హైదరాబాద్: కురిక్యాల్లోని జడ్పీహెచ్ బాలికల టాయిలెట్లో రహస్య కెమెరాలు ఏర్పాటు విషయం సంచలనం సృష్టించింది. ఆ స్కూల్ బాలికలు ఈ విషయాన్ని బయటపెట్టారు.
కరీంనగర్ జిల్లా గాంధార మండలంలో ఉన్న పాఠశాలలో చదువుతున్న కొంతమంది బాలికలు వాష్రూమ్లో అనుమానాస్పదంగా మెరుస్తున్న కెమెరా పరికరాన్ని గమనించి దాని గురించి వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గంగాధర సబ్-ఇన్స్పెక్టర్ (SI) వంశీ కృష్ణ, చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) ప్రదీప్ కుమార్లకు సమాచారం అందించారు, వారు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు పాఠశాల పరిసరాల నుండి ఆధారాలు సేకరిస్తున్నారు.
కాగా, ఈ సంఘటనపై నివేదికను జిల్లా కలెక్టర్, తెలంగాణ మహిళా-శిశు సంక్షేమ శాఖకు పంపామని ప్రిన్సిపాల్ మీడియాకు తెలిపారు.
అన్ని ఉన్నత పాఠశాలలు,ప్రాథమిక పాఠశాలల్లో, ముఖ్యంగా బాలికల పాఠశాలల్లో ‘స్నేహిత క్లబ్లు’, ఇతర క్లబ్లను ప్రారంభించిన జిల్లా కలెక్టర్, పాఠశాలల నుండి నేరుగా నివేదికలు తీసుకుంటున్నామని అన్నారు. “కలెక్టర్ ఆదేశాల ఆధారంగా పాఠశాల యాజమాన్యాలు అవసరమైన చర్యలు తీసుకుంటాయి” అని ప్రిన్సిపాల్ హామీ ఇచ్చారు.
ఆసక్తికర విషయమేమిటంటే… ఈ ఏడాది జనవరిలో బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లా రెడ్డి యాజమాన్యంలోని CMR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఇలాంటి సంఘటన జరిగింది. ఆ సంఘటనలో, ఆ క్యాంపస్లోని హాస్టల్లో రహస్య కెమెరాలు కనిపించాయి, దీనిని విద్యార్థులు గుర్తించారు. ఈ ఘటన అప్పట్లో కళాశాల క్యాంపస్ లోపల నిరసనలకు దారితీసింది.
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నేరెళ్ల శారద క్యాంపస్ను సందర్శించి హాస్టల్ పరిపాలన నిర్లక్ష్య వైఖరిపై తన ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ నివేదిక ఆధారంగా, CMR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తాను ఖచ్చితంగా సిఫార్సు చేస్తానని ఆమె అప్పుడు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి, ప్రైవేట్ కళాశాలలకు సంబంధించిన నియమాలను త్వరలో రూపొందిస్తానని కూడా ఆమె చెప్పారు.
హాస్టల్ బాత్రూమ్ల వెంటిలేటర్ల గ్లాసులపై దొరికిన వేలిముద్రల ఆధారంగా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు, కానీ కళాశాల యాజమాన్యంపై ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇంకా ఎటువంటి నియమాలను రూపొందించలేదు. కాగా, విద్య, హోం శాఖ రెండూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆజమాయిషిలోనే ఉండటం గమనార్హం.


