Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

మహిళా ఐఏఎస్ అధికారిని వేధిస్తున్న మంత్రి… బీఆర్ఎస్ ఆరోపణ!

హైదరాబాద్: తెలంగాణలో ఒక మంత్రి ప్రేమ పేరుతో ఒక మహిళా ఐఏఎస్ అధికారిణిని వేధిస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ ఘటన అత్యంత దారుణమని ఆయన అభివర్ణించారు. “పోలీస్ యంత్రాంగం ఎక్కడ ఉంది? పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తోంది? పలువురు క్యాబినెట్ మంత్రులు మహిళా అధికారులను వేధిస్తున్నారు. వారిపై కేసులు నమోదు చేయవద్దా? ఐఏఎస్ మహిళా అధికారులకే రక్షణ లేకపోతే, సాధారణ మహిళల పరిస్థితి ఏమిటి?” అని ప్రవీణ్ కుమార్ […]
Read more

మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న గౌరీ లంకేష్ హత్య కేసు నిందితుడు!

జల్నా: కర్ణాటకలో సంచలనం సృష్టించిన మహిళా జర్నలిస్ట్ గౌరి లంకేష్ హత్య కేసులో నిందితుడైన శ్రీకాంత్ పాంగర్కర్ మహారాష్ట్రలోని జల్నా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఈ ఎన్నికలు జనవరి 15న జరగనున్నాయి. ఆయన 13వ వార్డు నుంచి బరిలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థులుగా బీజేపీ, ఇతర పార్టీల అభ్యర్థులు ఉన్నారు. అయితే ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మాత్రం తమ అభ్యర్థిని నిలబెట్టలేదు. యాదృచ్ఛికంగా, నవంబర్ 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, […]
Read more

భారత్‌కు మరిన్ని ఇబ్బందులు?…రష్యా చమురు కొనే దేశాలపై 500% సుంకాల బిల్లుకు ట్రంప్‌ ఓకే!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా నుండి “తెలిసి” చమురు కొనుగోలు చేసే దేశాలను “శిక్షించడానికి” ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు పచ్చజెండా చూపారు. దీంతో భారతదేశం, చైనాపై వచ్చే వారం ప్రారంభంలోనే 500 శాతం వరకు సుంకాలు పెరగవచ్చు. ఈమేరకు రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం మాట్లాడుతూ… రష్యన్ యురేనియం కొనుగోలు చేసే దేశాలను కూడా ఈ చట్టంలో చేర్చడాన్ని అధ్యక్షుడు ఆమోదించారని, వచ్చే వారం ప్రారంభంలోనే దీనిని ఓటింగ్‌కు పెట్టవచ్చని అన్నారు. లిండ్సే గ్రాహం, […]
Read more

మనూ భూ వివాదం…ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ దాడి!

హైదరాబాద్: నగరంలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి కేటాయించిన 50 ఎకరాల భూమి నిరుపయోగంగా ఉండటంపై వివరణ కోరుతూ తెలంగాణ ప్రభుత్వం నోటీసు జారీ చేసింది. దీనిపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలతో పాటు యూనివర్సిటీ విద్యార్థుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. నోటీసు జారీ చేసినంత మాత్రాన ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకుంటుందని అర్థం కాదని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గత నెలలో రంగారెడ్డి జిల్లా […]
Read more

వెస్ట్ బ్యాంక్‌లోని పాలస్తీనా విశ్వవిద్యాలయంపై ఇజ్రాయెల్ దాడి, 11 మంది విద్యార్థులకు గాయాలు!

రమల్లా: ఇజ్రాయెల్ సైన్యం ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని బిర్జీట్ విశ్వవిద్యాలయంపై దాడికి పాల్పడింది. ఫలితంగా 11 మంది పాలస్తీనా విద్యార్థులు గాయపడ్డారు, వీరిలో ఐదుగురు తుపాకీ గాయాలయ్యాయి. అంతేకాదు సైనికులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగిస్తూ విశ్వవిద్యాలయంలోకి చొరబడ్డారు, దీని ఫలితంగా గ్యాస్ పీల్చడం వల్ల అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వార్తా సంస్థ WAFA ప్రకారం… పాలస్తీనా రెడ్ క్రెసెంట్ సొసైటీ మొత్తం గాయపడిన వారిలో ఐదుగురు తుపాకీ కాల్పులకు గురయ్యారు, నలుగురు గ్యాస్ […]
Read more

ఎస్ఐఆర్ కోసం బీజేపీ యాప్ వాడుతున్న ఈసీ…ఆరోపించిన మమత!

