Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఉందనే ట్రంప్ వాదనలను తిరస్కరించిన మోడీ ప్రభుత్వం!

న్యూఢిల్లీ : ‘భారత్‌ – పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు అమెరికా మధ్యవర్తిత్వం, అణు సంఘర్షణను ముందస్తుగా నివారించడం గురించి ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను మోడీ ప్రభుత్వం తోసిపుచ్చింది. కాశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహించాలనే ట్రంప్‌ ప్రతిపాదనను కూడా నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. దక్షిణాసియాలో అణు యుద్ధాన్ని నివారించాలన్న ట్రంప్ పదే పదే చేసిన వాదనలను తోసిపుచ్చిన భారతదేశం, పాకిస్తాన్ దూకుడు దాడులకు ప్రతిస్పందనగా తన సాయుధ దళాలు తీసుకునే అన్ని సైనిక చర్యలు “సంప్రదాయ యుద్ధం” పరిధిలోకి […]
Read more

నేడు భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ బిఆర్ గవాయ్!

న్యూఢిల్లీ : జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నేడు 52వ భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ)గా ప్రమాణ స్వీకారం చేశారు, షెడ్యూల్డ్ కులాల నుండి దేశంలోని అత్యున్నత న్యాయ పదవికి అధిరోహించిన మొదటి బౌద్ధుడు కావడం గమనార్హం. అంతేకాదు దళిత సామాజికవర్గం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన రెండో వ్యక్తి జస్టిస్ గవాయ్, ఆయన కంటే ముందు మాజీ సీజేఐ కేజీ బాలకృష్ణన్ 2007లో తొలి దళిత సీజేఐ అయ్యారు. జస్టిస్ గవాయ్ ఈ ఏడాది […]
Read more

కల్నల్ సోఫియా ఖురేషిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్‌ మంత్రి… రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్!

న్యూఢిల్లీ : భారత సైన్యాధికారి కల్నల్ సోఫియా ఖురేషి గురించి మధ్యప్రదేశ్‌ గిరిజన సంక్షేమశాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇండోర్‌లోని అంబేద్కర్ నగర్ (మోవ్)లోని రాయుకుండా గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ… ‘వాళ్లు (ఉగ్రవాదులు) మన సోదరీమణులు, ఆడకూతుళ్ల సిందూరం తుడిచేసి పారిపోయారు. వారి సొంత సోదరినే వాళ్లకు గట్టి సమాధానం చెప్పమని మనం పంపాం” అని మంత్రి విజయ్ షా వివాదాస్పద ప్రకటన చేశారు. https://fb.watch/zzf87QuWGi/? ఇటీవలి భారత సైనిక మిషన్ […]
Read more

గల్ఫ్ పర్యటనలో డొనాల్డ్ ట్రంప్…$600 బిలియన్‌ల పెట్టుబడికి హామీ ఇచ్చిన సౌదీ!

రియాద్‌ : అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ గల్ఫ్‌ పర్యటనకు విచ్చేశారు. ట్రంప్‌ రెండోసారి అధికారం చేపట్టాక చేసిన తొలి పర్యటన ఇదే కావడం గమనార్హం. ఎయిర్ ఫోర్స్ వన్ నుండి బయటకు వచ్చిన ట్రంప్‌కు, ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ స్వాగతం పలికారు, సౌదీ అరేబియాలో రెడ్ కార్పెట్ స్వాగతం అందుకున్నారు. ట్రంప్ గల్ఫ్ పర్యటనలో ప్రధానంగా వ్యాపార ఒప్పందాలపై దృష్టి పెట్టారు. తరువాత ఆయన రియాద్‌లో అధ్యక్షుడితో ఇంధనం, రక్షణ, మైనింగ్, ఇతర రంగాలపై ఒక […]
Read more

పహల్గామ్ దాడి అనంతరం 184 ద్వేషపూరిత నేరాల నమోదు!

న్యూఢిల్లీ : పహల్గామ్ ఉగ్ర దాడి భారతీయ ముస్లింలు, కాశ్మీరీలపై ద్వేషపూరిత నేరాల నెత్తుటి జాడను మిగిల్చింది. 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఈ విషాదఘటన తరువాత ఏప్రిల్ 22 నుండి మే 8 వరకు దేశవ్యాప్తంగా 184 ద్వేషపూరిత నేరాల కేసులు నమోదయ్యాయని పౌర హక్కుల రక్షణ సంఘం (APCR) ఇటీవలి నివేదికలో వెల్లడించింది.. ఈ సంఘటనలలో 84 ద్వేషపూరిత ప్రసంగం కేసులు, 39 దాడులు, 19 విధ్వంసక చర్యలు, మూడు హత్యలు ఉన్నాయి. […]
Read more

“పాకిస్తాన్ ఒక దేశంగా మనుగడ సాగించాలనుకుంటే…” ఇస్లామాబాద్‌కు ప్రధాని మోదీ అల్టిమేటం!

