Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

‘నా సిందూర్‌ను నాకు తిరిగి ఇవ్వండి’…పాకిస్తాన్ బందీగా ఉన్న బీఎస్‌ఎఫ్‌ జవాన్ కుటుంబానికి కాల్పుల విరమణతో ఉపశమనం దక్కలేదు!

రిష్రా (పశ్చిమ బెంగాల్): సరిహద్దు భద్రతా దళం (BSF) జవాన్ పూర్ణమ్ సౌ పాకిస్తాన్ దళాలు బంధించిన పద్దెనిమిది రోజులు దాటింది. కాల్పుల విరమణ ప్రకటన తర్వాత దాదాపు 24 గంటల తర్వాత కూడా 34 ఏళ్ల సైనికుడు ఇంకా పాక్‌ సైనిక నిర్బంధంలో ఉండటం గమనార్హం. భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతలు ఆగిపోయాయి. దౌత్య ప్రయత్నాలు నెమ్మదిగా పురోగతిలో పడ్డంతో పశ్చిమ బెంగాల్‌లోని రిష్రాలో అతని కుటుంబం ఆశను నిలుపుకుంది. ఫిరోజ్‌పూర్‌లోని BSF 24వ బెటాలియన్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్న […]
Read more

కశ్మీర్‌పై అమెరికా మధ్యవర్తిత్వ పాత్ర…ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్!

న్యూఢిల్లీ : కశ్మీర్‌ వివాద పరిష్కారానికి తాను భారత్‌, పాకిస్థాన్‌తో కలిసి పనిచేస్తానంటూ నిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనను విపక్షాలు తీవ్రంగా పరిగణించాయి. కాశ్మీర్‌పై మూడవ పక్షం మధ్యవర్తిత్వాన్ని అంగీకరించిందా లేదా అనే దానిపై ప్రభుత్వం సమాధానాలు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ అంశాన్ని “అంతర్జాతీయీకరించడానికి”, రెండు దేశాలను “హైఫనేట్” చేయడానికి చేసిన ప్రయత్నాలను ఖండించింది. AICC ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ […]
Read more

ఉగ్రవాద నిరోధక చట్టం కింద అవామీ లీగ్‌ను నిషేధించిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం!

న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం దేశ బహిష్కృత మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా నేతృత్వంలోని రాజకీయ పార్టీ అవామీ లీగ్ కార్యకలాపాలను నిషేధించింది. ఈ మేరకు అధికార యూనస్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. హసీనా పార్టీపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది బంగ్లాదేశ్ ప్రజలు యూనస్ నివాసం వెలుపల ర్యాలీ చేసిన ఒక రోజు తర్వాత ఈ నిషేధం ప్రకటన వచ్చింది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద అవామీ లీగ్‌ను […]
Read more

గతంలో సేకరించిన వరిని మిల్లర్లు పట్టించుకోకపోవడంతో రాష్ట్రానికి 510 కోట్ల నష్టం!

వనపర్తి : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎక్కువగా పండించే వరిని మిల్లర్లు పట్టించుకోకుండా వదిలేసారు. దానిని ఇంకా ప్రభుత్వానికి తిరిగి ఇవ్వలేదు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.510 కోట్ల రూపాయల నష్టం వాటిల్లనుంది. గత ప్రభుత్వం 2022–2023 రబీ సీజన్‌లో జిల్లా అంతటా 111 మంది మిల్లర్లకు 222,437.461 మెట్రిక్ టన్నుల వరిని కేటాయించారు. ఇందులో 5,586.904 మిలియన్ టన్నులు మాత్రమే ప్రభుత్వానికి తిరిగి ఇచ్చారు. ఇంకా 216,850.557 మిలియన్ టన్నులు ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సి ఉంది. […]
Read more

సరిహద్దు రాష్ట్రాల్లోని తెలంగాణ వాసుల కోసం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం!

హైదరాబాద్ : భారత్‌, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న దృష్ట్యా…సరిహద్దు రాష్ట్రాలలో ఉంటున్న తెలంగాణ వాసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఆపదలో ఉన్న స్థానికులకు నిరంతరాయంగా సహాయం అందించడానికి తెలంగాణ ప్రభుత్వ కంట్రోల్ రూమ్ 24 గంటలూ పనిచేస్తుంది. ఈమేరకు తెలంగాణ భవన్‌లోని ఈ నంబర్‌లను సంప్రదించవచ్చు: ల్యాండ్‌లైన్ నంబర్‌: 011-23380556వందన, రెసిడెంట్ కమిషనర్ ప్రైవేట్ సెక్రటరీ అండ్‌ లైజన్ హెడ్ – 9871999044హైదర్ అలీ నఖ్వీ, […]
Read more

పాకిస్తాన్‌కు ఐఎంఫ్ బెయిలౌట్‌పై ఓటింగ్‌కు దూరంగా ఉన్న మోదీ ప్రభుత్వం… కేంద్రంపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్‌!

