టెహ్రాన్: హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మూడు వాణిజ్య నౌకలపై దాడి జరిగిన తర్వాత, డు అమెరికా ఇరాన్పై “శక్తివంతమైన” సైనిక దాడులను ప్రారంభించింది. ఈ దాడులను యూఎస్ సెంట్రల్ కమాండ్ ‘X’లో దృవీకరించింది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని, దాడి చేసినందుకు భారీ మూల్యం చెల్లించేలా చేయడానికి” ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది.
“హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ చేసిన దాడులకు ప్రతిస్పందనగా ఈ అమెరికా దాడులు జరిగాయి”, “వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని, దాడి చేసినందుకు భారీ మూల్యం చెల్లించేలా చేస్తాయి.” “ఇరాన్ దాడులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమే” అని ఆ ప్రకటనలో జోడించారు.
ఈ దాడుల లక్ష్యాలలో ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, తీరప్రాంత నిఘా వ్యవస్థలు, ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు, నౌకా విధ్వంసక క్రూయిజ్ క్షిపణి స్థావరాలు, డ్రోన్ ప్రయోగ స్థావరాలు, ఓడరేవు సౌకర్యాలు ఉన్నాయని యూఎస్ మీడియా సంస్థ ఆక్సియోస్ వార్తా సంస్థ పేర్కొంది. బందర్ అబ్బాస్, సిరిక్ ఓడరేవు నగరాల్లో, ఖేష్మ్ ద్వీపంలో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది.
“అవసరమని భావించే ఏ చర్యలనైనా తీసుకుంటామని” ఇరాన్ వెంటనే వాషింగ్టన్ను హెచ్చరించింది. దీంతో, యుద్ధంలో పోరాటాన్ని నిలిపివేయడానికి కుదిరిన మధ్యంతర ఒప్పందం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం పెరిగింది, ఇది మధ్యప్రాచ్యాన్ని మళ్లీ విస్తృత సంఘర్షణ ప్రమాదంలోకి నెట్టింది.
“బెదిరింపులు, దోపిడీల శకం ముగిసింది,” అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖాలిబాఫ్ Xలో రాశారు. “దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. మేము లొంగిపోము.” ఇరాన్ ఈ దాడులను అంగీకరించింది, కానీ నష్టాల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. బందర్ అబ్బాస్, ఖేష్మ్ మరియు సిరిక్లలో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా నివేదించింది.
“ఈ దురాక్రమణకు, ఉగ్రవాద చర్యకు నిర్ణయాత్మకంగా ప్రతిస్పందిస్తామని” ఇరాన్ కేంద్ర సైనిక కమాండ్ హెచ్చరించింది. “హోర్ముజ్ జలసంధి వ్యవహారాల్లో జోక్యాన్ని (ఇరాన్ సాయుధ దళాలు) ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవు, అలాగే ఇతరులు దానిని నిర్వహించడానికి కూడా అనుమతించవు,” అని అది పేర్కొంది.
హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మూడు ట్యాంకర్లపై క్షిపణులు దాడి చేసిన కొన్ని గంటలకే ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల అనంతరం, ఇరాన్ చమురు అమ్మకానికి అనుమతినిచ్చిన లైసెన్సును అమెరికా ఉపసంహరించుకుంది. ఆ లైసెన్సు, ఇరు దేశాల మధ్య పోరాటాన్ని ముగించడానికి ఉద్దేశించిన అవగాహన ఒప్పందంలో ఒక భాగంగా ఉంది.
చమురు ఆంక్షల మినహాయింపును రద్దు చేయాలన్న వాషింగ్టన్ నిర్ణయాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇది “ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందంలోని ఆర్టికల్ 10ను స్పష్టంగా ఉల్లంఘించడమే” అని పేర్కొంది. ఇరాన్ తన జాతీయ ప్రయోజనాలు కాపాడుకోవడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటుంది” అని ఆయన హెచ్చరించారు.
కాగా, ఈ దాడులు కొనసాగుతున్న చర్చలను క్లిష్టతరం చేసే అవకాశం ఉంది. హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తిరిగి తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమాన్ని తగ్గించడం, ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై దాడులు చేసి అప్పటి సర్వోన్నత నాయకుడు అలీ ఖమేనీని హతమార్చడంతో ప్రారంభమైన మధ్యప్రాచ్య యుద్ధానికి శాశ్వత ముగింపు పలకడం ఆ చర్చల లక్ష్యాలు.


