Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

సైబర్ మోసాల వల్ల కర్ణాటకకు 5,474 కోట్ల నష్టం!

బెంగళూరు: గత మూడు సంవత్సరాలలో కర్ణాటక ప్రజలు సైబర్ మోసాల వల్ల రూ.5,474 కోట్లు కోల్పోయారని, అందులో ఇప్పటివరకు పోలీసులు రూ.627 కోట్లు రికవరీ చేయగలిగారని హోంమంత్రి జి. పరమేశ్వర అన్నారు. శాసనసభలో సకలేశ్‌పూర్ బిజెపి ఎమ్మెల్యే సిమెంట్ మంజు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. “ఇటీవలి కాలంలో సైబర్ మోసం పెరుగుతోంది. గత నాలుగు సంవత్సరాలలో, కర్ణాటకలో సుమారు 52 వేల సైబర్ మోసాలు జరిగాయి,ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని” పరమేశ్వర అన్నారు. పోలీసు చట్టాలకు […]
Read more

వందేమాతరంపై మళ్ళీ నెహ్రూను విమర్శించిన మోడీ…ఇదంతా బెంగాల్‌ ఎన్నికలకోసమేనన్న విపక్షం!

న్యూఢిల్లీ: ఓవైపు ఇండిగో సంక్షోభం, మరోవైపు దేశ రాజధాని, ఇతర భారతీయ నగరాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యం, రూపాయి పతనం మధ్య… వందేమాతరం 150 సంవత్సరాల జ్ఞాపకార్థం లోక్‌సభ ప్రత్యేక చర్చను చేపట్టింది. రోజంతా చర్చించారు. అధికార, విపక్షాలు దాదాపు 12 గంటల పాటు ఒకరినొకరు ఆరోపణలు గుప్పించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభలో చర్చను ప్రారంభించి, మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై మరోసారి దాడి చేయడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నారు, ముస్లిం లీగ్‌కు తలవంచి ఆయన, […]
Read more

‘ఓటు చోరీ’ అతిపెద్ద ‘దేశ ద్రోహం’…రాహుల్‌గాంధీ!

న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అధికారపార్టీ తీవ్ర విమర్శలు చేశారు. కాషాయపార్టీ ఎన్నికల కమిషన్‌తో కుమ్మక్కై ‘ఓటు చోరీ’కి పాల్పడి భారతదేశ భావనను నాశనం చేసింది. తద్వారా బీజేపీ అతిపెద్ద దేశ ద్రోహానికి పాల్పడిందని ఆరోపించారు. దిగువ సభలో ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ, భారత ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ ఎన్నికల కమిషన్ (ఈసీ)ని “ ఉపయోగిస్తోందని” పలు ప్రశ్నలను సంధించారు. ఎన్నికలకు ఒక నెల ముందు అన్ని పార్టీలకు […]
Read more

‘ఇండిగో’ గందరగోళంపై సమాధానం ఇవ్వాలని లోక్‌సభలో విపక్షాల డిమాండ్‌!

న్యూఢిల్లీ: పార్లమెంటులో ఇండిగో సంక్షోభంపై దుమారం చెలరేగింది. భారతదేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభంపై లోక్ సభలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి. రాజ్యసభలో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసి… సభనుంచి వాకౌట్‌ చేశాయి. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే ఈ అంశాన్ని లేవనెత్తిన కాంగ్రెస్ ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుండి వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. “మిస్టర్ […]
Read more

మూడవ తరగతి పాఠాన్ని ‘లవ్ జిహాద్’గా చిత్రీకరించిన టీవీ ఛానళ్లకు మందలింపు!

న్యూఢిల్లీ: ఎన్‌సీఆర్‌టీ పుస్తకంలోని మూడవ తరగతి పాఠాన్ని కల్పిత ‘లవ్ జిహాద్’ కథనంగా మార్చినందుకు పలు టీవీ ఛానెల్‌లను న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ అండ్ డిజిటల్ స్టాండర్డ్స్ అథారిటీ (NBDSA) మందలించింది. ఆ మతపరమైన ప్రసారాన్ని వెంటనే తొలగించాలని కూడా ఆదేశించింది. కాగా, ఈ కథనాన్ని ఇండియా టీవీ, న్యూస్ 18 మధ్యప్రదేశ్/ఛత్తీస్‌గఢ్, జీ మధ్యప్రదేశ్/ఛత్తీస్‌గఢ్, జీ న్యూస్, ABP న్యూస్ వార్తా ఛానెల్‌లు ప్రసారం చేసాయి. విషయంలోకి వస్తే…రీనా అనే అమ్మాయి “చిట్టి ఆయి హై” అనే […]
Read more

ఇండిగో సంక్షోభం…ఒకప్పుడు ఎలక్టోరల్ బాండ్లను ఎక్కువగా కొనుగోలు చేసిన ఎయిర్‌లైన్!

