Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

అజిత్ పవార్ విమాన ప్రమాదంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదేం?…రాజ్ థాకరే!

ముంబయి: జనవరి చివరలో మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి చెందిన ఘోర విమాన ప్రమాదంలో ఇంకా ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరే ప్రశ్నించారు. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం “అనుమానపు దయ్యాలను వేలాడదీస్తున్నట్లు” కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అజిత్ పవార్ మేనల్లుడు, ఎన్సీపీ (శరద్ పవార్) ఎమ్మెల్యే రోహిత్ పవార్ శుక్రవారం థాకరేను కలిసి జనవరి 28న బారామతిలో జరిగిన ప్రమాదంలో అజిత్ పవార్ సహా ఐదుగురు […]
Read more

ఈ ఏడాది మైనారిటీలపై 42 ద్వేషపూరిత నేరాలు….సియాసత్ నివేదిక!

హైదరాబాద్: ఈఏడాది జనవరిలో ముస్లింలు, దళితులు, క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని కనీసం 42 ద్వేషపూరిత నేరాలు నమోదయ్యాయని సియాసత్.కామ్ తెలిపింది. ఈ సంఘటనలు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. ఈశాన్యంలోని అస్సాం నుండి దక్షిణాన కర్ణాటక వరకు, ఒడిశా, ఉత్తరాఖండ్‌లలో ఎక్కువగా జరిగాయి. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ వంటి అనేక రాష్ట్ర అధికారులు ముస్లింలపై ద్వేషాన్ని వెదజల్లడంలో చురుకుగా పాల్గొన్నారు. ఇక తెలంగాణాలోని హైదరాబాద్, మత సామరస్యం, గంగా-జముని తెహజీబ్ సంప్రదాయానికి చాలా కాలంగా ప్రసిద్ధి […]
Read more

‘మోదీ, షా కుట్ర పన్నారు…లిక్కర్ పాలసీ క్లీన్ చిట్ తర్వాత కేజ్రీవాల్!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం స్కామ్‌ కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌కు క్లీన్‌చిట్‌ లభించింది. ఆయనతో మనీష్‌ సిసోడియాకు సైతం ఢిల్లీ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కోర్టు వెలుపల కేజ్రీవాల్‌ కన్నీటిపర్యంతమయ్యారు. కోర్టు తీర్పు అనంతరం మాట్లాడుతూ… తాను అవినీతిపరుడిని కాదని, సిసోడియా, తాము ఇద్దరం కూడా నిజాయితీ పరులమని కోర్టు వెల్లడించిందని అన్నారు. ఆప్‌ పార్టీ నిజాయితీ కలిగిన పార్టీ అని స్పష్టం చేశారు. తమపై ప్రధాని […]
Read more

గాజాలో కాల్పుల విరమణ… అయినా ‘ఎల్లో లైన్’ వద్ద పౌరులను చంపుతున్న ఇజ్రాయెల్!

గాజా: కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని ‘ఎల్లో లైన్’ (buffer zone) వెంబడి పాలస్తీనా పౌరులను చంపుతూనే ఉంది. ఫలితంగా గాజాలోని ఓ కుటుంబం ఇఫ్తార్ సమయంలో ఉత్తర గాజాలో ఇజ్రాయెల్ బుల్లెట్‌తో మరణించిన వారి తల్లి లేకుండానే ఉపవాస విరమణ చేయాల్సి వచ్చింది. బాస్మా బనాత్ ప్రతిరోజూ చేసినట్లుగానే ఆదివారం ఉదయం పని కోసం బీట్ లాహియాలోని తన ఇంటి నుండి బయలుదేరింది. ఈసారి, పట్టణానికి తూర్పున ఉన్న ఇజ్రాయెల్ సైనిక […]
Read more

ఫీజు నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు రద్దు!

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు ఫీజుల పెంపుపై ఫిర్యాదులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఫీజు నిబంధనలను ఉల్లంఘిస్తూ, ఎక్కువ డబ్బు వసూలు చేసే ప్రైవేట్ పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంతేకాదు ఎక్కువగా వసూలు చేసిన మొత్తాన్ని రికవరీ చేయాలని పేర్కొన్నారు. ఈమేరకు జరిగిన సమీక్షా సమావేశంలో, విద్యా మంత్రి కూడా అయిన సీఎం, ఈ విషయంపై తల్లిదండ్రులు ఫిర్యాదులు లేదా సూచనలను సమర్పించడానికి వీలుగా ఆన్‌లైన్ యంత్రాంగాన్ని రూపొందించాలని […]
Read more

ఇజ్రాయెల్‌ పర్యటన నుంచి తిరిగొచ్చిన మోడీ!

