Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

జీఎస్‌టీ రేట్లలో కీలక మార్పులు…ఇకనుంచి రెండే శ్లాబులు!

న్యూఢిల్లీ: కేంద్రంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ GST నిర్మాణంలో మార్పులను ప్రతిపాదించింది. ఇకనుంచి రెండే శ్లాబులు ఉంచాలని నిర్ణయించింది. ఇది రోజువారీ వినియోగ వస్తువులపై పన్ను భారాన్ని తగ్గిస్తుంది. స్టాండర్డ్ (ప్రామాణిక), మెరిట్ (యోగ్యత) కింద వీటిని వర్గీకరిస్తూ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన ప్యానెల్‌కు నివేదించింది. వీటిపై అధ్యయనం అనంతరం జీఎస్టి కౌన్సిల్ ముందు ప్యానెల్ తన సిఫారసులు ఉంచనుంది. దాదాపు అన్ని రకాల వస్తు, సేవలు రెండు రేట్ల పరిధిలోనే ఉంటాయి. ఆర్థిక మంత్రి […]
Read more

జాదవ్‌పూర్ వర్సిటీ మాజీ విద్యార్థి హిందోల్ మజుందార్ అరెస్టును ఖండించిన CASR!

హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ విద్యా మంత్రి బ్రాత్య బసు కాన్వాయ్‌పై 2025 మార్చిలో జరిగిన దాడిలో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ఆగస్టు 13న ఢిల్లీ విమానాశ్రయంలో నిర్బంధించిన విషయం తెలిసిందే. కాగా అతని అరెస్టును క్యాంపెయిన్ అగైన్స్ట్ స్టేట్ రిప్రెషన్ (CASR) ఖండించింది. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్య స్వరాలపై విస్తృత అణచివేతలో భాగమని పేర్కొంది. 2022లో సూరజ్‌కుండ్ పథకాన్ని ప్రారంభించినప్పటి నుండి ఈ అణచివేత తీవ్రమైందని సంస్థ తెలిపింది. ఆగస్టు 15 శుక్రవారం […]
Read more

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని ద్వేషపూరిత ప్రసంగం!

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన భారత ప్రధానమంత్రి వివాదాస్పద ప్రసంగం చేశారు. అక్రమ వలసలను ముప్పుగా అభివర్ణించారు. జనాభా మార్పును లక్ష్యంగా చేసుకుని “సముచిత ప్రణాళికతో కూడిన కుట్ర” గురించి హెచ్చరించాలనుకుంటున్నాను. దానికోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయని మోడీ విద్వేష వ్యాఖ్యలు చేశారు. అధికారులు “అక్రమ వలసదారుల”పై చర్యలు తీసుకున్న తర్వాత మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనేక మంది బంగ్లాదేశ్ పౌరులు…కార్మికులుగా మన దేశంలో ఉండటానికి నకిలీ పత్రాలను సమర్పించారని ప్రధాని […]
Read more

‘లక్ష కోట్ల జుమ్లాబాజీ’…ప్రధానమంత్రి ఉద్యోగ పథకంపై రాహుల్ గాంధీ విమర్శలు!

న్యూఢిల్లీ: ఎర్రకోట వేదికగా ప్రధాని మోడీ ప్రకటించిన లక్ష కోట్ల ప్రధాన మంత్రి వికాస్‌శీల భారత్ రోజ్‌గార్ యోజన ప్రకటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఆయన “అదే పాత జుమ్లాబాజీ, అదే పాత గణాంకాలు” అని, “ఈ ప్రభుత్వం నుండి యువతకు ఉద్యోగాలు రావు, కానీ వారినోటినుంచి అబద్ధాలు మాత్రం వస్తాయని అన్నారు. “లక్ష కోట్ల జుమ్లా – సీజన్ 2! 11 సంవత్సరాల తరువాత, మోడీజీ పాత మాటలే, పాత గణాంకాలే. […]
Read more

ఈరోజు మనం స్వాతంత్య్రం పొందినా… లౌకిక సంస్కృతిని కోల్పోయే ప్రమాదంలో పడ్డాం!

ఆధునిక భారతదేశ చరిత్రలో అత్యంత వేడుకగా జరుపుకునే క్షణం…78 సంవత్సరాల క్రితం వచ్చిన స్వాతంత్ర్య దినోత్సవం. అయితే భిన్నత్వంలో ఏకత్వంగా మెలిగిన భారతదేశం నేడు, మత ప్రాతిపదికన విభజితమైంది. దీంతో మన సాంస్కృతిక సమాజంపై నీలినీడలు కమ్ముకున్నాయి. విచారకర విషయం ఏంటంటే… నేడు చాలా మంది భారతీయులు లౌకికవాదం ఒక చెడ్డ పదం అని భావిస్తున్నారు. మన దేశం హిందూ రాజ్యంగా మార్చాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఆలస్యం కాకముందే మనం […]
Read more

స్థానిక అధికారుల అసమర్థత వల్లే వీధి కుక్కల సమస్య…సుప్రీంకోర్టు!

