హైదరాబాద్: టీజీఎస్ఆర్టీసీని (TGSRTC) ప్రభుత్వంలో విలీనం చేసి, తమకు ప్రభుత్వ ఉద్యోగులుగా హోదా కల్పించాలని ‘టీజీఆర్టీసీ విక్టిమ్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్’ (TGRTC Victims Employees Welfare Association) డిమాండ్ చేస్తోంది. ఈమేరకు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. తెలంగాణ ప్రభుత్వం 2023 ఆగస్టులో ఆమోదించిన ‘టీజీఎస్ఆర్టీసీ (విలీనం) చట్టం’ ప్రకారం, కార్మికులందరినీ ప్రభుత్వ సేవల్లోకి తీసుకోవాలని లేఖ ద్వారా యాజమాన్యాన్ని కోరారు.
టీజీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డికి రాసిన లేఖలో, వారికి ఉద్యోగి హోదా కల్పించడం ద్వారా ఉద్యోగ భద్రత కల్పించడానికే ఈ చట్టాన్ని రూపొందించారని సంఘం పేర్కొంది. విలీనం అయిన ఉద్యోగులకు సంబంధించిన సేవా నిబంధనలను ప్రభుత్వం ఖరారు చేసే వరకు, ప్రతిపాదిత కార్పొరేషన్ స్థాయి ట్రేడ్ యూనియన్ ఎన్నికలను టీజీఎస్ఆర్టీసీ నిలిపివేయాలని కూడా వారు డిమాండ్ చేశారు.
అధికారిక గెజిట్ బిల్లు ఫైళ్లలో ఉన్న చట్టపరమైన నిబంధనలు, ఆర్థిక కేటాయింపులు, శాసన ఉద్దేశం ఆధారంగానే తమ డిమాండ్లు ఉన్నాయని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియను నిలిపివేయడానికి, శాసనసభ నిర్దేశించిన చట్టబద్ధమైన రక్షణలను అమలు చేయడానికి త్వరితగతిన పరిపాలనా ఆదేశాలు జారీ చేయాలని అది టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరింది.