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌లో తన రెండు రోజుల చారిత్రాత్మక పర్యటనను ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చారు. ఈ పర్యటన సందర్భంగా భారతదేశం,ఇజ్రాయెల్ తమ ద్వైపాక్షిక సంబంధాన్ని పెంచుకున్నాయి. వాణిజ్యం, సాంకేతికత, సైబర్ భద్రత, రక్షణ, కీలకమైన అభివృద్ధి చెందుతున్న రంగాలలో సహకారం వంటి 17 ఒప్పందాలపై సంతకం చేశాయి. సాంకేతికతల బదిలీ ఫ్రేమ్ వర్క్ ద్వారా మిలిటరీ హార్డ్వేర్ సంయుక్త అభివృద్ధి, ఉత్పత్తి చేపడుతూ.. తమ మధ్య ఇప్పటికే ఉన్న సన్నిహిత రక్షణ భాగస్వామ్యాన్ని […]
Read more

‘కునో’ పార్క్‌లో చిరుత పులుల ఆహార ఖర్చుపై రాజకీయ దుమారం!

భోపాల్: మూడేండ్ల క్రితం మధ్యప్రదేశ్ లోని కూనో నేషనల్ పార్కుకు తీసుకువచ్చిన చీతాల సంరక్షణ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. చిరుతలకు ఆహారంగా మేక మాంసం కోసం ప్రతిరోజూ సుమారు రూ.35,000 ఖర్చు చేస్తున్నారని మధ్యప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో వెల్లడించింది. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చీతా కింద ఆహార ఖర్చుల గురించి ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ముఖేష్ మల్హోత్రా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ విభ్రాంతికర గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ […]
Read more

‘న్యాయవ్యవస్థ రక్తసిక్తమైంది’…NCERTపై మండిపడ్డ సుప్రీంకోర్టు!

న్యూఢిల్లీ: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అన్న అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈమేరకు 8వ తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకాన్ని పూర్తిగా నిషేధించాలని భారత సుప్రీంకోర్టు ఎన్‌సీఈఆర్‌టీ (NCERT)ని ఆదేశించింది. ఎక్స్‌ప్లోరింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్ (వాల్యూమ్ II) అనే పుస్తకంలో “మన సమాజంలో న్యాయవ్యవస్థ పాత్ర” అనే అధ్యాయం ఉంది, ఇది “న్యాయవ్యవస్థలోని వివిధ స్థాయిలలో అవినీతి”తో పాటు న్యాయమూర్తుల కొరత, […]
Read more

ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం–శంకరాచార్యకు మధ్య ఘర్షణ తీవ్రమైంది!

అఖిలేష్‌ త్రిపాఠి లక్నో: శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి చుట్టూ వివాదం తీవ్రమైంది, ఇది ఉత్తరప్రదేశ్‌లో పెద్ద రాజకీయ గందరగోళానికి దారితీసింది. కోర్టు ఆదేశాల మేరకు, పోక్సో చట్టం కింద లైంగిక వేధింపుల కేసులో ఆయనపై ఇప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఫిర్యాదుదారుడు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని షామ్లి జిల్లాకు చెందిన స్వయం ప్రకటిత సాధువు కావడం గమనార్హం. ఈ సమస్య రాష్ట్రంలో పూర్తి స్థాయి రాజకీయ ఘర్షణగా మారింది. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మాఘమేళా సందర్భంగా ఈ వివాదం […]
Read more

‘షాలోమ్, నమస్తే’ అంటూ నెతన్యాహును ఆలింగనం చేసుకున్న మోడీ!

టెల్‌అవీవ్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆ దేశ పార్లమెంట్‌ నెస్సెట్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత హిందూ జాతీయవాద నాయకుడు మోడీ, గాజాలో జరిగిన మారణహోమం, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్‌ అక్రమ విస్తరణలపై ప్రపంచవ్యాప్తంగా ఒక బహిష్కృతుడిగా పరిగణిస్తున్న ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించడం గమనార్హం. మోడీ ఇజ్రాయెల్ పర్యటన, పార్లమెంటు ప్రసంగం రెండూ ఇజ్రాయెల్ నాయకులకు, ముఖ్యంగా ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుకు పునరావాసం కల్పించడానికి, […]
Read more
1 8 9 10 11 12 159

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.