Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

సీజేపీ ‘చలో పార్లమెంట్’… జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత!

Share It:

న్యూఢిల్లీ: విద్యా సంస్కరణల డిమాండ్‌తో ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ (CJP) ఈరోజు తలపెట్టిన పార్లమెంట్ మార్చ్‌కు ముందు, న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉన్న నిరసన ప్రదేశానికి రాజకీయ నాయకులు, నటులు, సామాన్య ప్రజలు భారీగా తరలివచ్చారు.

నిర్ణీత కార్యక్రమానికి ముందే సుమారు 20,000 మంది ప్రజలు జంతర్ మంతర్ వద్ద , దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నారని CJP ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్ పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ గారూ… మీ జవాబుదారీతనం నిరూపించుకునే సమయం ఆసన్నమైందని అన్నారు.”

నేటి కార్యక్రమం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు రావడం ప్రారంభించారని పేర్కొంటూ, మద్దతుదారులతో కిక్కిరిసిపోయిన నిరసన ప్రదేశం ఫోటోలు, వీడియోలను CJP సభ్యులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే మార్చ్‌కు ముందు పోలీసులు తీసుకునే చర్యల పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎటువంటి రెచ్చగొట్టే చర్యలకు స్పందించవద్దని, మార్చ్ శాంతియుతంగా జరిగేలా చూసుకోవాలని నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు.

CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే వీడియో సందేశం ద్వారా మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ, పార్లమెంట్ మార్చ్ శాంతియుతంగా కొనసాగుతోంది. దయచేసి భారీ సంఖ్యలో ఇక్కడికి రండి. మీరు రాకపోతే, వారు ఈ నిరసనను అణచివేయడానికి ప్రయత్నిస్తారు,” అని ఆయన అన్నారు. మా నిరసన, మార్చ్ శాంతియుతంగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ నిబంధనలను మరియు మార్గదర్శకాలను పాటించాలని దీప్కే విజ్ఞప్తి చేశారు.

జంతర్ మంతర్ వద్ద మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడిన సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి అంగ్మో, రాజకీయ నాయకులు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి వచ్చి, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విద్యా జవాబుదారీతనం అంశాన్ని లేవనెత్తుతామని హామీ ఇస్తే, ఆయన తన నిరాహార దీక్షను విరమిస్తారని తెలిపారు. నేటి మార్చ్‌ను శాంతియుతంగా నిర్వహించాలని, ఈ నిరసన దుర్వినియోగం కాకుండా చూసుకోవాలని సోనమ్ మనందరినీ కోరారని ఆంగ్మో అన్నారు.

నటీనటులు షబానా అజ్మీ, ప్రకాష్ రాజ్ పగటిపూట జంతర్ మంతర్‌ను సందర్శించి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, సీపీఐ(ఎం) నాయకురాలు బృందా కరత్, ఆప్ నాయకుడు మనీష్ సిసోడియాలతో కలిసి ఈ ఆందోళనకు సంఘీభావం తెలిపారు. విద్యార్థుల కోసం ఈరోజు జరిగే “సన్‌సెట్ డెమాన్‌స్ట్రేషన్”, పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొనాలని ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా అన్ని రాజకీయ పార్టీల మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు.

“నిజం ఏమిటంటే, అమ్ముడవుతున్నది కేవలం ప్రశ్నపత్రాలు మాత్రమే కాదు, మన పిల్లల భవిష్యత్తు. కష్టపడి చదివే విద్యార్థులు ముందుకు వెళ్తారా లేక డబ్బు, పలుకుబడితో ప్రశ్నపత్రాలు కొనగలిగే వారు ముందుకు వెళ్తారా అనేది ఈ పోరాటమే నిర్ణయిస్తుంది,” అని ఆయన అన్నారు.

తన ప్రజా జీవితాన్ని విద్యను మెరుగుపరచడానికి అంకితం చేశానని, ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య కోసం కృషి చేస్తూనే ఉంటానని ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి అన్నారు. నిరసన చేస్తున్న విద్యార్థులను “విద్యా విప్లవ సైనికులు” అని ఆయన అభివర్ణించారు. “పేపర్ మాఫియా”పై పోరాడే బాధ్యతను యువత తమ భుజాలపై వేసుకుందని ఆయన అన్నారు.

జంతర్ మంతర్ చుట్టూ త్రివిధ భద్రత
ఇదిలా ఉండగా, సీజేపీ మార్చ్‌కు ముందు న్యూఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ, ఉత్తర ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో పోలీసులు అనేక ప్రవేశ మార్గాలను అత్యంత భద్రతా మండలాలుగా మార్చారు. ఇందుకోసం బహుళ అంచెల బారికేడ్లు, పటిష్టమైన నిఘా, విధ్వంస నిరోధక తనిఖీలు, నిరంతర గస్తీని ఏర్పాటు చేసినట్లు వర్గాలు తెలిపాయి.

“అత్యంత భద్రతా మండలం వైపు ఎలాంటి అనధికారిక మార్చ్‌ను అనుమతించకూడదని మేము నిశ్చయించుకున్నాము,” అని పోలీసు వర్గాలు తెలిపాయి. న్యూఢిల్లీలో నిషేధాజ్ఞలు విధించామని, ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడవద్దని హెచ్చరించాయి.

“జంతర్ మంతర్, దాని పరిసర ప్రాంతాలలో శాంతిభద్రతలను కాపాడటానికి త్రివిధ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాంతంలో రెండు అంచెల ఢిల్లీ పోలీసు సిబ్బంది, ఒక అంచె పారామిలిటరీ బలగాలను మోహరించారు. పరిస్థితి ప్రశాంతంగా ఉండేలా చూసేందుకు ఈ భద్రతా వలయం నిరంతరం కొనసాగుతుందని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

“అటువంటి నిరసన ప్రదర్శన/ఊరేగింపు కోసం ఎటువంటి అనుమతి కోరలేదు, మంజూరు చేయలేదు అని ఢిల్లీ పోలీసులు ఖచ్చితంగా స్పష్టం చేస్తున్నారు” అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) సచిన్ శర్మ పేర్కొన్నారు. DCP ఎక్స్‌లో చేసిన పోస్ట్ ప్రకారం, న్యూఢిల్లీలో ప్రస్తుతం BNSS సెక్షన్ 163 (గతంలో CrPC సెక్షన్ 144) కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి.

“దీని ప్రకారం, ముందస్తు అనుమతితో జంతర్ మంతర్ వద్ద కేటాయించిన నిరసన ప్రదేశంలో తప్ప, నిరసన ర్యాలీలు, ఊరేగింపులు, ప్రదర్శనలు,ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడటం వంటివి కఠినంగా నిషేధించామని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.