కోలకత: ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం బీజేపీ ఐటీ విభాగం అభివృద్ధి చేసిన యాప్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) వినియోగిస్తోందని బెంగాల్‌ సీం మమతా బెనర్జీ ఆరోపించారు. ఇది చట్టవిరుద్ధమని… అప్రజాస్వామికమని, రాజ్యాంగ విరుద్ధమని ఆమె వ్యాఖ్యానించారు. గంగాసాగర్ మేళా ఏర్పాట్లను సమీక్షించేందుకు దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సాగర్ ఐలాండ్‌లో రెండు రోజుల పర్యటన ముగిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. భారత ఎన్నికల సంఘం “అన్ని రకాల తప్పుడు చర్యలకు” పాల్పడుతోందని ఆరోపించారు. అర్హతగల ఓటర్లను […]
Read more

సంక్రాంతికి ఆరువేలకు పైగా ప్రత్యేక బస్సులను నడపనున్న తెలంగాణ ఆర్టీసీ!

హైదరాబాద్: సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) జనవరి 9 నుండి 13 వరకు 6,431 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. పండుగ సమయంలో రద్దీని ఎదుర్కొనేందుక, ఆర్టీసీ ప్రత్యేక బస్సుల నడపడానికి ప్రణాళిక వేసింది. సాధారణంగా తిరుగు ప్రయాణ రద్దీ పెరిగే జనవరి 18,19 తేదీలలో కూడా ఈ సేవలను పొడిగించనున్నారు. ఈ బస్సులు హైదరాబాద్‌లోని మహాత్మా గాంధీ బస్ స్టాప్ (ఎంజీబీఎస్), జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్), […]
Read more

జనవరి 19న దావోస్‌కు సీఎం…భారీ పెట్టుబడులపై ఆశలు పెట్టుకున్న తెలంగాణ!

హైదరాబాద్: తెలంగాణకు భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 19న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సమావేశానికి హాజరయ్యేందుకు దావోస్‌లో పర్యటించనున్నారు. ఆరు రోజుల పర్యటనలో సీఎం…రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న తెలంగాణ పెవిలియన్‌లో ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. అలాగే ఇటీవల విడుదల చేసిన ‘తెలంగాణ రైజింగ్ -2047’ విజన్ డాక్యుమెంట్‌ను ప్రపంచ ఆర్థిక వేదికలో ప్రదర్శించనున్నారు. ఈమేరకు “ఐటీ, పరిశ్రమల విభాగాలు దావోస్‌లో ఉండే అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఈ […]
Read more

ఢిల్లీలో కూల్చివేత డ్రైవ్ సందర్భంగా పోలీసులపై రాళ్ల దాడి…ఐదుగురికి గాయాలు!

న్యూఢిల్లీ: ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ సమీపంలో ఒక మసీదు వద్ద ఈరోజు తెల్లవారుజామున ఆక్రమణల తొలగింపు డ్రైవ్ హింసాత్మకంగా మారడంతో కనీసం ఐదుగురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన సుమారు 300 మంది అధికారులు, కార్మికులు తుర్క్‌మన్ గేట్ వద్ద ఉన్న సయ్యద్ ఫైజ్ ఇలాహీ మసీదు,శ్మశానవాటికకు ఆనుకుని ఉన్న భూమిలో కూల్చివేత డ్రైవ్ నిర్వహిస్తున్నప్పుడు ఈ ఘర్షణలు చెలరేగాయి. అయితే, కూల్చివేత డ్రైవ్ సమయంలో, […]
Read more

యూఎస్‌తో సంబంధాల బలోపేతానికి లాబీయిస్ట్‌ను నియమించుకున్న భారత్‌!

న్యూఢిల్లీ: ట్రంప్ హయాంలో అమెరికా, భారతదేశం మధ్య సంబంధాలు వేగంగా దెబ్బతిన్నందున జాసన్‌ మిల్లర్ (మాజీ ట్రంప్ సలహాదారు) నేతృత్వంలోని SHW పార్ట్నర్స్ LLC అనే సంస్థను మన దౌత్య మిషన్, భారత లాబీయిస్టుగా నియమించుకుంది. దీనికి గాను1.8 మిలియన్‌ డాలర్లు చెల్లిస్తామంటూ ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా, ఈ లాబీయిస్టులు వాణిజ్యం, రక్షణ, దౌత్యపరమైన విషయాలలో అమెరికా ప్రభుత్వంలో, కాంగ్రెస్‌లో భారతదేశ ప్రయోజనాలను ప్రోత్సహించడానికి కీలక పాత్ర పోషిస్తారు. అంతేకాదు అమెరికా అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయడం, […]
Read more
1 11 12 13 14 15 143

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.