న్యూఢిల్లీ: ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో వీధి కుక్కల “సమస్య”కు స్థానిక అధికారుల అసమర్థతే కారణమని సుప్రీంకోర్టు పేర్కొంది. వారు కుక్కల స్టెరిలైజేషన్, రోగనిరోధకత నియమాలను అమలు చేయడంలో విఫలమయ్యారని తెలిపింది. ప్రభుత్వ అధికారులు సరైన రీతిలో పనిచేయకపోవడం వల్లే సమస్య తీవ్రం అవుతోందని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని వీధి కుక్కల అంశంపై ప్రభుత్వం, జంతు ప్రేమికుల మధ్య తాజాగా సుప్రీంకోర్టులో వాడీవేడిగా వాదనలు సాగాయి. ఇప్పటికే ఇద్దరు సభ్యుల బెంచ్ ఇచ్చిన తీర్పును త్రిసభ్య ధర్మాసనం విచారణ […]
Read more

ఆపరేషన్ సిందూర్‌ను ప్రశంసించిన ప్రధాని మోదీ!

న్యూఢిల్లీ: దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎర్రకోటపై వరుసగా 12వసారి జాతీయ జెండా ఎగరవేసిన అనంతరం జాతిని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ… పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పామన్నారు. దానికి సమాధానంగానే ఆపరేషన్ సిందూర్ చేపట్టి శత్రువును ఊహించని రీతిలో దెబ్బకొట్టాం. భారత దళాల శౌర్యం, పెద్ద ఎత్తున విధ్వంసం చూసిన పాకిస్తాన్ నిద్ర చెదిరిపోతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ […]
Read more

భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ముస్లిముల పాత్ర!

చరిత్ర మరిచిన యోధులు వీరు భార‌త దేశ చ‌రిత్ర‌లో మ‌హోజ్వ‌ల ఘ‌ట్ట‌మైన స్వాతంత్య్రోద్య‌మం భార‌తీయుల పోరాట ప‌టిమ‌కు, త్యాగ నిర‌తికి ఒక నిలువుట‌ద్దం. ఇలాంటి పోరాటంలో దేశంలోని అతి పెద్ద అల్ప సంఖ్యాక వ‌ర్గమైన ముస్లింలు త‌మ‌దైన బాధ్య‌తాయుత పాత్ర‌ను పోషించారు. అపూర్వ త్యాగాల‌తో పునీతుల‌య్యారు. అయినా వారి త్యాగ‌మ‌య చ‌రిత్ర ప‌లు కార‌ణాల వ‌ల్ల మ‌రుగున ప‌డిపోయింది. కానీ చ‌రిత్ర‌ను నిశితంగా ప‌రిశీలిస్తే భార‌త స్వాతంత్య్ర సాధ‌న‌కు ముస్లింలు చేసిన కృషి ఎంత అమూల్య‌మైన‌దో తెలుస్తుంది. […]
Read more

ఓటర్ల జాబితా స్థిరంగా ఉండకూడదు…నిరంతరం మార్పులు అవసరమన్న సుప్రీంకోర్టు!

న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాలు స్థిరంగా ఉండకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎందుకంటే “ఒకేసారి ప్రక్రియ జాబితా తయారీకి మాత్రమే… కానీ క్రమం తప్పకుండా సవరణ ప్రక్రియ జరగాలని పేర్కొంది”. ఎన్నికలు జరగనున్న బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ డ్రైవ్ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్ పత్రాల సంఖ్యను పెంచడం “ఓటరుకు అనుకూలమైనదే తప్ప”, వ్యతిరేకం” కాదని పేర్కొంది. ‘గతంలో రాష్ట్రంలో నిర్వహించిన ఓటరు జాబితా సవరణ సమయంలో 7 ద్రువపత్రాలనే అనుమతించారు. […]
Read more

ఆధార్ పౌరసత్వానికి రుజువు కాదని చెప్పిన సుప్రీంకోర్టు!

న్యూఢిల్లీ: ఆధార్‌ను భారత పౌరసత్వానికి తుది సాక్ష్యంగా పరిగణించరాదని, దాన్ని స్వతంత్రంగా నిర్ధారించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అంతేకాదు పౌరులను ఓటర్ల జాబితాలో చేర్చడం లేదా తొలగించడం భారత ఎన్నికల కమిషన్ (ECI) అధికార పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది.బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఐఆర్) పేరిట భారీగా ఓట్లను తొలగిస్తున్నారంటూ దాఖలైన కేసుల విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రీయ జనతాదళ్ (RJD), కాంగ్రెస్ నుండి వచ్చిన […]
Read more
1 31 32 33 34 35 65

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.