Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

తెలంగాణలో భారీ వర్షాలు… కొనుగోలు కేంద్రాల్లో దెబ్బతిన్న వరి!

హైదరాబాద్: ఉత్తర తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వడగళ్లు, బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. అకాల వర్షం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొనుగోలు కేంద్రాల్లో వరి, మొక్కజొన్న దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ఈ నష్టం ఎక్కువగా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈదురు గాలులు, వడగళ్ల వానతో పలు పంటలు నేలపాలు అయ్యాయి. ములుగు జిల్లాలో శివపురం, ఏటూరునాగారం మండలాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. జగిత్యాల జిల్లాలోని […]
Read more

త్రిభాష ఫార్ములా అమలు చేయనందుకు ఆగిపోయిన నిధులు…సుప్రీంకోర్టు మెట్లెక్కిన తమిళనాడు!

న్యూఢిల్లీ: కేంద్రం, తమిళనాడు మధ్య భాషా వివాదంలో మరో సంచలనాత్మక మలుపు తిరిగింది. జాతీయ విద్యా విధానం అమలు చేయడం లేదన్న కారణంతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తమ రాష్ట్రానికి రావాల్సిన రూ.2,151 కోట్ల నిధులను నిలిపివేసిందని కోర్టుకు తెలిపింది. ఈ మేరకు ఎంకే స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. విద్యార్థులు ఇంగ్లీష్, ప్రాంతీయ భాషతో పాటు మూడవ భాషను నేర్చుకునే త్రిభాషా సూత్రాన్ని సిఫార్సు చేసే జాతీయ విద్యా విధానాన్ని డిఎంకె […]
Read more

బీజేపీ ఐటీ సెల్ చీఫ్, జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిపై ఎఫ్ఐఆర్ నమోదు!

బెంగళూరు: బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా, రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామిపై తప్పుడు సమాచారం అందించారనే ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 192 (అల్లర్లకు కారణమయ్యే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం), 352 (శాంతిని ఉల్లంఘించడానికి ఉద్దేశపూర్వకంగా అవమానించడం) కింద ఇండియన్ యూత్ కాంగ్రెస్ లీగల్ సెల్ హెడ్ శ్రీకాంత్ స్వరూప్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంగళవారం హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు […]
Read more

కన్నడ రచయిత్రి ‘బాను ముష్తాక్’కు ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్‌!

లండన్: రచయిత్రి, సామాజిక కార్యకర్త, న్యాయవాది బాను ముష్తాక్ ప్రతిష్టాత్మకమైన బుకర్‌ ప్రైజ్‌ను గెలుచుకున్నారు. ఈ అవార్డును గెలుచుకున్న మొదటి కన్నడ రచయిత్రి ఆమె. “హార్ట్ ల్యాంప్” అనే కథా సంకలనానికి ఈ అవార్డును అందుకున్నారు. మంగళవారం లండన్ లో అవార్డును ప్రకటించారు. ఈ బహుమతితో పాటు…. 50 వేల పౌండ్లను ప్రైజ్ మనీగా అందిస్తారు. బాను ముష్తాక్, దీపా భస్తి ప్రైజ్ మనీని సమానంగా పంచుకోనున్నారు . ముష్తాక్ తన విజయాన్ని వైవిధ్యానికి విజయంగా అభివర్ణించారు, […]
Read more

భారతదేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందిన మిజోరం!

ఐజ్వాల్‌ : దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా మిజోరాం నిలిచింది. ఈమేరకు మిజోరాం యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సమక్షంలో మిజోరాం ముఖ్యమంత్రి లాల్‌దుహోమా పూర్తి అక్షరాస్యత రాష్ట్రంగా ప్రకటించారు. ప్రస్తుతం మిజోరం అక్షరాస్యత 98.2 శాతంగా ఉంది. కాగా ఏ రాష్ట్రమైనా 95% బెంచ్ మార్కును సాధిస్తే సంపూర్ణ అక్షరాస్యత సాధించినట్లుగా గుర్తిస్తారు. సమిష్టి కృషి, అంకితభావం, సమాజ సమీకరణ ఫలితంగా మిజోరం పూర్తి అక్షరాస్యత […]
Read more

గుజరాత్ రాజధానిలో వేలాది ఇళ్లు కూల్చివేత…’అమానవీయ’ చర్యను ఖండించిన ముస్లిం సంస్థలు!

