీ మొత్తం గాయపడిన వారిలో ఐదుగురు తుపాకీ కాల్పులకు గురయ్యారు, నలుగురు గ్యాస్ […]
Read more

యూఎస్‌తో సంబంధాల బలోపేతానికి లాబీయిస్ట్‌ను నియమించుకున్న భారత్‌!

న్యూఢిల్లీ: ట్రంప్ హయాంలో అమెరికా, భారతదేశం మధ్య సంబంధాలు వేగంగా దెబ్బతిన్నందున జాసన్‌ మిల్లర్ (మాజీ ట్రంప్ సలహాదారు) నేతృత్వంలోని SHW పార్ట్నర్స్ LLC అనే సంస్థను మన దౌత్య మిషన్, భారత లాబీయిస్టుగా నియమించుకుంది. దీనికి గాను1.8 మిలియన్‌ డాలర్లు చెల్లిస్తామంటూ ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా, ఈ లాబీయిస్టులు వాణిజ్యం, రక్షణ, దౌత్యపరమైన విషయాలలో అమెరికా ప్రభుత్వంలో, కాంగ్రెస్‌లో భారతదేశ ప్రయోజనాలను ప్రోత్సహించడానికి కీలక పాత్ర పోషిస్తారు. అంతేకాదు అమెరికా అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయడం, […]
Read more

ప్రపంచ న్యాయమూర్తి’గా వ్యవహరించే దేశాలను సమర్ధించమన్న చైనా!

బీజింగ్: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా నిర్భంధించడాన్ని చైనా ఘాటుగా విమర్శించింది.”ప్రపంచ న్యాయమూర్తి”గా వ్యవహరించే ఏ దేశాన్ని బీజింగ్ అంగీకరించదని ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యి అన్నారు. “ఏ దేశం ప్రపంచ పోలీసుగా వ్యవహరించగలదని మేము ఎప్పుడూ భావించలేదు, అలాగే ఏ దేశం కూడా ప్రపంచ న్యాయమూర్తిగా చెప్పుకోవడాన్ని మేము ఎప్పుడూ అంగీకరించము” అని బీజింగ్‌లో జరిగిన సమావేశంలో వాంగ్… అమెరికాను నేరుగా ప్రస్తావించకుండా “వెనిజులాలో ఆకస్మిక పరిణామాలను” ప్రస్తావిస్తూ అన్నారు. “అంతర్జాతీయ […]
Read more

భారత్‌పై మరిన్ని సుంకాలు విధిస్తామని హెచ్చరించిన ట్రంప్‌!

వాషింగ్టన్‌: రష్యా నుంచి చమురు దిగుమతులను కొనసాగిస్తున్న భారతదేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా హెచ్చరిక జారీ చేశారు. ”ప్రధాని మోడీ మంచి వ్యక్తి. నేను సంతోషంగా లేనని ఆయనకు తెలుసు. నన్ను సంతోషపెట్టడం ముఖ్యం. రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే.. మేము మరిన్ని టారిఫ్‌లను విధిస్తాం” అని పేర్కొన్నారు. “రష్యా చమురు విషయంలో వారు సహాయం చేయకపోతే, మేము భారతదేశంపై సుంకాలను పెంచవచ్చు,” అని ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో అన్నారు. కాగా, ఎయిర్ […]
Read more

‘మదురో’ నిర్బంధం ‘తీవ్ర ఆందోళనకరమన్న’భారత్‌…అమెరికాను ప్రస్తావించని వైనం!

న్యూఢిల్లీ: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా నిర్భందించడంపై భారతదేశం తన మౌనాన్ని వీడింది. “తీవ్ర ఆందోళన” వ్యక్తం చేసింది, కానీ వాషింగ్టన్ పేరును ప్రస్తావించలేదు సరికదా… లాటిన్ అమెరికన్ నేతను పట్టుకునేందుకు చేసిన సైనిక దాడులను మన దేశం ఖండించలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం (జనవరి 3) అమెరికా దళాలు “ఆపరేషన్ అబ్సొల్యూట్ రిసాల్వ్” పేరిట దాడులు నిర్వహించాయని ప్రకటించారు. ఇది వెనిజులాపై పెద్ద ఎత్తున సైనిక దాడి, దీని ఫలితంగా మదురో, […]
Read more

ఉమర్‌ ఖాలీద్‌కు మమ్దానీ లేఖ…ఉగ్రవాద నిరోధక చట్టాన్ని ముస్లింలకు వ్యతిరేకంగా ఉపయోగిస్తున్న మోడీ ప్రభుత్వం!

