Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం, పట్టు కోల్పోయిన బీఆర్ఎస్!

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘనవిజయం సాధించింది. మొత్తం ఏడు కార్పోరేషన్లకు గాను ఐదింటిని కైవసం చేసుకుంది. ఎంఐఎంతో మిత్రత్వం కారణంగా నిజామాబాద్‌ కార్పొరేషన్‌ కూడా కాంగ్రస్‌ ఖాతాలోకి చేరే అవకాశముంది. ఇక 116 మున్సిపాలిటీల్లో 78 స్థానాలను అధికార పార్టీ గెలుచుకుంది. మొత్తం 5,992 వార్డులకు గాను 3,074 స్థానాలను గెలుచుకుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఫలితాల ప్రకారం తెలుస్తోంది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సాధించిన […]
Read more

మున్సిపోల్స్‌ ఓట్ల లెక్కింపు ప్రారంభం!

హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపోల్స్‌ ఓట్ల లెక్కింపు కొద్దిసేపు క్రితమే ప్రారంభమైంది. మొత్తం 116 మునిసిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లు సహా 123 పట్టణ స్థానిక సంస్థల (ULB) ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి, ఆపై సాధారణ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఇందుకోసం అవసరమైన కౌంటింగ్ సూపర్‌వైజర్లు, సహాయకులను రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) నియమించింది. భారత న్యాయసంహిత సెక్షన్ 163 లెక్కింపు కేంద్రాలలో, చుట్టుపక్కల అమలులో […]
Read more

తెలంగాణ మున్సిపోల్స్‌లో 73 శాతం పోలింగ్…కాంగ్రెస్‌దే విజయమన్న ఎగ్జిట్ పోల్స్‌!

హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న ఘర్షణలు తప్ప ఓటింగ్ ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా జరిగింద. ఈ ఎన్నికల్లో మొత్తం 73.01 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 38,09,406 ఓట్లు పోలయ్యాయి. వీరిలో 18,51,829 మంది పురుష ఓటర్లు (72.63 శాతం), 19,57,226 మంది మహిళా ఓటర్లు (73.39 శాతం, 351 (55.02 శాతం) ఇతర కేటగిరీ ఓటర్లు ఉన్నారు. చౌటుప్పల్ మునిసిపాలిటీలో గరిష్టంగా 91.91 శాతం, నందికొండ […]
Read more

మున్సిపోల్స్‌లో గెలిచేందుకు రాజకీయ ప్రత్యర్థులను భారీ మొత్తాలతో ఆకర్షించిన పార్టీలు!

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు చివరి నిమిషంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష BRS, BJPలు ఎన్నికలు జరగనున్న మునిసిపాలిటీలలో ప్రభావవంతమైన స్థానిక నాయకులను వేటాడటానికి రంగంలోకి దిగినట్లు సమాచారం. పార్టీలు తమ అభ్యర్థులకు మద్దతు ఇవ్వడానికి వార్డులలోని ప్రత్యర్థి స్థానిక ప్రభావవంతమైన నాయకులకు రూ.5 లక్షల నుండి రూ.10 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల్లో మద్దతు కోరేందుకు మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ప్రభావవంతమైన నాయకులతో రహస్య చర్చలు జరుపుతున్నారు. ప్రతి […]
Read more

తెలంగాణలో ప్రారంభమైన మున్సిపల్ పోలింగ్!

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ ఈరోజు ఉదయం ప్రారంభమైంది. మొత్తం ఏడు కార్పోరేషన్‌లలోని 412 డివిజన్‌లు, 116 మునిసిపాలిటీలలోని 2,569 వార్డులకు ఓటింగ్‌ జరుగుతోంది. పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది., సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్‌ ప్రశాంతంగా సాగేందుకు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద […]
Read more

బీఆర్ఎస్ అంటే ‘బ్లాక్‌మెయిల్ రాజకీయ సమితి’…సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గులాబీ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ఎస్‌ను ‘బ్లాక్‌మెయిల్ రాజకీయ సమితి’గా అభివర్ణించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు వంటి సంఘటనలు… బీఆర్ఎస్ నాయకత్వం వ్యాపారవేత్తలను డబ్బు కోసం ఎలా బ్లాక్‌మెయిల్ చేసిందో, భూములను ఎలా కబ్జా చేసిందో నిరూపిస్తున్నాయని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ములుగులో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… గులాబీ పార్టీ ఖాతాలో ఉన్న రూ. 1500 కోట్లు అనైతిక పద్ధతుల ద్వారా […]
Read more

విద్వేష ప్రసంగాల వ్యతిరేక చట్టాన్ని తీసుకురానున్న తెలంగాణ!

హైదరాబాద్: రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో విద్వేష ప్రసంగాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకువస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. విద్వేష ప్రసంగాలను అరికట్టడానికి,సమాజంలో శాంతిని కాపాడటానికి ఈ కఠినమైన చట్టాలను అమలు చేయాలని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో జమాయత్ ఉలేమా-ఎ-హింద్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, కాంగ్రెస్ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిందని, దేశాభివృద్ధిలో జమాత్ పాత్ర ప్రశంసనీయమని అన్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలని కేంద్ర హోంమంత్రి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) […]
Read more

జాబ్‌ క్యాలెండర్‌పై టీపీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలతో తెలంగాణలో రాజకీయ దుమారం!

హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లపై మరోసారి చర్చకు తెరలేపారు. ప్రభుత్వం ఈ ఉద్యోగాలను ఒక్క సంవత్సరంలో కాకుండా, తమ ఐదేళ్ల పదవీకాలంలో భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందని ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 2న వెలుగులోకి వచ్చిన ఇంటర్వ్యూ క్లిప్‌లో, తాము ఉద్యోగాలను ఒక్క సంవత్సరంలో భర్తీ చేస్తామని ఎప్పుడూ హామీ ఇవ్వలేదని, ఐదేళ్ల కాలంలో చేస్తామని చెప్పామని గౌడ్ […]
Read more

కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశ కలిగించింది…తెలంగాణ గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు!

హైదరాబాద్‌: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేసిందని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు విమర్శించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తగినన్ని నిధులు కేటాయించడంలో మరోసారి విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ కేంద్రానికి గణనీయమైన పన్ను ఆదాయాన్ని అందిస్తున్నప్పటికీ, రాష్ట్రానికి సున్నా కేటాయింపు చేసిందని అన్నారు. “మేము లక్షల కోట్ల పన్నులు చెల్లిస్తాము, కానీ వనరుల కేటాయింపులో తెలంగాణను పూర్తిగా విస్మరించారు” అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ పట్ల […]
Read more

హైదరాబాద్‌లో ఎస్‌ఐఆర్‌ వంశపారంపర్య వివరాల మ్యాపింగ్‌ షురూ!

హైదరాబాద్: తెలంగాణలో జరగబోయే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)కు ముందు, బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) హైదరాబాద్‌లో వంశపారంపర్య వివరాల మ్యాపింగ్‌ను ప్రారంభించారు. ఈ విషయమై ఇటీవల, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ… మొదటి, రెండవ దశలలో కవర్ కాని రాష్ట్రాలలో ఎస్‌ఐఆర్ త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు. మ్యాపింగ్‌లో హైదరాబాద్ బీఎల్‌ఓల పాత్రతెలంగాణలో జరగబోయే ఈ భారీ ప్రక్రియ దృష్ట్యా, బీఎల్‌ఓలు ఓటర్ల పేర్లను 2002 ఎస్‌ఐఆర్ జాబితాతో అనుసంధానించడానికి లింకింగ్ […]
Read more
1 12 13 14 15 16 52

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.