న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్తాన్‌ ఉగ్ర దాడిపై భారతదేశం ప్రతిస్పందన…కాల్పుల విరమణ అనంతరం దేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ ముగియలేదు, దానిని నిలిపివేసామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు పాకిస్తాన్‌కు స్పష్టమైన హెచ్చరిక చేశారు. “దాడులు ముగియలేదని పాకిస్తాన్ తెలుసుకోవాలి, ఉగ్రవాదులు, ఉగ్రవాద స్థావరాలపై చర్యలు తీసుకుంటామని పాకిస్తాన్ హామీ ఇచ్చిన తర్వాత మాత్రమే వాటిని నిలిపివేశారు” అని ప్రధానమంత్రి అన్నారు, “రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఎలాంటి వైఖరిని అనుసరిస్తుందనే […]
Read more

ఒత్తిడిలో మోడీ ప్రభుత్వం…కాల్పుల విరమణ నిర్ణయంపై పెరుగుతున్న ప్రశ్నలు!

ముంబయి : బలమైన నాయకత్వం, ’56 అంగుళాల ఛాతీ’ఉన్న వ్యక్తిగా చెప్పుకునే మోడీ ప్రభుత్వం, ఆకస్మికంగా కాల్పుల విరమణ ప్రకటించడంపై తీవ్ర రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మొన్నటి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని శక్తివంతమైన జాతీయవాద నాయకుడిగా చిత్రీకరించారు, కానీ ఇటీవలి పరిణామాలు అతని నాయకత్వం, నిర్ణయం తీసుకునే తీరుపై సందేహాల తరంగాన్ని రేకెత్తించాయి. గతంలో దేశభక్తితో మునిగిపోయిన మీడియా సంస్థలు, ఇప్పుడు ప్రభుత్వ వైఖరిలో ఊహించని మార్పుపై పదునైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. కొద్ది రోజుల క్రితం, […]
Read more

ఢిల్లీలోని ఓఖ్లాలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశం…జామియా నగర్‌లో భయం…భయం!

న్యూఢిల్లీ : ఓఖ్లా గ్రామంలోని ఖాస్రా నంబర్ 279లో నాలుగు బిగాలకు పైగా ప్రభుత్వ భూమిలో నిర్మితమైన అనధికార నిర్మాణాలను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఢిల్లీ లోని జామియా నగర్‌లో మళ్లీ ఆందోళన మొదలైంది. ఇటీవల తైమూర్ నగర్, ఖిజ్రాబాద్ ప్రాంతంలో కూల్చివేతలు చేపట్టిన కొద్ది రోజులకే ఈ ఉత్తర్వు వచ్చింది. ఈ ప్రాంతంలో బుల్డోజర్లు 100కు పైగా ఇళ్లను కూల్చివేసి నివాసితులలో ఆందోళనను తీవ్రతరం చేశాయి. జస్టిస్ అభయ్ ఎస్. ఓకా, జస్టిస్ ఉజ్జల్ […]
Read more

హైదరాబాద్‌లో ఘనంగా ముగిసిన టొమాటో ఫెస్టివల్!

హైదరాబాద్ : మనదేశంలోనే మొట్టమొదటి టమాటో పెస్టివల్‌కు హైదరాబాద్‌ వేదికగా నిలిచింది. జిందగీ నా మిలేగీ దుబారా నుండి వచ్చిన “లా టొమాటినా” క్షణాన్ని మీరు ఎప్పుడైనా అనుభవించాలని కలలుగన్నట్లయితే అది నిజమైంది! నిన్న టోమా టెర్రా ఎక్స్‌పీరియం ఎకో పార్క్‌లో ఈ వేడుక ఘనంగా ప్రారంభం అయింది. హదరాబాదీలు టమోటా పిచ్చిలో మునిగిపోయారు. స్పెయిన్‌లో ప్రతి ఏటా జరిగే ఐకానిక్ లా టమాటినా స్ఫూర్తితో ఈ ఈవెంట్‌ను నిర్వహించారు. అయితే హైదరాబాద్ వెర్షన్ మ్యూజిక్‌, డాన్స్‌, […]
Read more

జాతి విధ్వంస యుద్ధం కొనసాగిస్తున్న ఇజ్రాయెల్…గాజాలో 52,800 దాటిన మరణాల సంఖ్య!

టెల్‌ అవీవ్‌ : ఏడాదిన్నరగా కొనసాగుతున్న యుద్ధం వల్ల గాజాలో మరణాల సంఖ్య 53 వేలకు చేరువైంది. 2023 అక్టోబర్ నుండి గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న జాతి విధ్వంస యుద్ధంలో కనీసం 52,810 మంది పాలస్తీనియన్లు మరణించారని స్ట్రిప్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో ఎన్‌క్లేవ్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో 23 మంది మరణించగా, మరో 124 మంది గాయపడ్డారని, ఇజ్రాయెల్ దాడిలో గాయపడిన వారి సంఖ్య 119,473 కు చేరుకుందని మంత్రిత్వ శాఖ […]
Read more
1 108 109 110 111 112 143

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.