Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించడానికి సమావేశం కానున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు!

హైదరాబాద్: బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదం కొనసాగుతున్న వేళ..దీనికి సంబంధించి తెలంగాణను నష్టపరిచే ప్రతిపాదన ఏదీ తీసుకోబోమని కేంద్ర జలశక్తి మంత్రి CR పాటిల్ హామీ ఇచ్చారు. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను చర్చలకు ఆహ్వానించారు. ఈమేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల మంత్రి N ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఢిల్లీలో మంత్రి CR పాటిల్‌ను కలిసింది, PBLPకి పర్యావరణ అనుమతులు, నిధులను పొందడంలో ఏపీ […]
Read more

ఇరాన్‌కు సంఘీభావం ప్రకటించిన ఎస్‌ఐఓ…ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ విద్యార్థుల భద్రతపై విజ్ఞప్తి!

హైదరాబాద్: స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (SIO), తెలంగాణ జోన్, ఇటీవలి ఇజ్రాయేల్ దాడుల వల్ల ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ ప్రజల పట్ల తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచింది. ఈ సందర్భంగా, SIO ప్రధాన కార్యదర్శి అడ్వొకేట్ అనీస్ ఉర్ రెహ్మాన్, రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ఫరాజ్ అహ్మద్, కార్యదర్శి మొహమ్మద్ హమ్మాద్దుద్దీన్, మిగతా బృందం ఇరాన్ కాన్సుల్ జనరల్ మహ్దీ షారోఖీని కలసి తమ సంఘీభావం వ్యక్తపరిచారు. ఈ విషాద పరిస్థితిలో ప్రాణాలు కోల్పోయిన […]
Read more

మణిపూర్‌లో తమ వర్గానికి చెందిన నిరాశ్రయులను మూడవ వర్గంగా గుర్తించాలని కోరిన థాడౌ తెగ!

ఇంఫాల్/న్యూఢిల్లీ: మణిపూర్‌లో అంతర్గతంగా నిరాశ్రయులైన వ్యక్తుల (IDPలు) మూడవ వర్గంగా గుర్తించాలని థాడౌ తెగకు చెందిన ఒక ఉన్నత సంస్థ కోరింది. ఈమేరకు జస్టిస్ గీతా మిట్టల్ (రిటైర్డ్) కమిటీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు విజ్ఞప్తి చేసింది. కాగా, 2023 మే నెలలో మైటీ-కుకి జాతి ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం, రాష్ట్ర ప్రభుత్వం రెండు వర్గాల అంతర్గతంగా నిరాశ్రయులైన వ్యక్తుల (IDPలు)ను గుర్తిస్తుంది […]
Read more

హైదరాబాద్‌లో 6 లక్షల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం…10 మంది అరెస్టు!

హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. కమిషనర్ టాస్క్ ఫోర్స్, మాసబ్ ట్యాంక్ పోలీసులతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో గంజాయి హాష్ ఆయిల్, చరస్ వంటి మాదకద్రవ్యాల విక్రేతలు 10 మందిని అరెస్టు చేశారు. ఈ డ్రగ్స్‌ స్మగ్లర్స్‌ నుంచి పోలీసులు రూ.2.25 లక్షల విలువైన 375 మి.లీ హాష్ ఆయిల్ (75 పెట్టెలు), రూ.7,500 విలువైన 175 గ్రాముల డ్రై గంజాయి, రూ.2,000 విలువైన 3 గ్రాముల చరస్‌తో పాటు రెండు కత్తులు, 15 […]
Read more

ఇరాన్‌ను “లొంగిపోమన్న” అమెరికా… యుద్ధం ఇప్పుడే ప్రారంభమైందని ప్రతిస్పందించిన ఇరాన్‌!

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను “బేషరతుగా లొంగిపోమని” హెచ్చరిక జారీ చేసిన తర్వాత, ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ X ప్లాట్‌ఫామ్‌లో పర్షియన్ భాషలో “యుద్ధం ఇప్పుడే ప్రారంభమైందనే” సందేశాన్ని పోస్ట్ చేశారు. అధ్యక్షుడు ట్రంప్ ఉద్దేశ్యం ఏమిటంటే, ఇరాన్… యురేనియంను ఫ్యూరిఫై చేయడం వదులుకోవాలి, లేదంటే అమెరికా ఇజ్రాయెల్-ఇరాన్ వివాదంలో నేరుగా సైనికపరంగా పాల్గొనవచ్చనే సందేశాన్ని అన్యాపదేశంగా అమెరికా ఇచ్చినట్లైంది. ఖమేనీని “చంపాలని” తన ఉద్దేశం కాదని అమెరికా అధ్యక్షుడు […]
Read more

ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది దేశాల వద్ద అణ్వాయుధ సంపత్తి!