న్యూయార్క్: కొన్ని హావభావాలు విస్మరించేంత చిన్నవి, అయినప్పటికీ అవి ఖచ్చితమైనవి. న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ జైలు శిక్ష అనుభవిస్తున్న భారత కార్యకర్త ఉమర్ ఖలీద్‌కు రాసిన లేఖ వాటిలో ఒకటి. భారతదేశంలో అమలులో ఉన్న తీవ్రవాద నిరోధక చట్టం కింద ఉమర్‌ ఖలీద్ అరెస్టు అయినప్పటినుండి దాదాపు ఐదు సంవత్సరాలగా విచారణ లేకుండా జైలులో గడుపుతున్నాడు. దీనిని మోడీ ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా ఒక ఆయుధంగా ఉపయోగించిందని విమర్శకులు అంటున్నారు. కాగా, ఈ చేతితో […]
Read more

నూతన సంవత్సరం వేళ ఇస్తాంబుల్‌లో ఐదులక్షలమందితో పాలస్తీనా అనుకూల మార్చ్‌!

ఇస్తాంబుల్: నూతన సంవత్సరం నాడు ఇస్తాంబుల్‌లోని గలాటా బ్రిడ్జి వద్ద పాలస్తీనాకు మద్దతుగా భారీ మార్చ్ నిర్వహించారు, దీనిని హ్యుమానిటీ అలయన్స్, నేషనల్ విల్ ప్లాట్‌ఫామ్ ఆధ్వర్యంలో చేపట్టారు. టర్కిష్ యూత్ ఫౌండేషన్ (TUGVA) నేతృత్వంలో 400 కంటే ఎక్కువ పౌర సమాజ సంస్థల భాగస్వామ్యంతో జరిగిన ఈ ప్రదర్శనలో “మేము భయపడము, మేము మౌనంగా ఉండము, మేము పాలస్తీనాను మరచిపోము” అనే నినాదాలు మారుమోగాయి. గాజాలో మారణహోమాన్ని అంతం చేయాలని పాల్గొన్నవారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి […]
Read more

గాజాలో పలు మానవతా సంస్థల కార్యకలాపాలపై నిషేధం విధించిన ఇజ్రాయెల్!

జెరూసలేం: ఇజ్రాయెల్‌ మారణహోమం కారణంగా శిధిలమైన గాజాలో పనిచేస్తున్న పలు మానవతా సంస్థల కార్యకలాపాలపై ఇజ్రాయెల్‌ నిషేధం విధించింది. కొత్త రిజిస్ట్రేషన్ నియమాలను పాటించడంలో విఫలమైనందుకు ‘డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్’, నార్వేజియన్ రెఫ్యూజీ కౌన్సిల్, కేర్ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ రెస్క్యూ కమిటీ, ఆక్స్‌ఫామ్, కారిటాస్ వంటి ప్రధాన స్వచ్ఛంద సంస్థల విభాగాలు ఈ కారణంగా ప్రభావితమయ్యాయి. హమాస్, ఇతర మిలిటెంట్ గ్రూపులు సహాయ సంస్థలలోకి చొరబడకుండా నిరోధించడమే ఈ నియమాల లక్ష్యం అని ఇజ్రాయెల్ చెబుతోంది. కానీ […]
Read more

గాజా నగరం…అజేయ సంకల్పంతో లిఖించిన అమర చరిత్ర!

ముహమ్మద్ ముజాహిద్, 96406 22076 చరిత్ర పుటలు ఎప్పుడూ యుద్ధ వీరుల విజయగాథలతో నిండి ఉంటాయి, కానీ గాజా చరిత్ర మాత్రం ‘విధ్వంసంపై విజ్ఞానం సాధించిన విజయం’**గా లిఖించబడుతోంది. ఎక్కడైతే బాంబుల మోతతో భవనాలు నేలమట్టమయ్యాయో, ఎక్కడైతే గాలిలో కేవలం మందుపాతరల వాసన మాత్రమే మిగిలిందో, సరిగ్గా అదే శిథిలాల మధ్య ‘జీవం’ చిగురించింది. అది డిసెంబర్ 2025. ప్రపంచమంతా పండుగ వెలుగుల్లో మునిగి ఉంటే, అల్-షిఫా ఆసుపత్రి శిథిలాల మధ్య తెల్లటి కోట్లు ధరించిన కొందరు […]
Read more
1 2 3 4 5 6 36

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.