గాంధీనగర్‌ : అహ్మదాబాద్‌లో అక్రమ నిర్మాణాల పేరిట అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ వేలాది ముస్లింల ఇళ్లను లక్ష్యంగా చేసుకొని పెద్ద ఎత్తున కూల్చివేత డ్రైవ్‌ను ప్రారంభించింది. మొత్తం ఏడువేలకు పైగా నిర్మాణాలను కూల్చివేయాలని నిర్ణయించారు. కూల్చివేతను సజావుగా, సమర్ధవంతంగా నిర్వహించడానికి 75 బుల్డోజర్లు, 150 డంపర్లను మోహరించారు. కూల్చివేతల సమయంలో శాంతిభద్రతలను కాపాడటానికి ఏకంగా 8,000 మంది సిబ్బందితో కూడిన భారీ పోలీసు బలగాలను మోహరించారు. మానవ హక్కుల సంఘాలు, మైనారిటీ సంస్థల నుండి తీవ్ర విమర్శలు […]
Read more

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అవకతవకలు….కేసీఆర్‌కు సమన్లు!

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న జ్యుడీషియల్ కమిషన్ విచారణలో భాగంగా తన ముందు హాజరు కావాలని బిఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు సమన్లు ​​జారీ చేసింది. నోటీసులు అందాయని బిఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ప్రాజెక్టు బ్యారేజీలకు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తున్న కమిషన్, బిఆర్ఎస్ ఎమ్మెల్యే టి హరీష్ రావు, ప్రస్తుత బిజెపి ఎంపి ఈటల రాజేందర్‌లకు కూడా నోటీసులు జారీ చేసి, వచ్చే నెలలో హాజరు కావాలని ఆదేశించినట్లు […]
Read more

మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రిపై సిట్‌ ఏర్పాటు…ఆయన రాజీనామాను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నిరసనలు!

లక్నో: మహిళా సైనికాధికారి కల్నల్ సోఫియా ఖురేషిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాను తొలగించాలని బీజేపీపై ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ, సుప్రీంకోర్టు సోమవారం ఆయన అరెస్టును నిలిపివేసింది. ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మరోవంక మంత్రికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం ప్రారంభించిన రాష్ట్ర కాంగ్రెస్, గత కొన్ని రోజులుగా ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. అదేసమయంలో పస్మాండ ముస్లిం సమాజం తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, […]
Read more

అశోక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అరెస్టును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించనున్న సుప్రీంకోర్టు!

న్యూఢిల్లీ : ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన సోషల్ మీడియా పోస్టులపై అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ అశోక విశ్వవిద్యాలయం రాజకీయ శాస్త్ర విభాగాధిపతి అలీ ఖాన్ మహ్మదాబాద్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. అసోసియేట్ ప్రొఫెసర్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం, మంగళవారం లేదా బుధవారం ఈ పిటిషన్లను విచారణకు తీసుకుంటామని తెలిపింది. […]
Read more

ఇందిరమ్మ పథకం కింద ఇరవైవేలకుపై ఇళ్ల నిర్మాణం జరుగుతోంది…మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి!

హైదరాబాద్: ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం కింద 20,104 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. “పైలట్ ప్రాజెక్ట్ కింద, 47,335 ఇందిరమ్మ ఇళ్లకు మంజూరు చేశారు. ఇప్పటివరకు, 5140 ఇళ్లకు బేస్‌మెంట్లు, 300 ఇళ్లకు గోడలు, మరో పది ఇళ్లకు స్లాబ్‌లు వేసారని” ఆయన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రతి సోమవారం ఎటువంటి ఆలస్యం లేకుండా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నిధులను క్రమం తప్పకుండా […]
Read more
1 105 106 107 108 109 143

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.