స్టాక్‌హోమ్: మరో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తున్న వేళ, వివిధ దేశాల మధ్య అణ్వాయుధ పోటీ తీవ్రమవుతోంది. తొలిసారి అణ్వస్త్రాలను ప్రయోగించి 80 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ప్రపంచ వ్యాప్తంగా అణ్వస్త్ర తయారీ పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. అణు బాంబులు మానవాళికి ఎంత నష్టం చేకూరుస్తాయో చెప్పడానికి హిరోషిమా, నాగసాకి సజీవ సాక్ష్యాలుగా మిగిలిపోయాయి. అణు దాడి ప్రభావం నుంచి ప్రజలు నేటికీ కోలుకోలేక పోయారు. అయినా అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలకు అణుబాంబులపై మోజు తీరలేదు. […]
Read more

రికార్డు సృష్టించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు…14 కోట్లు రికవరీ!

హైదరాబాద్: మన సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్‌లైన్‌ కేటుగాళ్ల పనిపట్టారు. దేశ వ్యాప్తంగా సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్‌ చేశారు. మార్చి నుంచి జూన్‌ మధ్య కాలంలో జరిగిన 74 సైబర్ క్రైమ్ కేసులకు సంబంధించి ఏడు రాష్ట్రాలలో మొత్తం 37 మందిని సైబర్ క్రైమ్ హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారివద్దనుంచి 14 కోట్లపై డబ్బును రివకరి చేశారు. కాగా, అరెస్టు అయిన వ్యక్తులకు దేశవ్యాప్తంగా 178 కేసుల్లో ప్రమేయం ఉంది. జనవరి 17న […]
Read more

“భారత్‌-కెనడా సంబంధాలు ప్రజాస్వామ్య విలువలను పెంచుతాయి”… G7లో ప్రధాని మోడీ!

న్యూఢిల్లీ: కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జీ-7 సమ్మిట్‌కు హాజయరయ్యారు. ఈరోజు ఆల్బెర్టాలో జరిగిన G7 సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కెనడా ప్రధాని మార్క్ కార్నీతో సమావేశం అయ్యారు. గత సంవత్సరం జస్టిన్ ట్రూడో ప్రభుత్వ హయాంలో క్షీణించిన సంబంధాలను తిరిగి గాడిలో పెట్టాలనే ఆశ వారి ద్వైపాక్షిక సమావేశం కలిగించింది. కాగా, కెనడా ప్రధాని కార్నీతో జరిగిన సమావేశంలో, ప్రధానమంత్రి మోడీ “భారతదేశం-కెనడా సంబంధాలు చాలా ముఖ్యమైనవి” […]
Read more

ముగ్గురు సభ్యులతో ‘గో సంరక్షణ కమిటీని’ ఏర్పాటు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి!

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో గో సంరక్షణ కోసం సమగ్ర విధానాన్ని రూపొందించడానికి ముగ్గురు సభ్యుల కమిటీని నియమించారు. ఈ కమిటీలో పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, ఎండోమెంట్స్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శైలజా రామయ్యర్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు ఉన్నారు. అధికారిక కమిటీ గోసంరక్షణ కేంద్రాల (గోశాలలు) ఏర్పాటుపై లోతైన అధ్యయనం చేస్తుంది. గోసంరక్షణ విధానాలను అధ్యయనం చేయడానికి ఇతర రాష్ట్రాలను కూడా సందర్శిస్తుంది. […]
Read more

ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడ ఉన్నారో అమెరికాకు ‘ఖచ్చితంగా’ తెలుసు…డోనాల్డ్‌ ట్రంప్‌!

వాషింగ్టన్: ఇరాన్ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో అమెరికాకు తెలుసు. కానీ, ప్రస్తుతానికి ఆయనను చంపాలని కోరుకోవడం లేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. సుప్రీం లీడర్” అనే వ్యక్తి ఎక్కడ దాక్కున్నాడో మాకు ఖచ్చితంగా తెలుసు. అతను సులభమైన లక్ష్యం, కానీ ఒకచోట సురక్షితంగా ఉన్నాడు – మేము అతన్ని బయటకు తీసుకెళ్లబోవడం లేదు (చంపడం లేదు!), అయితే అమెరికన్ సైనికులపై క్షిపణులు ప్రయోగించాలని మేము కోరుకోవడం లేదు. మా ఓపిక […]
Read more
1 110 111 112 113 114 159

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.