Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

కార్మికులకు రేవంత్‌ సర్కారు గుడ్‌న్యూస్‌… కనీస వేతనాల పెంపు!

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా 1.11 కోట్ల మంది కార్మికులకు ప్రయోజనం చేకూర్చేలా కనీస వేతనాలను భారీగా సవరించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కొత్త రేట్లు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని కేబినెట్ ఉపసంఘం ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా ఈ సవరణ జరిగిందని, ఈ సంఘం తన నివేదికను ఖరారు చేసే ముందు సంబంధిత వర్గాలన్నింటినీ సంప్రదించిందని సీఎం తెలిపారు. నాలుగు వర్గాలు, మూడు జోన్లుకార్మికులను […]
Read more

విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో భాగస్వామి కానున్న కాంగ్రెస్!

చెన్నై: దాదాపు 59ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తమిళనాడు మంత్రివర్గంలోకి కాంగ్రెస్‌ పార్టీ చేరనుంది.జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని మంత్రివర్గంలోకి ఆ పార్టీ శాసనసభ్యులు ఎస్. రాజేష్ కుమార్, పి. విశ్వనాథన్‌ల చేరికను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదించారని, వారు నేడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ తెలిపారు. కాగా, విశ్వనాథన్ మేలూరు (మదురై) నుండి ఎన్నిక కాగా, రాజేష్ కుమార్ కిల్లియూర్ నియోజకవర్గం (కన్యాకుమారి) నుండి గెలుపొందారు. కాగా, […]
Read more

ప్రధాని మోదీని ప్రశ్నించిన నార్వే జర్నలిస్ట్‌కు ఫేస్‌బుక్‌ షాక్!

న్యూఢిల్లీ: నార్వే పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీని సూటిగా ప్రశ్నించి వార్తల్లో నిలిచిన ఓస్లోకు చెందిన జర్నలిస్ట్ హెలె లింగ్, తన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను మెటా నిలిపివేసింది. ఈమేరకు నిన్న ఆమె X లో పెట్టిన ఒక పోస్ట్‌లో, రోజంతా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోకి లాగిన్ అవ్వడానికి ఇబ్బంది పడ్డానని, చివరికి అది నిలిపివేసారని లింగ్ వెల్లడించారు. తన ఫేస్‌బుక్ ఖాతా కూడా నిలిపివేసినట్లు ఆమె ధృవీకరించారు. “మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్ లేదా […]
Read more

తెలంగాణలో ఠారెత్తిస్తున్న ఎండలు… ఏకంగా 47 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు!

హైదరాబాద్: తెలంగాణలో ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఈ వేసవి కాలంలో తొలిసారిగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దాదాపు 47 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. నిన్న ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4:30 గంటల మధ్య తెలంగాణ అభివృద్ధి, ప్రణాళిక సంఘం పరిశీలన ప్రకారం, రాష్ట్రంలోనే అత్యధికంగా నిర్మల్ జిల్లాలోని దిలావర్‌పూర్‌లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత హనుమకొండలోని ధర్మసాగర్, కరీంనగర్‌లోని చొప్పదండి, పెద్దాపల్లిలోని ఓడెలలో 46.4 డిగ్రీల సెల్సియస్ […]
Read more

గాజా ఫ్లోటిల్లా కార్యకర్తలను ఎగతాళి చేస్తూ వీడియో పోస్ట్ చేసిన ఇజ్రాయెల్ మంత్రి!

టెల్‌అవీవ్‌: ఇజ్రాయెల్ భద్రతా మంత్రి ఇటామర్ బెన్-గ్విర్ నిన్న ఒక వీడియోను పోస్ట్ చేయడంతో తీవ్ర విమర్శలకు గురయ్యారు. గాజాకు వెళ్తున్న గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లాకు చెందిన కార్యకర్తలను ఇజ్రాయెల్ దళాలు అడ్డగించి, నిర్బంధించిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ‘ఇజ్రాయెల్‌కు స్వాగతం’ అనే శీర్షికతో X అనే వెబ్ సైట్‌లో షేర్ చేసిన ఈ ఫుటేజ్‌లో, అష్డోడ్ పోర్ట్ సమీపంలోని ఒక నిర్బంధ కేంద్రంలో కార్యకర్తలు మోకాళ్లపై కూర్చొని, వారి చేతులు వెనుకకు కట్టేసి, తలలు […]
Read more

విద్యారంగానికి ఐదువేల కోట్లు ఇవ్వండి…కేంద్రాన్ని కోరిన భట్టి విక్రమార్క!

