Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

మన విద్యా వ్యవస్థ పిల్లలను మానసికంగా అణచివేస్తుంది…రాహుల్ గాంధీ!

Share It:

జైపూర్‌: భారతదేశ విద్యా వ్యవస్థ పిల్లలపై ఒత్తిడి తెచ్చి, వారిని మానసికంగా అణచివేస్తుందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈమేరకు రాజస్థాన్​లోని కోటాలో నిర్వహించిన “ఛాత్రోన్ కీ గూంజ్” మహా ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు తీవ్ర ఒత్తిడితో పోరాడుతున్నారని, వారికి మంచి భవిష్యత్తు లభించాలని అన్నారు.

“ఇది దేశానికి మంచిది కాదు. విద్యార్థుల్లో నిరాశ నిస్పృహలు తలెత్తకుండా పనిచేసే వ్యవస్థకోసం మనమందరం కలిసి పనిచేయాలని నేను కోరుకుంటున్నానని ఆయన అన్నారు. తన ప్రారంభోపన్యాసంలో, ఈ కార్యక్రమం విద్యార్థులు, వారి సమస్యలపై కేంద్రీకృతమై ఉందని రాహుల్‌ గాంధీ నొక్కి చెప్పారు.

“ఇది రాజకీయ సమావేశం కాదు. ఇది మీకోసం ఏర్పాటైన సమావేశం, మంచి భవిష్యత్తు కోసం పోరాడుతున్న యువత కోసం ఏర్పాటు చేసిన సమావేశం ఇది. విద్యార్థులు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి చర్చించడమే ఈ ర్యాలీ ఉద్దేశం అని ఆయన అన్నారు.

రాహుల్‌ ప్రసంగం అనంతరం…నీట్, జేఈఈ, సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలతో సహా ఐదుగురు విద్యార్థులు రాహుల్‌ గాంధీతో మాట్లాడేందుకు వేదికపైకి వచ్చారు. ఈ సంభాషణ సందర్భంగా రాహుల్‌ గాంధీ, విద్యార్థులతో వారి భవిష్యత్ ప్రణాళికలు, పోటీ పరీక్షలకు సిద్ధమవడానికి గల కారణాలు, వ్యక్తిగత ఆకాంక్షలు, కోచింగ్, పరీక్షల తయారీకి అయ్యే ఆర్థిక భారం గురించి మాట్లాడారు.

నీట్ అంశంపై ‘ఛాత్రోన్ కీ గూంజ్’ మెగా ర్యాలీ సామాజిక మాథ్యమం ఎక్స్‌లో.

pic.twitter.com/9VNejS40rp

ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ దేశవ్యాప్త విద్యార్థి సదస్సుల పరంపరలో మొదటిదిగా ప్రచారం చేస్తోంది. అయితే, ఈ కార్యక్రమం పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల దృష్టిని మరల్చగలదని ఆరోపిస్తూ, బీజేపీ దీనిని వ్యతిరేకించింది. కాగా, నీట్, జేఈఈ,ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

కోటా దేశంలోని అతిపెద్ద కోచింగ్ కేంద్రాలలో ఒకటి. నగరవ్యాప్తంగా ఉన్న కోచింగ్ సంస్థలలో దాదాపు 1.2 లక్షల మంది విద్యార్థులు నీట్, జేఈఈ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.

కాంగ్రెస్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడైన గాంధీ, విద్యార్థుల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, పరీక్షలలో జరిగిన అవకతవకలపై జవాబుదారీతనం కోరడం, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేయడం లక్ష్యంగా ఒక జాతీయ విద్యా ఉద్యమానికి నాయకత్వం వహించనున్నారు.

నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI), ఇండియన్ యూత్ కాంగ్రెస్‌తో సహా కాంగ్రెస్ విభాగాలు నిర్వహించే కార్యక్రమాల ద్వారా ఈ ప్రచారం దేశవ్యాప్తంగా సాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా, రాబోయే వారాల్లో అలహాబాద్, పాట్నా, ఢిల్లీలలో జరిగే విద్యార్థి సదస్సులలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.