న్యూఢిల్లీ: భారతదేశంలో వాణిజ్య విమాన కార్యకలాపాలను స్తంభింపజేసిన ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రస్తుతం అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ సంస్థ రాజకీయ విరాళాలు దానిని వెంటాడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు 2023లో ఇండిగో ఎయిర్‌లైన్స్ పెద్ద ఎత్తున ఎన్నికల బాండ్లను కొనుగోలు చేయడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ప్రశ్నలు లేవనెత్తాయి. భారత ఎన్నికల కమిషన్ డేటా 2024 ప్రకారం… ఇండిగోను నిర్వహిస్తున్న ఇంటర్‌గ్లోబ్ గ్రూపులు రూ. 36 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేశాయని […]
Read more

డీజీపీల సమావేశంలో పోలీసు సంస్కరణలకు హామీ…కానీ అమలవుతాయా?!

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గతవారం 60వ అఖిల భారత డీజీపీలు/ఐజీపీల సమావేశం రాయ్‌పూర్‌లో జరిగింది. ఈ సమావేశంలో పోలీస్ డైరెక్టర్ జనరల్స్, భారతదేశ అత్యున్నత రాజకీయ నాయకత్వం, పోలీసు, నిఘా,భద్రతా సంస్థల ఉన్నతాధికారులను ఒకచోటకు చేర్చింది. ఇందులో దేశ అంతర్గత భద్రత, తీవ్రవాద వ్యతిరేకత, పోలీసు ఆధునీకరణ, మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్‌ సెక్యూరిటీ, మహిళా భద్రత వంటి అంశాలపై చర్చించారు, భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ […]
Read more

భారత్‌-రష్యా మధ్య వాణిజ్య బంధం బలోపేతం!

న్యూఢిల్లీ: భారత్-రష్యా మధ్య ఉన్న నమ్మకమైన స్నేహానికి గుర్తుగా ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం బలోపేతానికి కృషిచేయనున్నారు. ఈ క్రమంలో వచ్చే ఐదేళ్లపాటు అంటే 2030 వరకు ఆర్థిక సహకార ప్రణాళికపై ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈమేరకు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని వంద బిలియన్‌ డాలర్లకు చేర్చడమే ఈ ప్రణాళిక లక్ష్యమని తెలిపారు. గత సంవత్సరం ద్వైపాక్షిక వాణిజ్యం 12% వృద్ధి చెంది, కొత్త రికార్డు స్థాపించింది. ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో ఉంటుందని పుతిన్ ఆశాభావం […]
Read more

ఇండిగో విమాన సర్వీసుల్లో గందరగోళం…నేడు ఏకంగా 400 విమానాల రద్దు!

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల్లో గందరగోళం కొనసాగుతోంది. నేడు వివిధ విమానాశ్రయాలలో ఏకంగా 400 పైగా విమానాలను రద్దు చేసారు.పెద్ద సంఖ్యలో విమానాలు ఆలస్యంగా నడిచాయని వర్గాలు తెలిపాయి. దీంతో వందలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాలలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇండిగో విమానాల రద్దుతో హైదరాబాద్ విమానాశ్రయంలో వేలాది మంది ప్రయాణికులకు కష్టాలు తప్పలేదు. ఈ పరిణామంతో ఇండిగో 550పైగా విమానాలను రద్దు చేసినట్లయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 నాటికి విమాన సర్వీసులను పూర్తిగా […]
Read more

భారతదేశ విద్యా వ్యవస్థలో సామాజిక శాస్త్రాల పతనమవుతున్నాయి!

న్యూఢిల్లీ: భారతదేశ విద్యా వ్యవస్థలో సామాజిక శాస్త్రాల పతనం అనేది ఒక క్లిష్టమైన సమస్య. వివక్షాపూరిత పాఠశాల విధానాలు (కుల, వర్గ, ప్రాంతీయ భేదాలు), వృత్తి నైపుణ్యాలపై అతిగా దృష్టి పెట్టడం, ప్రభుత్వ నిధుల కొరత, సామాజిక శాస్త్ర అధ్యయనాలను కేవలం సైద్ధాంతికంగా చూడటం దీనికి ప్రధానకారణాలుగా భావించవచ్చు. తద్వార విద్యార్థులకు సామాజిక వాస్తవాలపై అవగాహన తగ్గి, సామాజిక మార్పును ప్రోత్సహించే శక్తి తగ్గిపోతుంది, ఫలితంగా నిరుద్యోగం, సామాజిక అసమానతలు పెరుగుతాయి. ఇక్కడ సమస్య ప్రతిభ లేకపోవడం […]
Read more
1 31 32 33 34 35 87

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.