న్యూఢిల్లీ: తెలంగాణ అభివృద్ధి అజెండాకు, ముఖ్యంగా విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భారీ సంస్కరణలకు మద్దతుగా అదనపు కేంద్ర సహాయం, ఆర్థిక వెసులుబాట్లు కల్పించాలని కోరుతూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు ఇప్పటికే కేటాయించిన రూ. 4,208 కోట్లకు అదనంగా, ‘మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయ పథకం’ (SASCI) కింద మరో రూ. 5,000 కోట్లను మంజూరు […]
Read more

కడప అల్మాస్‌పేట ఘర్షణలపై ఏపీసీఆర్‌ నిజ నిర్ధారణ నివేదిక!

కడప…ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో ఓ ప్రముఖ నగరం. అత్యంత ప్రభావవంతమైన ముఖ్యమంత్రులలో ఒకరైన వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఈ ప్రాంతం నుంచే వచ్చారు. ఈ నగరం చాలా వైవిధ్యభరితమైనది కూడా. జనాభాలో 45-50% ముస్లింలు ఉన్నారు. ఇక్కడ ఉన్న ఓ వాణిజ్య కూడలి అల్మాస్‌పేట్ సర్కిల్. కాగా, ఈ జంక్షన్‌కు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో విరోచితంగా పోరాడి మరణించిన మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ పేరును పెట్టాలని స్థానిక ముస్లింలు, పౌర సంఘాలు కోరుకుంటున్నాయి. […]
Read more

అడవి బిడ్డల సంస్కృతికి సజీవ సాక్ష్యం గిరిజన మ్యూజియం!

హైదరాబాద్‌: గిరిజన మ్యూజియంలు అటవీ బిడ్డల జీవన విధానానికి, సంప్రదాయాలకు, ఆచార కట్టుబాట్లకు అద్దం పట్టే సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఆధునిక సమాజంలో అంతరించిపోతున్న గిరిజన సంస్కృతిని కాపాడటంలో మరియు వాటిని భావితరాలకు అందించడంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయని గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి కమ్ డైరెక్టర్ బి.ఎం. సంతోష్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలో ఘనంగా వేడుకలు జరిగాయి. నెహ్రూ శతజయంతి గిరిజన మ్యూజియంలో […]
Read more

ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితి పెంచిన తెలంగాణ!

హైదరాబాద్: నిరుద్యోగ యువత నుండి పదే పదే వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి గరిష్ట వయోపరిమితిని 10 ఏళ్లు పెంచింది. దీంతో వివిధ విభాగాల పోస్టుల భర్తీకి రాబోయే ప్రత్యక్ష నియామకాలలో, వయోపరిమితిని 34 ఏళ్ల నుండి 44 ఏళ్లకు పెరిగింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఈ ఏడాది జూన్‌లో ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర […]
Read more

ఎల్‌టీటీఈ ప్రభాకరన్‌కు విజయ్‌ నివాళి…కాంగ్రెస్‌ను విమర్శించిన బీజేపీ!

చెన్నై: తమిళనాడు సూపర్ స్టార్‌గా ఎదిగి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్, నిషేధిత సంస్థ ‘లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం’ (LTTE) వ్యవస్థాపకుడు వి. ప్రభాకరన్‌కు నివాళి అర్పించడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ విషయంపై BJP కాంగ్రెస్‌పై పరోక్ష విమర్శలు గుప్పించింది. LTTE సంస్థే తన తండ్రి, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకు కారణమని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి గుర్తుచేసే ప్రయత్నం చేసింది. విజయ్‌ను సమర్థిస్తూ, ఆయన పార్టీ అయిన […]
Read more
1 12 13 14 15 16 194

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.