న్యూఢిల్లీ : పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) అందించే బెయిలౌట్‌పై మోదీ ప్రభుత్వం ఓటింగ్‌కు దూరంగా ఉండటాన్ని కాంగ్రెస్‌ ఆక్షేపించింది. అలా కాకుండా దీనిని”బలంగా తిరస్కరించి ఉంటే” శక్తివంతమైన సంకేతాన్ని పంపి ఉండేదని విపక్ష పార్టీ పేర్కొంది. ఏప్రిల్ 29న జరిగిన బహుపాక్షిక సంస్థ కార్యనిర్వాహక బోర్డు సమావేశంలో IMF 1.3 బిలియన్ల రుణ ప్రతిపాదనను భారతదేశం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని కాంగ్రెస్ ఆశించినట్లు పార్టీ తెలిపింది. “ఏప్రిల్ 29న, INC పాకిస్తాన్‌కు IMF రుణాన్ని భారతదేశం […]
Read more

భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు…మీడియా సంస్థలను హెచ్చరించిన ప్రభుత్వం!

న్యూఢిల్లీ : భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో జాతీయ భద్రత దృష్ట్యా రక్షణ, భద్రతా దళాల కదిలికలకు సంబంధించిన ఎటువంటి లైవ్ ప్రసారం చేయకూడదని ఆయా మీడీయా సంస్థలకు భారత ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. వార్తా సంస్థలు, డిజిటల్ ప్లాట్ ఫాంలు, టీవీ నెట్ వర్క్ లు, సోషల్ మీడియా వినియోగదారులు అందరికి ఈ హెచ్చరికలు వర్తిస్తాయని తెలిపింది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సూచనల ప్రకారం, కవరేజీని నిలిపివేయాలని ఆయా మీడియా […]
Read more

హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీలు…మనకు గర్వకారణమా?సంస్కరణకు సమయమా!

పాఠకులారా, మే 31న హైదరాబాద్ మిస్ వరల్డ్ 2025 పోటీలకు ఆతిథ్యం ఇవ్వబోతోందనే వార్త మీరు వినే ఉంటారు. ఒకప్పుడు సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు అయిన ఈ చారిత్రాత్మక నగరం ఇప్పుడు ప్రపంచ అందాల పోటీకి వేదికగా మారడానికి సిద్ధమవుతోంది. సమాజంలోని అనేక వర్గాలు ఈ కార్యక్రమాన్ని గర్వంగా చెప్పుకోవడమే కాదు ప్రచారం కూడా చేస్తున్నాయి. కానీ ఈ కథనం చదివిన తర్వాత, మీరే నిర్ణయించుకోవాలి: ఇది నిజంగా మనకు గర్వకారణమా, లేదా ఆందోళనకు ప్రతిబింబమా? ఇది […]
Read more

మదీనాగూడలో భారీ అగ్నిప్రమాదం…3 దుకాణాలు దగ్ధం!

హైదరాబాద్ : మదీనాగూడలో నిన్న సాయంత్రం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మూడు దుకాణాలు బూడిదయ్యాయి. ఈ అగ్నిప్రమాదం స్థానికులు, దుకాణదారులలో భయాందోళనలను రేకెత్తించింది, వాణిజ్య సంస్థలను మంటలు చుట్టుముట్టడంతో దట్టమైన పొగ ఆకాశంలోకి ఎగసిపడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడానికి చర్యలు చేపట్టారు. సెంట్రో ఫుట్‌వేర్ centro foot wearదుకాణాలు దగ్ధం అయ్యాయి. భారీగా మంటలు వ్యాపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అక్కడ దట్టమైన పొగ కమ్ముకోవడంతో వాహనదారులు […]
Read more

ములుగు జిల్లాలో ఐఈడీని పేల్చిన మావోయిస్టులు…ముగ్గురు గ్రేహౌండ్స్‌ కమాండోలు మృతి!

హైదరాబాద్ : తెలంగాణలోని ములుగు జిల్లాలో గురువారం మావోయిస్టులు జరిపిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) పేలుడులో ముగ్గురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వాజేడు-వెంకటాపురం మండలాల్లోని కర్రెగుట్ట కొండల సమీపంలోని వీరభద్రపురం-పేరూర్ అటవీ ప్రాంతాల్లో తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు నిర్వహిస్తున్న సాధారణ కూంబింగ్ ఆపరేషన్ల సమయంలో ఈ దాడి జరిగింది. రాష్ట్ర పోలీసు శాఖ వర్గాల సమాచారం ప్రకారం, పేలుడులో దాదాపు పది మంది భద్రతా సిబ్బంది గాయపడగా, ముగ్గురు మరణించారు. “నిషేధిత సిపిఐ (మావోయిస్ట్) […]
Read more
1 109 110 111 112 113 143

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.